AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన రేవంత్‌కు లోక్‌సభ సవాల్‌..! టీవీ9 ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ముందే చెప్పా, తెలంగాణలో మార్పు వస్తుందని కూడా ముందే చెప్పా. అదే జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Revanth Reddy అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన రేవంత్‌కు లోక్‌సభ సవాల్‌..! టీవీ9 ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
Revanth Reddy In Tv9
Balaraju Goud
| Edited By: |

Updated on: May 09, 2024 | 11:12 PM

Share

18వ లోక్‌సభ ఎన్నికలను కాంగ్రె, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒక వైపు 400 ప్లస్‌ టార్గెట్‌తో వెళ్తున్న బీజేపీ. ఇక్కడేమో 14+ టార్గెట్. గెలిస్తేనే.. కడుపులో చల్ల కదలకుండా పరిపాలన అనే పరిస్థితి. మరి.. సీఎం రేవంత్‌ వ్యూహాలేంటి? 14+పై ఇస్తున్న గ్యారెంటీ ఏంటి? వంటి పలు కీలక అంశాలపై టీవీ9కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌ సంధించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ముందే చెప్పా, తెలంగాణలో మార్పు వస్తుందని కూడా ముందే చెప్పా. అదే జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు దక్కుతున్న రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

బీజేపీ కుట్రలే ఎన్నికల్లో ప్రధాన అజెండా అన్న రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాత్ర లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అన్నారు సీఎం. డిసెంబర్‌లో సెమీఫైనల్స్‌ జరిగాయి. మే 13న ఫైనల్స్ జరగబోతున్నాయన్నారు రేవంత్. జెండా మారింది ఎజెండా మారింది.. ఎన్నికల పంథా మారిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ సారి ఎన్నికలతో బీజేపీ కథ ముగిసిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…