AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: టాప్ 2 నుంచి గుజరాత్ టైటాన్స్ ఔట్..? జాక్‌పాట్ కొట్టిన బెంగళూరు, పంజాబ్..

IPL 2025 Top 2 Qualifications: ఐపీఎల్ 2025 (IPL 2025) ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం 4 జట్లు ఏవో తెలిసిపోయింది. ఇప్పుడు లీగ్ దశలో టాప్-2లో నిలిచేందుకు ఈ జట్ల మధ్య యుద్ధం జరుగుతోంది. టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. కానీ, గుజరాత్ చేతిలో ఒక్క ఓటమి మొత్తం ఆటనే మార్చేసింది.

IPL 2025: టాప్ 2 నుంచి గుజరాత్ టైటాన్స్ ఔట్..? జాక్‌పాట్ కొట్టిన బెంగళూరు, పంజాబ్..
Ipl 2025 Rcb
Venkata Chari
|

Updated on: May 23, 2025 | 4:15 PM

Share

IPL 2025 Top 2 Qualifications: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు నిర్ణయమైంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. అయితే, ఇప్పుడు టాప్-2లో నిలిచే పోరాటం తీవ్రమైంది. ఇందులో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు పెద్ద అవకాశం ఉంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ప్లేఆఫ్‌లకు ముందు కీలక మ్యాచ్..

లీగ్ దశలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ప్రకారం, గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ +0.602గా ఉంది. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ రెండూ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 17 పాయింట్లతో వరుసగా రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయి. ఆర్‌సీబీ నెట్ రన్ రేట్ +0.482 కాగా, పంజాబ్ కింగ్స్ నికర రన్ రేట్ +0.389గా ఉంది. ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ +1.292గా ఉంది.

గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ముందంజలో ఉండవచ్చు. కానీ, ఇప్పుడు టాప్-2తో లీగ్ దశను ముగించడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు లీగ్ దశలో ఇప్పుడు ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ సందర్భంలో గరిష్టంగా 20 పాయింట్లను చేరుకోవచ్చు. RCB, పంజాబ్ కింగ్స్ 20 కంటే ఎక్కువ పాయింట్లు పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ, పంజాబ్‌లకు లాటరీ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లకు లీగ్ దశలో 2-2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లను గెలిస్తే, 21-21 పాయింట్లతో లీగ్ దశను ముగించవచ్చు. అంటే, ఈ రెండు జట్లు టాప్-2లో కొనసాగుతాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మిగిలిన 2 మ్యాచ్‌లను హైదరాబాద్, లక్నో జట్లతో ఆడాలి. అలాగు, పంజాబ్ ఢిల్లీ, ముంబైలను ఎదుర్కోవలసి ఉంది. మరోవైపు, ముంబై జట్టు గరిష్టంగా 18 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. ఇటువంటి పరిస్థితిలో టాప్-2లో నిలిచిపోవడం కొంచెం కష్టం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..