Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: నలుగురు జీరో.. ఏడుగురు సింగిల్ డిజిట్‌‌కే పరిమితం.. టీ20ల్లో మరో అత్యల్ప స్కోర్.. ఎక్కడో తెలుసా?

17.2 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే చేసి ఓ జట్టు ఆలౌట్ కాగా, ప్రత్యర్థి జట్టు కేవలం 2.4 ఓవర్లలో 30 పరుగులు సాధించి, విజయ ఢంకా మోగించింది.

T20 Cricket: నలుగురు జీరో.. ఏడుగురు సింగిల్ డిజిట్‌‌కే పరిమితం.. టీ20ల్లో మరో అత్యల్ప స్కోర్.. ఎక్కడో తెలుసా?
Asian Cricket Council Women's T20 Championship
Follow us
Venkata Chari

|

Updated on: Jun 19, 2022 | 8:53 AM

టీ20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్‌కే ఓ జట్టు పేకమేడలా కుప్పకూలింది. దీంతో కేవలం 16 బంతుల్లోనే ప్రత్యర్థి టీం లక్ష్యాన్ని ఛేదించి, ఘన విజయం సాధించింది. అంటే ప్రత్యర్థి జట్టుకు 3 ఓవర్లు కూడా ఆడాల్సిన అవసరం లేదన్నమాట. ఇలాంటి మ్యాచ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మహిళల టీ20 ఛాంపియన్‌షిప్‌లో జరిగింది. సింగపూర్ vs యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (Singapore vs UAE) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ మహిళల జట్టు చాలా తక్కువ స్కోరు సాధించింది. దానిని ఛేదించడానికి యూఏఈ మహిళలు కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్నారు. అలాగే, ఈ సమయంలో ఆ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. తొలుత ఆడిన సింగపూర్ మహిళల జట్టు 17.2 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీనికి సమాధానంగా యూఏఈ మహిళా క్రికెట్ జట్టు కేవలం 2.4 ఓవర్లలో 30 పరుగులు సాధించింది.

సింగపూర్ జట్టు 29 పరుగులకే ఆలౌట్..

సింగపూర్ బ్యాటింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు బ్యాటర్స్ ఎవరూ రెండంకెల స్కోర్‌ను తాకలేకపోయారు. నలుగురు బ్యాటర్స్ ఖాతా తెరవలేకపోయారు. అంటే వారు జీరోకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్స్.. కేవలం ఒక పరుగు మాత్రమే తీశారు. ఇద్దరు బ్యాటర్స్ 5 పరుగులు, ఒకరు 4 పరుగులు చేయగా, జట్టు కెప్టెన్ షఫీనా మహేష్ అత్యధికంగా 9 పరుగులు చేసింది. ఇది కాకుండా, సింగపూర్‌కు 3 పరుగులు అదనంగా లభించాయి. ఈ విధంగా 29 పరుగులకు ఆ జట్టు కథ ముగిసింది.

ఇవి కూడా చదవండి

యూఏఈ తరపున ఇద్దరు బౌలర్లు ఛాయా, ఈషా చెరో 3 వికెట్లు తీశారు. ఛాయా 4 ఓవర్లలో 9 పరుగులు ఇవ్వగా, ఈషా 4 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చింది. వీరితో పాటు వైష్ణవ్ మహేష్, సెక్యూరిటీ కోటాలో చెరో 2 వికెట్లు చేరాయి.

లక్ష్యాన్ని 16 బంతుల్లోనే..

20 ఓవర్లలో 30 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ.. అలవోకగా ఛేజింగ్ చేసింది. ఓపెనింగ్‌కు వచ్చిన ఈషా, తీర్థ 16 బంతుల్లోనే విజయాన్ని అందించారు. ఈషా 14 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, తీర్థ 2 బంతుల్లో 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 14 బంతుల్లో 29 నాటౌట్‌తో పాటు 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఈషా ఓజా ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!