AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌కు సిద్ధం.. 84 మంది ఆటగాళ్లతో బయల్దేరిన భారత్

Paris Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి 1 రజతం, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 6 పతకాలను కైవసం చేసుకున్నారు. కానీ, గోల్డ్ మెడల్ కల నెరవేరలేదు. అయితే, పారిస్‌లో బంగారు పతకం సాధించాలనే ఆశ ఇంకా సజీవంగానే ఉంది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌కు సిద్ధం.. 84 మంది ఆటగాళ్లతో బయల్దేరిన భారత్
Paris Paralympics 2024
Venkata Chari
|

Updated on: Aug 25, 2024 | 10:03 PM

Share

Paris Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి 1 రజతం, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 6 పతకాలను కైవసం చేసుకున్నారు. కానీ, గోల్డ్ మెడల్ కల నెరవేరలేదు. అయితే, పారిస్‌లో బంగారు పతకం సాధించాలనే ఆశ ఇంకా సజీవంగానే ఉంది. ఆగస్టు 28 నుంచి పారిస్‌లో ప్రారంభం కానున్న పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని భారత అథ్లెట్లు ఆకాంక్షించారు. ఈ పారాలింపిక్స్‌లో 207 దేశాలకు చెందిన 4400 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వివిధ క్రీడలలో 549 బంగారు పతకాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కోసం భారత జట్టు కూడా ఈరోజు పారిస్ వెళ్లింది.

భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా, హెడ్ ఆఫ్ మిషన్ సత్య ప్రకాష్ సంగ్వాన్ నేతృత్వంలోని 179 మంది సభ్యుల బృందం (84 మంది పోటీదారులు, అధికారులతో సహా) ఈ రోజు పారిస్ బయలుదేరింది. కొంతమంది ఆటగాళ్ళు పారిస్ వెలుపల పోటీలో పాల్గొంటున్నందున ‘ఆటగాళ్లందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి’ తాను గేమ్స్ విలేజ్ వెలుపల ఉంటానని జజారియా తెలియజేశాడు.

84 మంది పోటీదారులు..

భారతదేశం నుంచి మొత్తం 84 మంది పోటీదారులు పాల్గొంటారు. మిగిలిన 95 మందిలో వ్యక్తిగత శిక్షకులు, సహాయకులు ఉంటారు. ఈ విధంగా, భారత బృందం మొత్తం 179 మంది సభ్యులను కలిగి ఉంది. ఈ 95 మంది అధికారులలో 77 మంది టీమ్ అధికారులు, తొమ్మిది మంది టీమ్ మెడికల్ ఆఫీసర్లు, తొమ్మిది మంది ఇతర టీమ్ అధికారులు ఉన్నారు. ఈ పారాలింపిక్స్‌లో భారత్ 12 క్రీడాంశాల్లో పాల్గొనగా 84 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడనున్నారు.

గతసారి 19 పతకాలు..

2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో 54 మంది భారతీయ అథ్లెట్లు తొమ్మిది క్రీడాంశాల్లో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ మిషన్, పారా బ్యాడ్మింటన్‌లో ఒక టీమ్ మేనేజర్ మినహా మొత్తం జట్టు (ఆటగాళ్ళు, జట్టు అధికారులు, కోచ్‌లు) పాల్గొనే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. 2021 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) గెలుచుకుంది. ఇప్పటి వరకు భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..