T20I World Cup: హార్దిక్ పాండ్యాకు ప్లేస్ ఉంటుందా? నేడే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక

ఐపీఎల్ 2024 మ్యాచ్‌ లు హోరాహోరీగా సాగుతున్నాయి .అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌ పైనే ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో పరాజయం పాలైన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈసారైనా ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

T20I World Cup: హార్దిక్ పాండ్యాకు ప్లేస్ ఉంటుందా? నేడే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక
Team India
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:27 AM

ఐపీఎల్ 2024 మ్యాచ్‌ లు హోరాహోరీగా సాగుతున్నాయి .అయితే క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌ పైనే ఉంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో పరాజయం పాలైన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈసారైనా ఐసీసీ కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయ. దీనికి ముందు, మొత్తం 20 జట్లు తమ ప్రపంచ కప్ జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీగా ఇచ్చింది ఐసీసీ. దీని ప్రకారం మే 1లోగా అన్ని జట్లు తమ జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. సోమవారం (ఏప్రిల్ 29న) న్యూజిలాండ్ తమ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇప్పుడు 19 క్రికెట్ బోర్డులు తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. టీమ్ ఇండియాకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ కప్ లో చోటు ఆశిస్తున్నారు. కాగా ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా ప్రకటన ఎప్పుడు వస్తుందా? జట్టులో ఎవరు అవకాశం పొందుతారు? అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్త్ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్లను ఎప్పుడు ప్రకటిస్తారు అనే దాని గురించిన అప్‌డేట్ వచ్చింది. నివేదికల ప్రకారం ఏప్రిల్ 30న టీమ్ ఇండియాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించవచ్చు. ఇద్దరికీ ప్రధాన, బ్యాకప్ వికెట్ కీపర్‌గా అవకాశం ఇవ్వొచ్చు. ఈ 2 స్థానాల కోసం మొత్తం 5 వికెట్ కీపర్లు పోటీలో ఉన్నారు. దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ 5 మంది పోటీలో ఉన్నారు. అయితే ఈ 5 మందిలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ లకే ఎక్కువ ప్రాధాన్యమివ్వనున్నారు.. దీంతో ఇప్పుడు ఎవరి పేరు ఖాయమనే దానిపై సెలక్షన్ కమిటీ దృష్టి పెట్టనుంది. మరోవైపు న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ 1 రిజర్వ్ ప్లేయర్‌తో 15 మంది ప్రధాన ఆటగాళ్లను రంగంలోకి దించింది. న్యూజిలాండ్‌కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు.

ఇవి కూడా చదవండి

అహ్మాదాబాద్ లో బీసీసీఐ సెలెక్షన్ మీటింగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!
అంతరిక్ష యాత్రికుడిగా చరిత్రకెక్కిన గోపిచంద్‌ తోటకూర
అంతరిక్ష యాత్రికుడిగా చరిత్రకెక్కిన గోపిచంద్‌ తోటకూర
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. ఇదిగో కారణం..
టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. ఇదిగో కారణం..
డార్లింగ్ స్పిరిట్‌పై సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చిందిగా..
డార్లింగ్ స్పిరిట్‌పై సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చిందిగా..
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?