AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: గబ్బా ఫలితం కంటే ముందే టీమిండియాకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్?

WTC Scenario: గబ్బా టెస్టులో టీమిండియా ఓడిపోతే, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలన్న ఆశలపై నీళ్లు చల్లినట్లేనని తెలుస్తోంది. అయితే, ఫైనల్‌ ఆడేందుకు భారత జట్టుకు మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. అవి నెరవేరాలంటే మాత్రం బీజీటీ ఫలితం కూడా అనుకూలంగా మారాల్సిందే.

WTC Final: గబ్బా ఫలితం కంటే ముందే టీమిండియాకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్?
Team India
Venkata Chari
|

Updated on: Dec 16, 2024 | 12:42 PM

Share

WTC Scenario: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆలౌటైంది. దీనికి ప్రతిగా భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. అడిలైడ్ తర్వాత గబ్బా లోనూ టీమిండియాపై ఓటమి నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. గబ్బాలో టీమ్ ఇండియా ఓడిపోతే, WTC ఫైనల్ 2025 ఆడాలనే ఆశలకు కూడా భారీ దెబ్బ తగులుతుంది. గబ్బాలో భారత్ ఓడిపోతే, 2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎలా ఉంటుంది, WTC ఫైనల్‌కు సమీకరణాలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం..

గబ్బాలో ఓడిన తర్వాత టీమిండియా పరిస్థితి ఎలా ఉంటుంది?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసులో దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63.33 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో రెండో స్థానంలో, టీమ్ ఇండియా 57.29 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచాయి. గబ్బా టెస్టులో టీమిండియా ఓడిపోతే మూడో స్థానంలో నిలిచినా పాయింట్లు తగ్గుతాయి.

ఆ తర్వాత, సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లను టీమిండియా గెలిస్తే, దాని పాయింట్లు 58.8%, ఆస్ట్రేలియా పాయింట్లు 57%గా ఉంటాయి. ఆ తర్వాత భారత్‌ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలుస్తాయి. భారత జట్టు మరే ఇతర జట్టుపై ఆధారపడకుండా నేరుగా WTC ఫైనల్ 2025లోకి ప్రవేశించాలనుకుంటే, గబ్బా టెస్ట్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లను కూడా గెలవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా WTC 2025 ఫైనల్ సమీకరణాలు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-3 లేదా 1-4 తేడాతో ఓడిపోతే, WTC ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. BGT 2-2తో డ్రా అయితే, WTCకి చేరుకోవడానికి టీమ్ ఇండియా కోసం శ్రీలంక అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. స్వదేశంలో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను శ్రీలంక వైట్‌వాష్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా, మరొక సమీకరణం ఏమిటంటే, BGT ఆస్ట్రేలియాను 3-2తో గెలిస్తే, స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు టీమిండియాకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య కనీసం ఒక్క మ్యాచ్ అయినా డ్రా కావాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..