AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేసిన రోహిత్.. గంభీర్‌తో విభేదాలపై ఏమన్నాడంటే?

Rohit Sharma: సిడ్నీ టెస్టు మధ్య రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్‌కి సిడ్నీ టెస్టులో ఆడే అవకాశం రాలేదనే సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, మేనేజ్‌మెంట్ అతన్ని ఇకపై టెస్ట్ జట్టులో కోరుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి. అయితే, అందరి ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రోహిత్.. పలు రూమర్లకు చెక్ పెట్టేశాడు.

Rohit Sharma: రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేసిన రోహిత్.. గంభీర్‌తో విభేదాలపై ఏమన్నాడంటే?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jan 04, 2025 | 8:31 AM

Share

Rohit Sharma: రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా సిడ్నీ టెస్టులో అడుగుపెట్టింది. హిట్ మ్యాన్ ఇప్పటివరకు ఈ పర్యటనలో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగా చివరి మ్యాచ్‌లో ఆడడం లేదు. గత కొద్ది రోజులుగా, మేనేజ్‌మెంట్ అతనిని టెస్ట్ జట్టులో కోరుకోవడం లేదని, ఇదే రోహిత్ కెరీర్‌లో చివరి టెస్ట్ సిరీస్ అంటూ వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌ని సిడ్నీ టెస్టు నుంచి తప్పించారా.. లేక అతనే ఈ మ్యాచ్‌కు దూరంగా కూర్చున్నాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మ స్వయంగా సమాధానం ఇచ్చాడు.

రోహిత్ శర్మ కీలక ప్రకటన..

సిడ్నీ టెస్టు రెండో రోజు లంచ్ టైమ్‌లో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ, ‘నేనే సిడ్నీ టెస్టుకు దూరంగా కూర్చున్నాను. ప్రస్తుతం నా బ్యాట్ పని చేయడం లేదు. నా నుంచి పరుగులు రావడం లేదని సెలెక్టర్లకు, కోచ్‌కి చెప్పాను. అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని, నేను తెలివిగలవాడిని, పరిణతి చెందినవాడిని, ఎప్పుడు ఏమి చేయాలో తెలుసు. జట్టులో ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్‌లకు ఇంత ముఖ్యమైన మ్యాచ్‌ ఆడే అవకాశం రాకూడదని, అందుకే తప్పుకోవాలని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. కానీ, 5 నెలల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుదని గ్యారెంటీ లేదు. కష్టపడి పని చేస్తాను. కానీ, ఈ నిర్ణయం రిటైర్మెంట్ కాదు. ల్యాప్‌టాప్, పెన్ను, పేపర్‌తో బయట కూర్చున్న వ్యక్తులు పదవీ విరమణ ఎప్పుడు వస్తుందో, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించులేరు. నిరంతరం పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే అది జరగడం లేదని, అందుకే సిడ్నీకి వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటానని మేనేజ్‌మెంట్‌తో చెప్పాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలం..

ఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో, అతను 3, 6, 10, 2, 9 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంటే భారత కెప్టెన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు చేశాడు. అంతకుముందు, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో ఆడిన సిరీస్‌లలో కూడా అతను పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. గత 8 టెస్టు మ్యాచ్‌ల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. దీంతో రోహిత్ ఈ ముఖ్యమైన మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా టీమిండియా సిరీస్‌ను సమం చేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..