Women’s Asia Cup: సెమీస్లో తలపడే జట్లు ఇవే.. టీమిండియా ఎవరితో ఢీ కొట్టనుందంటే?
Women’s Asia Cup: మహిళల ఆసియా కప్ 2024లో గ్రూప్ దశలో జరిగిన చివరి మ్యాచ్లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో థాయ్లాండ్ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శ్రీలంకకు ఇది మూడో విజయం కాగా, 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు సెమీస్లో పాకిస్థాన్తో తలపడనుంది.
![Women’s Asia Cup: సెమీస్లో తలపడే జట్లు ఇవే.. టీమిండియా ఎవరితో ఢీ కొట్టనుందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/indw-vs-banw-semi-final.jpg?w=1280)
Women’s Asia Cup: మహిళల ఆసియా కప్ 2024లో గ్రూప్ దశ చివరి మ్యాచ్ శ్రీలంక, థాయ్లాండ్ మధ్య జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు సులువుగా విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. శ్రీలంకకు ఇది మూడో విజయం కాగా, 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు సెమీస్లో పాకిస్థాన్తో తలపడనుంది. థాయ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం శ్రీలంక జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
చమ్రీ అటపట్టు కెప్టెన్సీ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ చమ్రీ అటపట్టు అద్భుత ప్రదర్శన చేశాడు. బంతి, బ్యాటింగ్తో తన సత్తా చాటుతూ జట్టును సెమీఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే థాయ్లాండ్కు శ్రీలంక షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నిరంతరం వికెట్లు తీస్తూ థాయ్లాండ్కు మ్యాచ్లోకి తిరిగివచ్చే అవకాశం ఇవ్వలేదు. శ్రీలంక 20 ఓవర్లలో 93 పరుగులు మాత్రమే చేసింది. ప్రధాన శ్రీలంక బౌలర్లతో పాటు కెప్టెన్ చమ్రీ కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ కూడా తీశాడు. ఛేజింగ్ విషయానికి వస్తే, చమ్రీ 35 బంతుల్లో 49 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను మలేషియాపై 119 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సెమీ ఫైనల్..
మహిళల ఆసియా కప్ 2024లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్లు శుక్రవారం, జులై 26న జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దంబుల్లా వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అదే మైదానంలో శ్రీలంక, పాకిస్థాన్ మధ్య రాత్రి 7 గంటల నుంచి రెండో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన జట్లు జులై 28 ఆదివారం జరిగే ఫైనల్లో తలపడతాయి.
7 సార్లు టైటిల్ గెలిచిన భారత్..
మహిళల ఆసియా కప్ 2004లో ప్రారంభమైంది. ఈ ఏడాది 9వ ఎడిషన్ టోర్నీ జరుగుతోంది. ఇంతకుముందు 8 ఎడిషన్లలో, టీమ్ ఇండియా 7 సార్లు ఈ టైటిల్ను గెలుచుకుంది. 2004 నుంచి 2016 వరకు ఈ ట్రోఫీని భారత్ వరుసగా 6 సార్లు గెలుచుకుంది. కాగా 2018లో బంగ్లాదేశ్ ఫైనల్లో భారత జట్టును ఓడించింది. 2022లో ఏడోసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు 8వ సారి గెలవాలనే సంకల్పంతో భారత జట్టు వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..