ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఐసీసీ టెస్ట్ ఫార్మాట్‌లోనూ వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. దీనిని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా పిలుస్తున్నారు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇప్పటికే రెండు ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్, రెండో ఎడిషన్ విజేతగా ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అయితే, ఈ రెండు ఎడిషన్లలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇక మూడవ ఎడిషన్ జూన్ 2023లో ది యాషెస్‌తో ప్రారంభమైంది. లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో అంటే జూన్ 2025లో ఇది ముగుస్తుంది. టోర్నీలో 27 సిరీస్‌లు, లీగ్ దశలో 69 మ్యాచ్‌లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లండన్‌లోని లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో పోటీపడతాయి. ప్రతి జట్టు ఆరు సిరీస్‌లను ఆడుతుంది. మూడు స్వదేశంలో, మూడు విదేశాలలో ఆడుతుంది. ప్రతి సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి

ఇంకా చదవండి

WTC Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?

WTC 2025 Final: ఐసీసీ నిబంధనల ప్రకారం, టెస్ట్ క్రికెట్‌లో 15 ఓవర్లు గంటలోపు వేయాల్సిందే. గాయం లేదా ఇతర కారణాలతో కాకుండా పదిహేను ఓవర్లు బౌలింగ్ చేయకుంటే పెనాల్టీ పడుతుంది. అలాగే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్లలోనూ కోత పడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఇలాంటి అద్భుతం జరిగితే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరుకోవచ్చు.

R Ashwin: అశ్విన్‌కు బిగ్ షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే ఇలా..

Ravichandran Ashwin's Record: రవిచంద్రన్ అశ్విన్ రాసిన ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా బౌలర్లు బద్దలు కొట్టారు. ఈ రికార్డును బద్దలు కొట్టడంతో పాట్ కమిన్స్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా ఎవరూ చేయలేని ప్రత్యేక మైలురాయిని తాకడం విశేషం.

Team India: టీమిండియా కొంపముంచిన ఆ మూడు.. కట్‌చేస్తే.. 10 ఏళ్ల తర్వాత ఘోర పరాజయం..

Indian Team Lost the Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని దక్కించుకుంది. ఈ సిరీస్ ఓటమిలో భారత జట్టు ఎన్నో తప్పదాలు చేసింది. దీంతో ట్రోఫీని కోల్పోవడమే కాక, ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి దూరమైంది. అలాగే, రోహిత్, కోహ్లీల చివరి సిరీస్ ఓటమితో ముగించాల్సి వచ్చింది.

Team India: ఆ ఇద్దరి సంగతి తేల్చేది అప్పుడే.. రోహిత్, కోహ్లీ కెరీర్లపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

Rohit Sharma and Virat Kohli Career May End: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా భారత జట్టు అధికారికంగా తప్పుకుంది.

WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టనున్న ఆస్ట్రేలియా..

Australia to Face South Africa in WTC 2025 Final: ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకుంది. అయితే, స్లో ఓవర్‌రేట్ కారణంగా పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందా లేదా అనేది ఐసీసీ తేల్చాల్చి ఉంది. ఐసీసీ నిర్ణయం తర్వాతే ఆస్ట్రేలియా అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

IND vs AUS: బుమ్రాపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. వీడియో చూపిస్తూ విషం కక్కుతోన్న ఆసీస్ ఫ్యాన్స్

టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసీస్ మీడియా విషం కక్కుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోన్నఈ స్టార్ పేసర్ పై లేని పోని ఆరోపణలు చేస్తోంది. తాజాగా బుమ్రా శాండ్ పేపర్ ను ఉపయోగించి బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఆస్ట్రేలియా అభిమానులు ఆరోపిస్తున్నారు.

Gautam Gambhir: గంభీర్ పోస్ట్ ఊస్టింగ్! టీమిండియా కొత్త కోచ్‌గా హైదరాబాదీ క్రికెటర్.. ఎప్పటినుంచంటే?

సిడ్నీ టెస్టు తొలిరోజే టీమిండియా విఫలమైంది. పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. కానీ టీమిండియా ఆటతీరు మాత్రం మారలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటర్లు మోకరిల్లారు. దీంతో టీమ్ ఇండియా తొలి రోజే వెనుకబడినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు గౌతమ్ గంభీర్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

IND vs AUS: సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో

భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కాఆ ఈ పిచ్ బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమానంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక వాతావరణ నివేదిక ప్రకారం సిడ్నీ టెస్టుకు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది.

Rohit Sharma: షాకింగ్ న్యూస్.. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ ఔట్.. ప్లేయింగ్ XIపై క్లారిటీ ఇచ్చేసిన గౌతమ్ గంభీర్?

Gautam Gambhir on Sydney Test Playing XI: సిడ్నీ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. గాయం కారణంగా ఆకాశ్‌దీప్‌కు దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అయితే, రోహిత్‌పై ప్రశ్నకు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Team India In 2025: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్.. కొత్త ఏడాదిలో బిజి బిజీగా టీమిండియా.. ఫుల్ షెడ్యూల్ ఇదే

టీమ్ ఇండియా 2025 ప్రారంభంలోనే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని ఆడుతుంది. ఆ తర్వాత ధనా ధన్ లీగ్ ఐపీఎల్‌ సందడి మొదలు కానుంది. మొత్తానికి 2025లో టీమ్ ఇండియా వరుస సిరీస్‌లతో బిజి బిజీగా ఉండనుంది. ఇందులోఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా ఉంది.