AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్.. ఈ భారత స్టార్ ఆటగాడి కెరీర్‌కు చివరి మ్యాచ్.. ఎందుకంటే?

Team India: టీమిండియా స్టార్ ఆటగాడి ఫ్లాప్ ప్రదర్శన కారణంగా భారత జట్టుకు భారంగా మారాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు ఫ్లాప్ అయితే, ఈ క్రికెటర్‌ను టీమిండియా నుంచి తొలగించవచ్చు. అతని అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసిపోయే ఛాన్స్ ఉంది.

IND vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్.. ఈ భారత స్టార్ ఆటగాడి కెరీర్‌కు చివరి మ్యాచ్.. ఎందుకంటే?
Team India
Venkata Chari
|

Updated on: Jul 20, 2023 | 10:56 AM

Share

India vs West Indies, 2023: టీమిండియా స్టార్ ఆటగాడి ఫ్లాప్ ప్రదర్శన కారణంగా భారత జట్టుకు భారంగా మారాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు ఫ్లాప్ అయితే, ఈ క్రికెటర్‌ను టీమిండియా నుంచి తొలగించవచ్చు. అతని అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసిపోయే ఛాన్స్ ఉంది. ఎన్నో అవకాశాలు వచ్చినా ఈ ఆటగాడు మెరుగుపడకపోవడంతో ఇప్పుడు ఈ ఆటగాడిని టీమిండియా నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు.

రెండో టెస్టుతో తేలనున్న కెరీర్..

టీమిండియాకు అతిపెద్ద విలన్ అని ఈ క్రికెటర్ నిరూపించుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఈ ఆటగాడు ఫ్లాప్‌గా మిగిలిపోతే.. ఇక మరోసారి టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. నేటి నుంచి ట్రినిడాడ్‌లో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా, భారత్ ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవచ్చు.

డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అజింక్య రహానే తన ఫ్లాప్ ప్రదర్శనతో టీమిండియాకు విలన్‌గా మారాడు . డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అజింక్య రహానే కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. మరోసారి అజింక్య రహానె విలువైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లోనూ అజింక్య రహానే ఫ్లాప్ అయితే అతని కెరీర్ కూడా ముగిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రితురాజ్ గైక్వాడ్ రానున్న రోజుల్లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేయవచ్చు. రీతురాజ్ గైక్వాడ్ అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా భారత టెస్టు జట్టులో చోటు సంపాదించే ఛాన్స్ ఉంది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు అజింక్యా రహానేని భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 2021లో భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్సీ నుంచి అజింక్యా రహానేని తొలగించారు.

ఇవి కూడా చదవండి

టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి ఔట్..

జనవరి 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్ టౌన్ టెస్టు తర్వాత అజింక్య రహానే భారత టెస్టు జట్టు నుంచి దూరమయ్యాడు. దీని తర్వాత అజింక్య రహానే రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ కాంట్రాక్టును పొందాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అజింక్య రహానే తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. జూన్ 7 నుంచి జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింక్య రహానే భారత టెస్ట్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ, అజింక్య రహానే అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. అజింక్యా రహానెను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా చేసినందుకు సెలక్టర్లు అతనికి బహుమతి ఇచ్చారు. కానీ, ప్రస్తుతం మరో తన ఫ్లాప్‌తో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇలాగే సాగితే.. ఇక ముందు టెస్ట్ జట్టులో కనిపించడం కష్టమేనని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..