AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Test: 15 ఏళ్ల కల నెరవేరేనా.. అప్పుడు కెప్టెన్, ఇప్పుడు కోచ్‌గా.. స్పెషల్ రికార్డ్‌లో చేరేందుకు సిద్ధం.. ఆయనెవరంటే?

2007 తర్వాత ఇంగ్లండ్‌లో టీమిండియా ఏ టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. చివరిసారిగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు 1-0తో స్వదేశంలో..

IND vs ENG Test: 15 ఏళ్ల కల నెరవేరేనా.. అప్పుడు కెప్టెన్, ఇప్పుడు కోచ్‌గా.. స్పెషల్ రికార్డ్‌లో చేరేందుకు సిద్ధం.. ఆయనెవరంటే?
Ind Vs Eng Test
Venkata Chari
|

Updated on: Jun 22, 2022 | 12:39 PM

Share

ఐదు టెస్టుల సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక టెస్టు భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. నిజానికి ఈ సిరీస్ గత ఏడాది మొదలైంది. ఇందులో నాలుగు టెస్టుల అనంతరం భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీని తరువాత, కరోనా కేసుల కారణంగా ఐదవ టెస్ట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో చివరి టెస్టును ప్రస్తుతం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఈ టెస్టులో నెగ్గినా లేదా డ్రా చేసుకున్నా.. 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో భారత జట్టు చరిత్ర సృష్టిస్తుంది.

చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ గెలిచిన భారత్..

2007 నుంచి ఇంగ్లండ్ గడ్డపై టీమ్ ఇండియా ఎలాంటి ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లను గెలవలేదు. చివరిసారిగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు 1-0తో స్వదేశంలో విజయం సాధించింది. అప్పుడు భారత జట్టు కెప్టెన్సీ రాహుల్ ద్రవిడ్ చేతిలో ఉంది. ఆ సమయంలో మైకేల వాన్ నేతృత్వంలోని ఇంగ్లిష్ జట్టు ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

అప్పుడు కెప్టెన్.. ఇప్పుడు కోచ్.. విజయం పక్కా అయ్యేనా..

ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈసారి రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నాడు. అయితే, భారత్ విజయం సాధిస్తే ద్రవిడ్ ఖాతాలో యాదృచ్ఛిక విజయాన్ని సృష్టించే అవకాశం దక్కించుకుంటాడు. కెప్టెన్‌గా ద్రవిడ్‌ చివరిసారి సిరీస్‌ గెలిచాడు. ఈసారి కోచ్‌గా మారి విజయం సాధించేందుకు సిద్ధమయ్యాడు.

ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు రికార్డులు..

మొత్తం టెస్ట్ సిరీస్: 18

ఇంగ్లండ్ విజయాలు: 14

భారత్ విజయాలు: 3

డ్రాలు: 1

గతేడాది మొదలైన టెస్టు సిరీస్‌..

వాస్తవానికి ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ గత ఏడాది జరిగింది. గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు మ్యాచ్ జరగలేదు. ఈసారి జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా పడింది. ఈ సిరీస్‌లో ఇది నిర్ణయాత్మక టెస్ట్. భారత జట్టు గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకోనుండగా, ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఐదో టెస్టు డ్రా అయినా.. భారత జట్టు 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. చివరిసారిగా టీమ్ ఇండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన సమయంలో ఆడిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. కాగా, అప్పుడు నాలుగు టెస్టుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి పనిచేశారు. ఈసారి కెప్టెన్‌గా రోహిత్, కోచ్‌గా ద్రవిడ్ ఎంపికయ్యారు.