![పారిస్ ఒలింపిక్స్ 2024](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/paris-olympics-1.jpg)
పారిస్ ఒలింపిక్స్ 2024
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 33వ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఈ మెగా బ్యాటిల్ ఆఫ్ స్పోర్ట్స్ 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. 100 ఏళ్ల తర్వాత పారిస్లో ఒలింపిక్స్ నిర్వహిస్తుండటం విశేషం. గతంలో పారిస్ నగరంలో 1900, 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత, మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం పారిస్. పారిస్ ఒలింపిక్స్లో 329 ఈవెంట్లు జరగనుండగా, 19 రోజుల పాటు 32 క్రీడా పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఒలంపిక్స్ క్రీడల కోసం మొత్తం రూ. 81 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఒలంపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలంపిక్స్లో భారత్ 7 పతకాలు సాధించింది. భారత ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదేకావడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్లో భారత్ 6 పతకాలు సాధించింది.
Paris Olympics: కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్చేస్తే.. పారిస్లో సత్తా చాటేందుకు సిద్ధం
Antim Panghal: 2004లో హర్యానాలోని ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె ముగ్గురు సోదరీమణులలో చిన్నది. అందుకే ఆమెకు 'ఆఖ్రీ' అంటే చివరిదని పేరు పెట్టారు. ఈమె సోదరి సరిత జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. ఈమెకు కేవలం 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తన సోదరి సరిత హిసార్లోని మహావీర్ స్టేడియంకు రెజ్లింగ్ ప్రోగ్రామ్ కోసం తీసుకువెళ్లింది. ఇక్కడ నుంచి అంతిమ్కు కుస్తీపై ఆసక్తి ఏర్పడింది.
- Venkata Chari
- Updated on: Jul 15, 2024
- 9:10 pm
Olympic Medal: క్రీడాకారులు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Why Players Bite Olympic Medal: క్రీడల మహాకుంభం అంటే ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . ఈసారి ఒలింపిక్స్ను పారిస్లో నిర్వహిస్తున్నారు. ఈ అతిపెద్ద క్రీడల ఈవెంట్లో 10 వేల మందికి పైగా క్రీడాకారులు పతకాలు సాధించడం కనిపిస్తుంది. ప్రతి క్రీడాకారుడికి ఒకే ఒక కల ఉంటుంది. అది తన దేశం కోసం పతకం సాధించడం. ఒలింపిక్ పతకాలు గెలిచిన తర్వాత ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి లోనవడం చూసే ఉంటారు. పతకం గెలిచిన తర్వాత దాన్ని పళ్లతో కొరుకుతూ కనిపిస్తుంటారు.
- Venkata Chari
- Updated on: Jul 15, 2024
- 8:53 pm
Paris Olympics: అస్సాం వీధుల నుంచి ఒలింపిక్స్ వరకు.. పారిస్లో బంగారు పతకంపై కన్నేసిన రైతు బిడ్డ..
Boxer Lovlina Borgohain: క్రీడల మహాకుంభం అంటే ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి ప్రారంభం కానుంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా ఒలింపిక్స్పై అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈసారి పారిస్లో ఆటగాళ్లు ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని భారత్ భావిస్తోంది. ఈ క్రీడాకారిణులలో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ పేరు కూడా చేరింది. ఆమె పతకాన్ని గెలుచుకున్న అతిపెద్ద పోటీదారులలో ఒకరిగా మారింది.
- Venkata Chari
- Updated on: Jul 14, 2024
- 5:57 pm
Paris Olympics: 9 ఏళ్లకే తండ్రిని కోల్పోయింది, తల్లికి క్యాన్సర్.. కట్చేస్తే.. ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమైన దంగల్ క్వీన్..
Paris Olympics 2024, Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ కెరీర్లో పారిస్ ఒలింపిక్స్ మూడో ఒలింపిక్స్. ఆమె ఇప్పటి వరకు పెద్ద టైటిళ్లను గెలవలేదు. కానీ, ఆమె ఇప్పటికీ తన మొదటి ఒలింపిక్ పతకం కోసం ఎదురుచూస్తోంది. వినేష్ ఫోగట్ భారతదేశపు అత్యంత విజయవంతమైన రెజ్లర్లలో ఒకరిగా నిలిచింది.
- Venkata Chari
- Updated on: Jul 14, 2024
- 4:16 pm
Paris Olympics 2024: ప్రపంచ నెంబర్ 3తో తలపడనున్న లక్ష్యసేన్.. ఈజీ గ్రూపులో చేరిన తెలుగు తేజం.. పూర్తి వివరాలు మీకోసం
Paris Olympics Badminton Draw 2024: పారిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ లక్ష్య సేన్ గ్రూప్ మ్యాచ్లోనే ప్రపంచ 3వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడాల్సి ఉంటుంది. లక్ష్యతో పోలిస్తే, పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ల బృంద ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలు జులై 27 నుంచి ప్రారంభం కానున్నాయి.
- Venkata Chari
- Updated on: Jul 14, 2024
- 9:46 am
Paris Olympics: ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏదో తెలుసా.. భారత్ ఎక్కడుందంటే?
Paris Olympics 2024: ఒలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. ఈ ముప్పై ఐదు పతకాలలో 10 బంగారు పతకాలు. కానీ 8 బంగారు పతకాలు హాకీ జట్టుకే దక్కడం విశేషం. మిగతా 2 పతకాలు వ్యక్తిగతంగా సాధించారు. అంటే జట్టుతో పాటు ఇద్దరు భారతీయులు పోటీదారుగా బంగారు పతకం సాధించడంలో సఫలమయ్యారు.
- Venkata Chari
- Updated on: Jul 13, 2024
- 3:04 pm
Paris Olympics 2024: మరో స్వర్ణంపై కన్నేసిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్లో ప్రయాణం ఎలా ఉందంటే?
Paris Olympics 2024 Neeraj Chopra Biography: ఒలింపిక్స్ 2024కి ఇప్పుడు కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ అతిపెద్ద ఈవెంట్ జులై 26 నుంచి పారిస్లో ప్రారంభమవుతుంది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 124 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈసారి ఈవెంట్లో మొత్తం 112 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. గతసారి జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన వారిలో నీరజ్ చోప్రా కూడా ఒకరు.
- Venkata Chari
- Updated on: Jul 12, 2024
- 4:14 pm
పారిస్కు వెళ్లే భారత ఒలింపిక్ జట్టులో ఇద్దరు ఏపీ అమ్మాయిలు.. పేదరికం నుంచి ఒకరు, నాన్న కోరిక మేరకు మరొకరు..
Paris Olympics 2024: జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు జ్యోతి యర్రాజీ (24), దండి జ్యోతిక శ్రీ (23) చోటు దక్కించుకున్నారు. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో వైజాగ్ హర్డిలర్ జ్యోతి పాల్గొంటుంది. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక శ్రీ 4x400 మీటర్ల రిలే టీమ్లో పాల్గొంటుంది. ఇద్దరు అథ్లెట్లు వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు.
- Venkata Chari
- Updated on: Jul 12, 2024
- 11:59 am
Andhra Lace: ఇది కదా తెలుగువారి సత్తా..! ఒలింక్ క్రీడాకారులకు నర్సాపురం లేస్ ఉత్పత్తులు..!
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలంపిక్స్ ఈసారి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం వేదిక కానుంది. యూరప్లో జరిగే ఈ విశ్వక్రీడల్లో ఈ సారి మన. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురలో తయారైన చేతి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
- B Ravi Kumar
- Updated on: Jul 12, 2024
- 12:00 pm
Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్కు మన తెలంగాణ బిడ్డ.. టీటీ ఈవెంట్లో ఆకుల శ్రీజకు స్థానం
ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
- Basha Shek
- Updated on: Jul 12, 2024
- 1:22 pm
Paris Olympics: తక్కువ స్కోర్ ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్లో భారత షూటర్కు ఛాన్స్.. కారణం ఏంటో తెలుసా?
Shooter Karan: NRAI గత ఏడాది నవంబర్లో జారీ చేసిన సర్క్యులర్లో 'షాట్గన్ ఎంపిక ప్రమాణాల ప్రకారం ఎంపిక ట్రయల్స్ 2024' అని ప్రకటించింది. అతని ప్రకారం, 66వ జాతీయ ఛాంపియన్షిప్ సమయంలో సీనియర్ పురుషుల ట్రాప్లో 110 స్కోర్తో షూటర్లు డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్య జరిగే ప్రాక్టీస్కు అర్హులు.
- Venkata Chari
- Updated on: Jul 12, 2024
- 12:01 pm