AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆటగాళ్లు.. కట్‌చేస్త్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ..

Indian Cricket Team: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లోనూ పరుగుల ఛేజింగ్‌లోనే విజయం సాధించడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో, నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో, ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Team India: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆటగాళ్లు.. కట్‌చేస్త్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ..
Team India Cwc 2023
Venkata Chari
|

Updated on: Oct 24, 2023 | 8:58 PM

Share

World Cup 2023: ప్రపంచ కప్ 2023 మధ్య టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాకు బీసీసీఐ ఊహించని విధంగా కొత్త రూల్ పెట్టింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి జోరు మీదున్న భారత జట్టుకు నిషేధం విధించింది. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో రోహిత్ సేన ఐదవ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత టీమిండియా చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత మ్యాచ్‌ను అక్టోబర్ 29, ఆదివారం నాడు ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ధర్మశాలలో జట్టుకు రెండు రోజులు విరామం ఇచ్చారు.

ధర్మశాలలో ట్రెక్కింగ్ పూర్తిగా నిషేధించినట్లు టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు తెలియజేసింది. రెండు రోజుల విరామంలో భారత ఆటగాళ్లు ట్రెక్కింగ్ చేయలేరు. అయితే, ఈ విరామ సమయంలో భారత ఆటగాళ్లు ధర్మశాలలోని అద్భుతమైన ప్రదేశాలను పూర్తిగా ఆస్వాదించవచ్చని తెలిసింది. ఇది కాకుండా ఆటగాళ్లు పారాగ్లైడింగ్ కూడా చేయలేరు.

ఇవి కూడా చదవండి

‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. “ట్రెక్కింగ్‌కు వెళ్లవద్దని ఆటగాళ్లకు టీమ్ మేనేజ్‌మెంట్ తెలియజేసింది. అదే సమయంలో టోర్నమెంట్ సమయంలో ఏ భారతీయ ఆటగాడు పారాగ్లైడింగ్ కూడా చేయలేడు. ఎందుకంటే ఇది ఆటగాడి ఒప్పందానికి విరుద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.

టీం ఇండియా తదుపరి మ్యాచ్‌ లక్నోలో..

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో టోర్నీలో భారత జట్టు ఆరో మ్యాచ్ ఆడనుంది. నివేదికల ప్రకారం, టీమ్ ఇండియా అక్టోబర్ 25 బుధవారం లక్నో చేరుకుంటుంది. అంతకు ముందు ఆడిన ఐదు గేమ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు, టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది.

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లోనూ పరుగుల ఛేజింగ్‌లోనే విజయం సాధించడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో, నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో, ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..