Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తుల కోసం ఆప్తులు, తోడబుట్టిన వారిని కాదనుకుంటున్నారు కొందరు వ్యక్తులు.. తాజాగా ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. డబ్బుపై ఉన్న మోజుతో ఓ మహిళ ఏకంగా త తనను,తల్లిని మోసం చేసి ఆస్తి మెత్తం కాజేసిందని అంధ దంపతులు సోదరి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన కుంట్ల రాజిరెడ్డికి వృద్ధురాలైన తల్లి, సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. రాజిరెడ్డి, జ్యోతిలు దంపతులు ఇద్దరూ అంధులైన దివ్యాంగులు. అయితే రాజిరెడ్డికి తన తండ్రి నుండి నాలుగు ఎకరాల భూమి సంక్రమించింది. రాజిరెడ్డి దంపతులు అందులు కావడంతో వారి బాగోగులను అతని సోదరి మంజుల, ఆమె భర్త సత్తిరెడ్డి చూసుకునేవారు. అయితే డబ్బు మీద ఉన్న మోజుతో చెల్లి రక్త సంబంధాన్ని మరిచిన అన్న ఆస్తిపై కన్నేసింది. అన్నను ఆప్యాయంగా చూసుకుంటూనే కోట్ల విలువైన భూమిని నెమ్మదిగా కాజేసింది. ఇంకా అత్యాశ చావని మంజూల తల్లి కుంట్ల సత్యమ్మ ఇంటిపై కూడా కన్నేసింది.
తన తండ్రి చనిపోయిన తర్వాత సోదరులు, తల్లికి తెలియకుండా నకిలీ పత్రాలతో మంజుల ఆ ఇంటిని తన పేరుపైకి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇక ఇళ్లు తనపై ఉండడంతో తన భర్తతో కలిసి వృద్ధురాలైన తల్లిని ఇంటి నుండి బయటకు గెంటేసింది.దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తల్లి సత్తమ్మ తమకు న్యాయం చేయాలని కోరుతూ కూతురి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
రోజురోజుకూ మనుషుల మధ్య ఉన్న బంధాల కంటే డబ్బుకే ప్రాధాన్యత పెరుగుతుంది. డబ్బుపై ఉన్న మోజుతో ఇలా రక్త సంబంధాలనే దూరం చేసుకుంటున్నారు. మరి కొందరైతే ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. దీంతో మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మానవ సంబంధాలకు అర్థమే లేకుండా పోతుంది అంటున్నారు నిపుణులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
