Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రికార్డుల మోత మోగించిన రిషబ్‌ పంత్‌.. దిగ్గజాలను సైతం వెనక్కునెట్టి..

India vs England: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్‌ టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత సెంచరీ సాధించాడు. కేవలం111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేసి ..

Rishabh Pant: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రికార్డుల మోత మోగించిన రిషబ్‌ పంత్‌.. దిగ్గజాలను సైతం వెనక్కునెట్టి..
Rishabh Pant
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2022 | 7:00 AM

India vs England: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్‌ టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అద్భుత సెంచరీ సాధించాడు . కేవలం111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేసి భారతజట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈక్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇది ఐదో శతకంకాగా.. ఆసియా వెలుపల నాలుగు శతకాలు బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు టెస్టు సెంచరీలు నమోదు చేసిన కీపర్‌గానూ పంత్‌ ఘనత సాధించాడు. ఇక ఆసియా వెలుపల అత్యంత వేగంగా టెస్టు సెంచరీ నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌లో రెండు టెస్టు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా పంత్. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కూడా రిషభ్‌ సెంచరీలు సాధించాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో 2వేల పరుగుల మార్కును కూడా అధిగమించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 77 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. జడేజా (83), షమీ (0) క్రీజులో ఉన్నారు. గిల్‌ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయస్‌ (15) పూర్తిగా నిరాశపర్చారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌ (52/3), మాథ్యూ ప్యాట్స్‌ (85/2) సత్తాచాటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??