
పారిస్ ఒలింపిక్స్ 2024
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 33వ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఈ మెగా బ్యాటిల్ ఆఫ్ స్పోర్ట్స్ 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. 100 ఏళ్ల తర్వాత పారిస్లో ఒలింపిక్స్ నిర్వహిస్తుండటం విశేషం. గతంలో పారిస్ నగరంలో 1900, 1924 సంవత్సరాలలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించారు. లండన్ తర్వాత, మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం పారిస్. పారిస్ ఒలింపిక్స్లో 329 ఈవెంట్లు జరగనుండగా, 19 రోజుల పాటు 32 క్రీడా పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఒలంపిక్స్ క్రీడల కోసం మొత్తం రూ. 81 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఒలంపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలంపిక్స్లో భారత్ 7 పతకాలు సాధించింది. భారత ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదేకావడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్లో భారత్ 6 పతకాలు సాధించింది.
Manu Bhaker: మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన..
స్టార్ షూటర్, ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ వారిని ఢీకొట్టి పరారయ్యాడు.
- Basha Shek
- Updated on: Jan 19, 2025
- 2:19 pm
Olympics 2036: భారత్లోనే 2036 ఒలింపిక్స్? లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపిన ఐఓఏ
Olympics 2036 In India: భారత ఒలింపిక్ సంఘం (IOA) 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని అక్టోబర్ 1న ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. దీంతో పీఎం మోడీ సంకల్పానికి కీలక అడుగుపడినట్లైంది.
- Venkata Chari
- Updated on: Nov 5, 2024
- 6:25 pm
Dipa Karmakar Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే వీడ్కోలు
Dipa Karmakar Career: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. జిమ్నాస్టిక్స్కు 25 ఏళ్లు కేటాయించిన ఆమె.. ఎట్టకేలకు ఈ క్రీడకు గుడ్బై చెప్పింది. దీపా నిరంతరం గాయపడుతుండడంతో చివరికి ఆమె రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.
- Venkata Chari
- Updated on: Oct 7, 2024
- 6:45 pm
Manu Bhaker: బాబోయ్.! పిస్టల్ ధర రూ.కోటి.? అసలు విషయం చెప్పిన మను బాకర్
మను బాకర్.. పరిచయం అవసరం లేని అథ్లెట్.. ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.. మను బాకర్..అటు తన ప్రతిభతో ఇటు అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ యువ అథ్లెట్..చిన్న వయస్సులోనే షూటింగ్ విభాగంలో మను అడుగుపెట్టింది
- Velpula Bharath Rao
- Updated on: Sep 26, 2024
- 6:05 pm
Telangana: తెలంగాణలో తొలిసారి మహిళా ఛాంపియన్కు పోలీస్ జాబ్.. డీఎస్పీ పదవిని చేపట్టనున్న నిఖత్ జరీన్
Nikhat Zareen: ప్రముఖ క్రీడాకారిణి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పదవిని కేటాయించింది. రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ని తెలంగాణ పోలీస్ విభాగంలో ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Sep 18, 2024
- 8:38 pm
Manu Bhaker Video: గురిపెట్టి గుండెల్లో కొట్టిందిగా..! చీరకట్టులో మెరిసిన ‘షూటింగ్’ సుందరి.. శారీ ధరెంతంటే?
Manu Bhaker spotted on the set of KBC 16: పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మను పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వివిధ సన్మాన వేడుకలకు హాజరవడం కనిపించింది. అదే సమయంలో, ఇప్పుడు ఆమె KBC లోనూ తన మ్యాజిక్ చూపించనుంది. ఎక్కడ చూసినా మను అథ్లెటిక్, క్యాజువల్ వేర్లో కనిపిస్తుంటుంది. తొలిసారిగా ఎథ్నిక్ డ్రెస్లో కనిపించింది. మను ఈ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
- Venkata Chari
- Updated on: Aug 31, 2024
- 10:36 am
Paris Paralympics 2024: పారాలింపిక్స్కు సిద్ధం.. 84 మంది ఆటగాళ్లతో బయల్దేరిన భారత్
Paris Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి 1 రజతం, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 6 పతకాలను కైవసం చేసుకున్నారు. కానీ, గోల్డ్ మెడల్ కల నెరవేరలేదు. అయితే, పారిస్లో బంగారు పతకం సాధించాలనే ఆశ ఇంకా సజీవంగానే ఉంది.
- Venkata Chari
- Updated on: Aug 25, 2024
- 10:03 pm
మను భాకర్, నీరజ్ చోప్రాలపై కోట్ల వర్షం.. పతక విజేతలకు హర్యానా ప్రభుత్వం ఊహించని గిఫ్ట్
అలాగే రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్కు రూ.2.50 కోట్లు అందించారు. దీని ద్వారా పారిస్ ఒలింపిక్స్లో రాణించిన రాష్ట్ర క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రోత్సహించింది. మను భాకర్తో కలిసి ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ షూటింగ్లో కాంస్య పతకం సాధించిన సరబ్జోత్సింగ్కు హర్యానా ప్రభుత్వం 2.5 కోట్లు బహుకరించింది.
- Venkata Chari
- Updated on: Aug 19, 2024
- 2:39 pm
Video: వివాదంలో పాక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్తో ములాఖత్.. సంచలన వీడియో
ఒలింపిక్స్లో పాకిస్తాన్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీంకు టెర్రర్ నేతలు అండగా ఉన్నారా ? నదీంను లష్కర్ టాప్ నేత హరీస్ డార్ కలిసి శుభాకాంక్షలు చెప్పడంపై వివాదం రాజుకుంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్న హరీస్తో నదీం ఎలా వేదికను పంచుకుంటాడన్న విమర్శలు వస్తున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Aug 13, 2024
- 9:41 pm
వామ్మో.. ఒలింపిక్స్లో పతకం గెలవకుంటే ఫనిష్మెంటే.. లైవ్గా నరకం చూపిస్తారంట.. ఎక్కడో తెలుసా?
North Korea Athletes Punishment After Failed Win Medal: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఇందులో పలు దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. కొందరు బంగారు పతకాలు, మరికొందరు రజత పతకాలు సాధించగా, మరికొందరు కాంస్య పతకాలు సాధించారు. అయితే, ఒక్క పతకం కూడా రాని క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఉత్తర కొరియా అథ్లెట్లు కూడా అనేక క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు. కానీ, పతకాలు లేకుండానే వెనుదిరగాల్సిన అథ్లెట్లు కూడా ఎందరో ఉన్నారు.
- Venkata Chari
- Updated on: Aug 13, 2024
- 9:07 pm