Video: పారిస్ ఒలింపిక్స్లో ‘ఇండియా హౌస్’.. సందర్శకులతో కలిసి నీతా అంబానీ డ్యాన్స్
Nita Ambani Dance Video: పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ తొలి రోజే కాంస్య పతకంతో ఖాతా ఓపెన్ చేసింది. గేమ్స్ సాగే కొద్ది పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, అథ్లెట్ల కోసం పారిస్ ఒలింపిక్స్ విలేజ్లో ‘ఇండియా హౌస్ (India House)’ను ఏర్పాటు చేశారు. ఐఓసీ మెంబర్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఈ ఇండియా హౌస్ని ఓపెన్ చేశారు.
![Video: పారిస్ ఒలింపిక్స్లో ‘ఇండియా హౌస్’.. సందర్శకులతో కలిసి నీతా అంబానీ డ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nita-ambani-1.jpg?w=1280)
Nita Ambani
Nita Ambani: పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ తొలి రోజే కాంస్య పతకంతో ఖాతా ఓపెన్ చేసింది. గేమ్స్ సాగే కొద్ది పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, అథ్లెట్ల కోసం పారిస్ ఒలింపిక్స్ విలేజ్లో ‘ఇండియా హౌస్ (India House)’ను ఏర్పాటు చేశారు. ఐఓసీ మెంబర్, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఈ ఇండియా హౌస్ని ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఆ ఇంటి విశేషాలను నీతా అంబానీ ఓ వీడియోలో పంచుకున్నారు.
ఈ ఇండియా హౌస్ను అథ్లెట్లను సత్కరించేందుకు, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఓ చిహ్నంలా ఈ ఇంటిని ఏర్పాటుచేశామని ఆమె అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కళాకారులతో కలిసి నీతా కూడా డ్యాన్స్ చేశారు.
ఇవి కూడా చదవండి