AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi liquor scam case: ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ‘తెలంగాణ తల వంచదు..’

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..

Delhi liquor scam case: ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. 'తెలంగాణ తల వంచదు..'
MLC Kavitha
Srilakshmi C
|

Updated on: Mar 08, 2023 | 11:12 AM

Share

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు ఎమ్మెల్సీ కవితకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..

‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 10న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాం. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తును కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.