AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫాదర్స్‌ డే రోజున దారుణం.. భార్యపై కోపంతో కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలిక మృతి

చేయి పట్టి మనల్ని నడిపించిన నాన్నశ్రమను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ అందరూ ఫాదర్స్‌ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రితో తమకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి ఫాదర్స్‌ డే విషెస్‌ చెబుతున్నారు. అయితే ఫాదర్స్‌ డే రోజునే ఒక దారుణం చోటుచేసుకుంది.

Telangana: ఫాదర్స్‌ డే రోజున దారుణం.. భార్యపై కోపంతో కూతురిని మంటల్లో తోసేసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలిక మృతి
Representative Image
Basha Shek
|

Updated on: Jun 18, 2023 | 10:10 AM

Share

చేయి పట్టి మనల్ని నడిపించిన నాన్నశ్రమను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ అందరూ ఫాదర్స్‌ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రితో తమకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారికి ఫాదర్స్‌ డే విషెస్‌ చెబుతున్నారు. అయితే ఫాదర్స్‌ డే రోజునే ఒక దారుణం చోటుచేసుకుంది. చేయి పట్టి నడక నేర్పించాల్సిన నాన్న కూతురిని మంటల్లో తోసేశాడు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాలతో కూతురిని మంటల్లో తోసేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలం బుస్సా పూర్‌లో చోటు చేసుకుంది. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని కక్ష పెంచుకున్న నిందితుడు కాశిరాం.. గత నెలలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చి.. బట్టలకు నిప్పు పెట్టి, అదే మంటల్లో కుతూరును తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు. ఈ దంపతులకు సితారి సమ్మక్క (10), సితారి సారక్క (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కాశీరాం దంపతులు బుస్సాపూర్‌ గ్రామానికి వలస వచ్చారు .అయితే అదే రోజు భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పోసాని చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తీవ్ర కోపోద్రిక్తుడైన కాశీరాం ఇంటికి నిప్పు పెట్టాడు. మొదట పిల్లల దుస్తులను వేసిన అతను ఆ తర్వాత చిన్న కూతురు సారక్కను కూడా తోసేశాడు. పెద్ద కుమార్తె మాత్రం పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ