AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ప్రపంచ ఛాంపియన్ ను చిత్తు చేసిన టీమిండియా.. మొదటి వన్డేలో ఘన విజయం

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత మహిళల క్రికెట్ జట్టు దారుణ ప్రదర్శన కనపర్చింది. కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే ఇంటి బాట పట్టింది. దీనికి ప్రధాన కారణం ఓపెనింగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడడమే. అయితే ఈ పరాభవానికి ఇప్పుడు కాస్త బదులు తీర్చుకుంది టీమిండియా.

IND vs NZ: ప్రపంచ ఛాంపియన్ ను చిత్తు చేసిన టీమిండియా.. మొదటి వన్డేలో ఘన విజయం
India Vs New Zealand
Basha Shek
|

Updated on: Oct 24, 2024 | 9:51 PM

Share

భారత్, న్యూజిలాండ్ పురుషుల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుండగా, మరోవైపు భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం (అక్టోబర్ 24) నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య టీమ్ ఇండియా 59 పరుగుల తేడాతో డిఫెండింగ్ టీ20 వరల్డ్ కప్ చాంపియన్ న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో స్మృతి మంధాన జట్టుకు నాయకత్వం వహించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మంధాన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీ20 ప్రపంచకప్ మాదిరిగానే ఇక్కడ కూడా భారత జట్టు బ్యాటింగ్ నిరాశపరిచింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 5 పరుగులు మాత్రమే చేయగలిగింది, షెఫాలీ వర్మ (33) శుభారంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమైంది. యాస్తిక భాటియా (37) కూడా స్వల్ప ఇన్నింగ్స్ ఆడినా ఆమె కూడా పెద్ద స్కోరుగా మార్చలేకపోయింది. మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్జ్ (35), దీప్తి శర్మ (41) విలువైన పరుగులు చేశారు. ఇక అరంగేట్రం ప్లేయర్ తేజల్ హసన్‌బిస్ 42 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే చివరకు 50 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయిన టీమిండియా 44.3 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున అమేలియా కార్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టింది.

227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఆ జట్టు కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ప్రపంచకప్ స్టార్ ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (25) జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించినా, తొందరగానే ఔటయ్యాడు. కెప్టెన్ సోఫీ డివైన్ చేసిన తప్పిదంతో తన వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత బ్రూక్ హాలిడే (39), మ్యాడీ గ్రీన్ (31) కలిసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా పేసర్లను ఇబ్బంది పెట్టారు. కానీ జట్టు స్కోరు 128 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. కివీస్ జట్టు పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే ఆఖర్లో విజయం కోసం పోరాడిన అమేలియా కర్ 25 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినా.. ఇతర బ్యాటర్ల వికెట్ల పతనంతో ఓడిపోవాల్సి వచ్చింది. చివర్లో కివీస్ 40.4 ఓవర్లలో కేవలం 168 పరుగులకే ఆలౌటైంది, అయితే టీమ్ ఇండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా తరఫున రాధా యాదవ్ 3 వికెట్లు, అరంగేట్రం ఆటగాడు సైమా ఠాకోర్ 2 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్ పరాభవానికి ప్రతీకారం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్