AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఇకపై రెండు భాగాలు, రెండు దేశాలు.. ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కింగ్స్ ఓనర్..

ఐపీఎల్‌ను సుదీర్ఘకాలం నిర్వహించేందుకు పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి సూపర్ ఫార్ములాను సూచించారు.

IPL: ఇకపై రెండు భాగాలు, రెండు దేశాలు.. ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కింగ్స్ ఓనర్..
IPL
Venkata Chari
|

Updated on: Jun 17, 2022 | 9:06 PM

Share

పంజాబ్ కింగ్స్ (PBKS) సహ-యజమాని నెస్ వాడియా, భారత క్రికెట్ బోర్డు (BCCI) మీడియా హక్కుల ద్వారా భారీగా రూ. 48 కోట్లు పొందిందని, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని రెండు వేర్వేరు భాగాలుగా నిర్వహించాలని పేర్కొ్నాడు. బీసీసీఐ ఐపీఎల్ మీడియా హక్కులను ఇ-వేలం ద్వారా రూ. రూ.48, 390 కోట్లకు విక్రయించిన సంతగి తెలిసిందే. ఇది గతంలో కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భవిష్యత్ టూర్ షెడ్యూల్ (ఎఫ్‌టీపీ) ప్రకారం ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతాయని, దాని సీజన్ పొడిగించే అవకాశం ఉందని వాడియా ఆశాభావం వ్యక్తం చేశాడు.

అతను పీటీఐతో మాట్లాడుతూ, ‘ఐపీఎల్ క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. IPL క్రికెట్‌కు అవసరమైన శక్తిని అందించింది. దానిని ప్రపంచ క్రీడగా మార్చింది. ఇప్పుడు ఐపీఎల్ మరింత పెద్దదవుతుంది’ అని తెలిపాడు.

వాడియా మాట్లాడుతూ, ‘ప్రస్తుతం హోమ్‌గ్రౌండ్‌లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నారు. ఇది చాలా తక్కువ. వాటి సంఖ్య కనీసం 14 ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ చాలా కాలం పాటు కొనసాగుతుందని నేను నిజంగా భావిస్తున్నానంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

నాలుగు నెలల పాటు ఐపీఎల్‌ను నిర్వహించలేకపోతే రెండు భాగాలుగా ఎందుకు నిర్వహించకూడదని ఆయన అన్నారు. ఈ సెషన్లలో ఒకటి భారతదేశంలో, మరొకటి మరే దేశంలోనైనా నిర్వహించవచ్చు. భారతీయులు ప్రపంచంలో ప్రతిచోటా ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే