AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ప్రపంచకప్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలివే

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. 20 జట్ల మధ్య జరిగిన పోరులో ఎట్టకేలకు టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. దీంతో ఐసీసీ ట్రోఫీని గెలవాలన్న భారత జట్టు 11 ఏళ్ల కల కూడా నెరవేరింది. ఇక తర్వాతి ప్రతిష్ఠాత్మక సిరీస్ అంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025.

Team India: ప్రపంచకప్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలివే
Team India
Basha Shek
|

Updated on: Jun 30, 2024 | 7:21 PM

Share

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. 20 జట్ల మధ్య జరిగిన పోరులో ఎట్టకేలకు టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. దీంతో ఐసీసీ ట్రోఫీని గెలవాలన్న భారత జట్టు 11 ఏళ్ల కల కూడా నెరవేరింది. ఇక తర్వాతి ప్రతిష్ఠాత్మక సిరీస్ అంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025. ఈ ట్రోఫీ మధ్యలో భారత జట్టు అనేక సిరీస్‌లు ఆడనుంది.

భారత్ వర్సెస్ జింబాబ్వే సిరీస్:

టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్లనుంది. జూలై 6 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు టీమ్ ఇండియా యూత్ టీమ్‌ని ఎంపిక చేయగా, ఈ సిరీస్‌లో భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తాడు.

ఇవి కూడా చదవండి

భారత్ vs శ్రీలంక సిరీస్:

జింబాబ్వే పర్యటన తర్వాత భారత జట్టు శ్రీలంకతో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మొత్తం 6 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అయితే జులై 27 నుంచి ఆగస్టు 7 మధ్య భారత్, శ్రీలంక జట్లు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే.

భారత్ vs బంగ్లాదేశ్ సిరీస్:

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ సిరీస్ లో 2 టెస్ట్ మ్యాచ్‌లు, 3 T20 మ్యాచ్‌లు జరగనున్నాయని తెలుస్తోంది.

భారత్ vs న్యూజిలాండ్ సిరీస్:

బంగ్లాదేశ్ తర్వాత, అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌తో భారత్ 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

భారత్ vs సౌతాఫ్రికా:

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత్, దక్షిణాఫ్రికా నవంబర్‌లో మరోసారి తలపడనున్నాయి. నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్:

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ చివరి టెస్టు సిరీస్ ఆడనుంది. కంగారూల గడ్డపై జరిగే ఈ సిరీస్‌లో మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్:

కొత్త సంవత్సరాన్ని ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించనున్న టీమిండియా, 2025లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తలపడనుంది. భారత్‌లో జరగనున్న ఈ సిరీస్‌లో టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ టోర్నీ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..