AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఈడీ నోటిసులపై కేసీఆర్ స్పందన.. ‘కవిత వరకు వచ్చారు.. ఏం చేస్తారో చూద్దాం’ అంటూ..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే..

CM KCR: ఈడీ నోటిసులపై కేసీఆర్ స్పందన.. ‘కవిత వరకు వచ్చారు.. ఏం చేస్తారో చూద్దాం’ అంటూ..
KCR On Delhi Liquor Scam Issue
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 10, 2023 | 7:04 PM

Share

గత కొన్ని నెలలుగా ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారం తెలంగాణ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ నోటిసులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. ఇంకా కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో పాటు కవిత వరకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దాం: సీఎం కేసీఆర్‌. ప్రజాస్వామ్య, న్యాయబద్దంగానే ఎదుర్కొందాం. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్​ఎస్​ కీలక పాత్ర పోషించాలి. బీజేపీని ఓడించేందుకు 99 శాతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తాం. ఆ క్రమంలో శాసనసభ్యులు తప్పులు చేయొద్దు. తప్పు చేసిన వారికి టికెట్లు దక్కవు’ అని సీఎం కేసీఆర్ ఒక పక్క బీజేపీకి ధీటుగా  సమాధానం ఇస్తూనే.. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..