Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఐసీసీ టెస్ట్ ఫార్మాట్‌లోనూ వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. దీనిని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా పిలుస్తున్నారు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇప్పటికే రెండు ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్, రెండో ఎడిషన్ విజేతగా ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అయితే, ఈ రెండు ఎడిషన్లలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇక మూడవ ఎడిషన్ జూన్ 2023లో ది యాషెస్‌తో ప్రారంభమైంది. లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో అంటే జూన్ 2025లో ఇది ముగుస్తుంది. టోర్నీలో 27 సిరీస్‌లు, లీగ్ దశలో 69 మ్యాచ్‌లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లండన్‌లోని లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో పోటీపడతాయి. ప్రతి జట్టు ఆరు సిరీస్‌లను ఆడుతుంది. మూడు స్వదేశంలో, మూడు విదేశాలలో ఆడుతుంది. ప్రతి సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి

ఇంకా చదవండి

WTC 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం.. లిస్ట్‌లో చేరిన మరో 3 జట్లు..

World Test Championship: 2021లో జరిగిన మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి. న్యూజిలాండ్ ఫైనల్‌లో భారత జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 2023 ఫైనల్‌లో, ఆస్ట్రేలియా భారత జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

WTC Final: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, పాక్ పోరు.. ఇదిగో లెక్కలు..

World Test Championship 2025-27: రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ తన ప్రచారాన్ని బలంగా ప్రారంభించింది. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 93 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తమ ఎక్కువ మ్యాచ్‌లను స్వదేశంలోనే ఆడనున్నాయి.

WTC Points Table: వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసినా.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు ఊహించని షాక్.. టాప్ 2 నుంచి ఔట్

ICC WTC Points Table: వెస్టిండీస్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడమే కాకుండా, మొత్తం సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఈ సిరీస్ విజయం తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికను కూడా అప్ డేట్ అయింది. కానీ, భారత జట్టు ర్యాంకింగ్ మాత్రం పెరగలేదు.

WTC Points Table: విండీస్‌పై ఘన విజయం.. కట్‌చేస్తే.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు బిగ్ షాక్..?

ICC World Test Championship 2027 Points Table: వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను టీమిండియా ఏకపక్షంగా గెలుచుకుంది. ఈ విజయం ఉన్నప్పటికీ, 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది.

అవమానమే కాదు.. 54 ఏళ్ల హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డ్.. విశ్వవిజేతకే చెమటలు పట్టించారుగా

Australia vs South Africa: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను 98 పరుగుల తేడాతో గెలుచుకున్న తర్వాత, దక్షిణాఫ్రికా ఇప్పుడు రెండవ మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటములతో ఆస్ట్రేలియా జట్టు పేరిట చెత్త రికార్డ్ నమోదైంది.

WTC Points Table: ఓవల్ విజయంతో డబ్ల్యూటీసీలో గిల్ సేన దూకుడు.. ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేశారుగా.. దెబ్బకు

2025–27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్ ఇప్పుడు నెమ్మదిగా ఊపందుకుంది. ప్రతి జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై దృష్టి సారించింది. ఇంతలో, జులై 31 నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ ఓవల్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో తలపడ్డాయి. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని జట్టు అద్భుతంగా రాణించి ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

ICC Tournaments: 5 ఏళ్లు.. 9 టోర్నమెంట్లు.. భారత్ ఆతిథ్యం ఇచ్చేది ఎన్నంటే..?

ICC Tournaments 2026 To 2031: ఐసీసీ 2026, 2031 మధ్య మొత్తం 9 టోర్నమెంట్లను నిర్వహించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మినహా అన్ని టోర్నమెంట్లను సంయుక్తంగా నిర్వహించడం విశేషం. అదేవిధంగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఇంగ్లాండ్‌లో జరుగుతాయి.

లార్డ్స్ విజయంతో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. WTC టేబుల్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ..

WTC Points Table: లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, స్లో ఓవర్ రేట్ కారణంగా పాయింట్లను కోల్పోవడం ఇంగ్లండ్‌కు నిరాశ కలిగించే అంశం. అయితే, ఇది అన్ని జట్లకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఐసీసీ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదని మరోసారి రుజువైంది.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ.. డబ్ల్యూటీసీలో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీగా లాభపడిన భారత్..

WTC 2027 Points Table: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా 58 ఏళ్ల తర్వాత తొలి విజయం అందుకుంది. ఇంగ్లాండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించి, గిల్ సేన సత్తా చాటింది. ఈ విజయంతో 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో గిల్ సేన తన ఖాతాను ఓపెన్ చేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ తన తొలి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

IND vs ENG: అకస్మాత్తుగా మైదానం వీడిన బెన్ స్టోక్స్ సేన.. లైవ్ మ్యాచ్‌లో కలకలం.. అసలేం జరిగింది?

IND vs ENG: భారత ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు, ఆట మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహచర ఆటగాళ్లతో కలిసి మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన, సాధారణంగా మ్యాచ్ మధ్యలో జరిగే ఆటగాళ్ళ మార్పిడి లేదా చికిత్స కోసం బయటకు వెళ్ళలేదు. ఇంగ్లాండ్ జట్టులోని కీలక ఆటగాళ్లందరూ ఒకేసారి మైదానం వీడటం చర్చనీయాంశంగా మారింది.