AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024: కొంచెం తీపి.. కొంచెం చేదు.. 2024లో టీమిండియా అందుకున్న విజయాలివే

2024 టీమిండియాకు మరుపురానిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదే టీమిండియా టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి స్టార్ క్రికెటర్లు టీ20లకు వీడ్కోలు పలికారు.

Year Ender 2024: కొంచెం తీపి.. కొంచెం చేదు.. 2024లో టీమిండియా అందుకున్న విజయాలివే
Team India
Basha Shek
|

Updated on: Dec 14, 2024 | 7:12 PM

Share

భారత క్రికెట్‌ జట్టుకు 2024 ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఏడాది టీమిండియా ఎన్నో మైలురాళ్లను సాధించింది. ముఖ్యంగా, 11 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ ప్రపంచ కప్‌ను గెల్చుకుంది. అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఈ టీ20 ప్రపంచకప్‌ భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. వెస్టిండీస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ క్రికెట్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మొత్తం టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకపోవడం ఈ ప్రపంచకప్‌లో మరో ప్రత్యేకత. రోహిత్ శర్మ సారథ్యంలో ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన భారత జట్టు బలమైన జట్లను ఓడించి ప్రపంచ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 17 ఏళ్ల తర్వాత మరోసారి టీ20 ఫార్మాట్ లో భారత క్రికెట్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.

నిజానికి 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ తొలి ఎడిషన్‌లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2016లో మళ్లీ ఫైనల్‌కు చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. కానీ ఈ టీ20 ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా అవతరించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి అత్యధికంగా 76 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున కేశవ్ మహరాజ్, ఎన్రిక్ నోకియా చెరో 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, కగిసో రబడా చెరో వికెట్ తీశారు.

177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో టైటిల్ కోల్పోయింది. ఆఫ్రికా తరఫున ఒంటరి పోరాటం చేసిన హెన్రిక్ క్లాసెన్ 52 పరుగులు, క్వింటన్ డి కాక్ 39 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 31 పరుగులు, డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా తరఫున హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ 1 వికెట్ కూడా తీశాడు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ అద్భుత విజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అతనితో పాటు, ఆ సమయంలో జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా తన పదవి నుంచా వైదొలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..