AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్‌‌లోకి అడుగుపెట్టనున్న ద్రవిడ్‌ కుమారుడు.. మెగా వేలానికి అర్హుడేనా?

Samit Dravid: భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కర్ణాటక టీ20 లీగ్‌లో మైసూర్ వారియర్స్ తరపున ఆడుతున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసిన సమిత్ ద్రవిడ్ 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో మొత్తం 63 పరుగులు చేశాడు.

IPL 2025: ఐపీఎల్‌‌లోకి అడుగుపెట్టనున్న ద్రవిడ్‌ కుమారుడు.. మెగా వేలానికి అర్హుడేనా?
Samit Dravid
Venkata Chari
|

Updated on: Aug 21, 2024 | 4:30 PM

Share

Samit Dravid: ప్రస్తుతం జరుగుతున్న మహారాజా ట్రోఫీ టీ20 టోర్నీలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇలాంటి ప్రదర్శన తర్వాత సమిత్ ఐపీఎల్ మెగా వేలంలో కనిపిస్తాడని పుకార్లు వస్తున్నాయి. అయితే, ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనే అర్హత సమిత్‌కు లేదనేది వాస్తవం. ఎందుకంటే, IPL నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనేందుకు ఒక ఆటగాడు కనీసం రెండు లిస్ట్ A లేదా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అలాగే, తమ పేరును రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో కూడా నమోదు చేసుకోవాలి.

ఇక్కడ సమిత్ ద్రవిడ్ పేరు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కింద నమోదైంది. కానీ, అతను కర్ణాటక తరపున లిస్ట్ ఏ లేదా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడకపోవడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్‌లో పాల్గొనాలనుకునే ఆటగాడు భారత క్రికెట్ బోర్డు నిర్వహించే ఏదైనా టోర్నీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలి. కానీ, సమిత్ ద్రవిడ్ కర్ణాటక సీనియర్ జట్టు తరఫుపు ఏ భారీ టోర్నీ ఆడనందున అతనికి అవకాశం లభించే అవకాశం లేదు.

అయితే, సమిత్ ద్రవిడ్ 2023-24 కూచ్ బెహార్ విజేత అండర్-19 కర్ణాటక జట్టులో సభ్యుడు. ఆలూరులో పర్యాటక లంకాషైర్ జట్టుతో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో అతను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ XIలో కనిపించాడు. తద్వారా రానున్న రోజుల్లో కర్ణాటక సీనియర్ జట్టులో అవకాశం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.

ఎలా అర్హత సాధించాలి?

త్వరలో జరగనున్న రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో సమిత్ ద్రవిడ్‌కు అవకాశం లభిస్తే ఐపీఎల్ మెగా వేలంలో నమోదు చేసుకునేందుకు అర్హత సాధిస్తాడు. ఈ విధంగా డిసెంబర్ నెలలోపు సమిత్ కర్ణాటక తరపున ఆడితే ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

సమిత్ ద్రవిడ్ కెరీర్ ఎలా ఉంది?

మహారాజా ట్రోఫీ టోర్నీలో మైసూర్ వారియర్స్ తరపున సమిత్ ద్రవిడ్ ఆడుతున్నాడు. వారియర్స్ తరఫున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా కనిపించిన 18 ఏళ్ల యువకుడు 4 మ్యాచ్‌ల్లో 63 పరుగులు చేశాడు. ఈసారి 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..