ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..జాదవ్‌ కోలుకున్నాడు

ముంబయి: టీం ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో అతడు మైదానంలో విలవిల్లాడాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు కోలుకోవడంపై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వీటన్నింటికీ టీమిండియా ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ తెర దించారు. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని […]

ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..జాదవ్‌ కోలుకున్నాడు
Follow us

|

Updated on: May 18, 2019 | 1:32 PM

ముంబయి: టీం ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో అతడు మైదానంలో విలవిల్లాడాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు కోలుకోవడంపై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వీటన్నింటికీ టీమిండియా ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ తెర దించారు. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు.

మే 22న ప్రపంచకప్‌కు మిగతా జట్టు సభ్యులందరితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లడానికి జాదవ్‌ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా జాదవ్‌ కీలకం కానున్నాడు. బ్యాటుతోనే కాకుండా బౌలింగ్‌ పరంగానే జట్టుకు జాదవ్‌ ముఖ్యమే. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మంచి ప్రదర్శనే చేశాడు.