RCB Captain: బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ కాదు భయ్యో.. సంచలనంగా మారిన ఫ్రాంచైజీ పోస్ట్.. కొత్త సారధి ఎవరంటే?
RCB Captain For IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ కోసం మోగా వేలం నిర్వహించింది. ఇందులో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారగా, మరికొంత మంది మాత్రం కెప్టెన్లుగా ప్రమోషన్ పొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Krunal Pandya RCB Captain For IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ కోసం జరిగిన మెగా వేలాన్ని అభిమానులు బాగా ఆస్వాదించారు. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఈసారి చాలా మంది ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా ఆడటం కనిపిస్తుంది. ఇప్పుడు RCB లో భాగమైన కృనాల్ పాండ్యా పేరు కూడా ఇందులో ఉంది. దీనికి ముందు, కృనాల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇంతలో, RCB చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దాని తర్వాత కృనాల్ ఐపీఎల్ 2025లో జట్టుకు కెప్టెన్గా ఉండబోతున్నాడా అనే ఊహాగానాలు ఉన్నాయి.
కృనాల్ పాండ్యా RCB కెప్టెన్సీని అందుకుంటాడా?
వాస్తవానికి ఆర్సీబీ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ను కొనసాగించలేదు. వేలంలో కూడా అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 18వ సీజన్కు ఆర్సీబీకి కెప్టెన్ అవసరం. ఫ్రాంచైజీ తన ప్రీ-సీజన్ క్యాంపును బెంగళూరులో నిర్వహించింది. అందులో కృనాల్ పాండ్యా కూడా చేరాడు.
సోమవారం బెంగళూరు ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ను పంచుకుంది. ఇందులో కృనాల్ పాండ్యా ఆర్సీబీ జెర్సీలో కనిపించాడు. ఈ క్యాప్షన్లో ‘కృనాల్కు ఇక్కడికి వచ్చారు. పాండ్యాకు ఛాన్స్ ఉంది. కానీ, అది మీకు ఇప్పటికే తెలుసు’ అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
బెంగళూరు ఫ్రాంచైజీ ఈ పోస్ట్పై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. పాండ్యాను కెప్టెన్గా చేయండి అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. మరో అభిమాని ‘కెప్టెన్ కృనాల్ పాండ్యా’ అంటూ కోరాడు.
లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ కృనాల్ను మెగా వేలంలో ఆర్సీబీ రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన ప్రత్యేక అనుభవం అతనికి లేదు. కృనాల్ 6 మ్యాచ్ల్లో ఎల్ఎస్జికి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో జట్టు కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. వాస్తవానికి, కృనాల్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం అతను SMAT 2024లో బరోడాకు నాయకత్వం వహిస్తున్నాడు.
విరాట్ కోహ్లి మళ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్..
మీడియా నివేదికలను విశ్వసిస్తే, రాబోయే ఐపిఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ మరోసారి బెంగళూరు ఫ్రాంచైజీ నాయకత్వం వహించడాన్ని చూడొచ్చు. ఐపీఎల్ 2021 తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అందుకే, ఫ్రాంచైజీ అతనికి ఈ ముఖ్యమైన బాధ్యతను మరోసారి ఇవ్వగలదు అంటూ భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..