క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంట విషాదం..

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట విషాదం చోటు చేసుకుంది. అతడి పెంపుడు కుక్క బ్రూనో ఇవాళ మరణించింది. ఇక ఈ విషయాన్నీ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. బ్రూనోతో గత 11 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశాడు. అతని భార్య అనుష్క శర్మ కూడా బ్రూనో ఆత్మకి శాంతి చేకూరాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ పెట్ లవర్ అని అందరికీ […]

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంట విషాదం..
Follow us

|

Updated on: May 06, 2020 | 12:05 PM

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట విషాదం చోటు చేసుకుంది. అతడి పెంపుడు కుక్క బ్రూనో ఇవాళ మరణించింది. ఇక ఈ విషయాన్నీ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. బ్రూనోతో గత 11 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశాడు. అతని భార్య అనుష్క శర్మ కూడా బ్రూనో ఆత్మకి శాంతి చేకూరాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ పెట్ లవర్ అని అందరికీ తెలిసిన విషయమే. ఐపీఎల్‌ సమయంలో తరచూ బెంగళూరులోని కుక్కల సంరక్షణా కేంద్రాన్ని తరుచూ సందర్శించేవాడు. కాగా, కరోనా వైరస్ కారణంగా కోహ్లీ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. తన కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా బ్రూనోతో కలిసి దిగిన ఫోటోను విరాట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

View this post on Instagram

♥️ Bruno ♥️ RIP ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on