AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: పాకిస్తాన్ టీంకు భారీ దెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ప్లేయర్.. ఎవరంటే?

Asia Cup 2023, Pakistan vs Sri Lanka: వర్చువల్ సెమీఫైనల్‌లో పాకిస్తాన్ శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టు భారత్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టులో నసీమ్ స్థానంలో ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని 22 ఏళ్ల జమాన్ ఖాన్‌ను నియమించింది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీని కూడా పిలిచింది.

Asia Cup 2023: పాకిస్తాన్ టీంకు భారీ దెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
Naseem Shah
Venkata Chari
|

Updated on: Sep 13, 2023 | 9:15 PM

Share

Pakistan vs Sri Lanka: భుజం గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఆసియా కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో పాకిస్థాన్‌కు బుధవారం పెద్ద దెబ్బ తగిలిగినట్లైంది. గురువారం శ్రీలంకతో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో నసీమ్ అందుబాటులో లేకపోవడం పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బతీయనుంది.

వర్చువల్ సెమీఫైనల్‌లో పాకిస్తాన్ శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టు భారత్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టులో నసీమ్ స్థానంలో ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని 22 ఏళ్ల జమాన్ ఖాన్‌ను నియమించింది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీని కూడా పిలిచింది.

ఇవి కూడా చదవండి

“2023లో జరగనున్న పురుషుల వన్డే ఆసియా కప్ 2023 కోసం 17 మంది ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ జట్టులో నసీమ్ షా స్థానంలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ ఎంపికయ్యాడు” అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

“జమాన్ ఈరోజు ఉదయం జట్టులో చేరాడు. సాయంత్రం RPICSలో స్క్వాడ్‌తో శిక్షణ పొందుతాడు” అని బోర్డు ప్రకటించింది.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ గాయంతో 9.2 ఓవర్లు వేసిన తర్వాత వికెట్లేమీ తీయకుండానే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు.

“భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ కుడి భుజానికి గాయమైంది. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జట్టు వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తూనే ఉంది” అని పీసీబీ తెలిపింది.

ప్రాక్టీస్‌లో నిమగ్నమైన పాక్ ఆటగాళ్లు..

పాకిస్తాన్‌పై రెండు వికెట్ల నష్టానికి రోహిత్ శర్మ 356 పరుగుల ఉమ్మడి-అత్యధిక వన్డే స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో సైడ్ స్ట్రెయిన్ కారణంగా హరీస్ రవూఫ్ సేవలను కూడా కోల్పోయింది. మంగళవారం రిజర్వ్ డే ఆటలోనూ అతను బౌలింగ్ చేయలేదు. “ముందుజాగ్రత్త చర్యగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా పోటీ రిజర్వ్ రోజున బౌలింగ్ చేయనివ్వలేదు. హరీస్ రవూఫ్ మ్యాచ్ మొదటి రోజు తన కుడి పార్శ్వంలో అసౌకర్యాన్ని అనుభవించాడు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు” పీసీబీ తెలిపింది.

శ్రీలంకతో పోరు కోసం ప్రాక్టీస్ చేస్తోన్న పాక్ ఆటగాళ్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..