
పంజాబ్ కింగ్స్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కాగా, ప్రీతి జింటా, నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్ యజమానులుగా ఉన్నారు. బాలీవుడ్ నటి పంజాబ్ కింగ్స్ మ్యాచ్లలో ఎల్లప్పుడూ జట్టుకు మద్దతుగా కనిపిస్తుంది. కోచ్ బేలిస్. 2008లో కింగ్స్ XI పంజాబ్ (KXIP)గా స్థాపించబడిన ఫ్రాంచైజీని మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్ సంయుక్తంగా కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 2021లో జట్టు పేరు కింగ్స్ XI పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్గా మార్చారు. 2014 సీజన్లో, జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి రన్నరప్గా నిలిచింది. ఇది కాకుండా 13 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్లకు చేరుకున్నారు. జట్టు సహ యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది.
ఐపీఎల్ 2021 సీజన్ వరకు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, 2023లో శామ్ కర్రాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు.
Video: శ్రేయాస్ అయ్యర్ను క్లీన్ బౌల్డ్ చేసిన తల్లి.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Shreyas Iyer's Mother Video: ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. శ్రేయాస్ తల్లి బౌలింగ్ నైపుణ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "శ్రేయాస్ తల్లి అద్భుతంగా బౌలింగ్ చేసింది," "ఆమె భారత మహిళల క్రికెట్ జట్టులో చేరాలి," "శ్రేయాస్ తల్లికి సలాం" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
- Venkata Chari
- Updated on: Jul 1, 2025
- 1:06 pm
Video: మా RCB నే ట్రోల్ చేస్తావా? CSK మాజీ ప్లేయర్ ను ఆడేసుకున్న ఫ్యాన్స్! నెట్టింట వీడియో వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సమయంలో CSK మాజీ ఆటగాడు బద్రీనాథ్ను RCB అభిమానులు ట్రోల్ చేయడంతో, అతడు సంజ్ఞగా బొటనవేళ్లు చూపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు బద్రీ RCBపై విమర్శలు చేసిన నేపథ్యంలో అభిమానులు స్పందించారు. అయితే బెంగళూరులో జరిగిన RCB విజయ కవాతులో ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం మిగిల్చింది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 10:55 am
IPL 2025: మొత్తం నేనే చేశాను! ఫైనల్ ఇన్నింగ్స్ పై స్పందించిన వధేరా!
ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ను ఓడించి తమ తొలి టైటిల్ను అందుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెహాల్ వధేరా నెమ్మదిగా ఆడడం పంజాబ్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. మ్యాచ్ అనంతరం వధేరా తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ బాధతో స్పందించాడు, ఇదే ఓటమి తన జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నాడు.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 9:32 am
IPL 2026: వచ్చే సీజన్కు ముందే ఐదుగురికి బిగ్ షాకివ్వనున్న ఫ్రాంచైజీలు.. ప్రమాదంలో ఐపీఎల్ కెరీర్?
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఎట్టకేలకు ఆర్సీబీ 18 ఏళ్లకు తొలి ట్రోఫీ గెలిచింది. అయితే, ఆర్సీబీలోనే కాదు, మిగతా టీంలనుంచి కూడా చాలామంది ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలను ఆకట్టుకోలేకపోయారు. దీంతో వచ్చే సీజన్ నుంచి వారిని తప్పించేందుకు అన్ని జట్లు ప్లాన్ చేస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Jun 9, 2025
- 3:06 pm
IPL 2025: శ్రేయాస్ నా చెంప మీద కొడితే బాగుండేది.. శశాంక్ సింగ్ క్లారిటీతో ఫిదా అవ్వాల్సిందే..
Shashank Singh's Honest Confession: ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను కోల్పోయింది. ఇప్పుడు, క్వాలిఫైయర్ 2లో రనౌట్ అయిన శశాంక్ సింగ్ తన తప్పును అంగీకరించాడు. ఆ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ చేసింది సరైనదేనని అతను చెప్పుకొచ్చాడు.
- Venkata Chari
- Updated on: Jun 8, 2025
- 9:09 pm
IPL 2025: రాసి పెట్టుకో.. ఈ సారి విన్నర్ RCB నే కావచ్చు.. కానీ ఫ్యూచర్ మాత్రం లూజర్ టీమ్ దే
IPL 2025 ఫైనల్లో PBKS ఓడిపోయినప్పటికీ, వారు పోటీలో గట్టి ప్రభావం చూపారు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఓపెనింగ్ జోడీ PBKSకి భవిష్యత్ మద్దతుగా నిలిచారు. మిడిల్ ఆర్డర్లో శశాంక్, నేహల్, అయ్యర్ లాంటి ఆటగాళ్లు సీజన్ను నిలిపారు. బౌలింగ్ విభాగంలో ఆర్స్దీప్, చాహల్ నేతృత్వం ప్రధాన బలంగా నిలిచింది. ఓటమి నిరాశ కలిగించినా, PBKS భవిష్యత్తు గొప్పదిగా కనిపిస్తోంది.
- Narsimha
- Updated on: Jun 8, 2025
- 8:23 am
IPL 2055 Final: ఫైనల్ ఓడినప్పటికి మా సర్పంచ్ సాబ్ విన్నరే!
IPL 2025 ఫైనల్లో PBKS ఓడినప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం అభిమానం పొందింది. అతని సోదరి శ్రేష్టా, సోషల్ మీడియాలో భావోద్వేగాలతో తన గర్వాన్ని వ్యక్తం చేస్తూ "మా సర్పంచ్" అంటూ ఓ ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. అయ్యర్ ఈ సీజన్లో 175 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు చేసి సత్తా చాటాడు. ఫైనల్లో ఓడినా, అతని ఆత్మవిశ్వాసం, శ్రమ మరియు నాయకత్వం అభిమానులను ప్రభావితం చేసింది.
- Narsimha
- Updated on: Jun 7, 2025
- 8:31 pm
IPL 2025: 55 ఫోర్లు, 25 సిక్సర్లతో 475 పరుగులు.. 17 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ఐపీఎల్ కొత్త సెన్సేషన్..
Priyansh Arya Creates History in Debut IPL Season: తొలి ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మన్గా ప్రియాంష్ నిలిచాడు. 2020లో 473 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఈ సందర్భంలో, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి తుఫాన్ బ్యాట్స్మెన్లను ప్రియాంష్ అధిగమించాడు.
- Venkata Chari
- Updated on: Jun 6, 2025
- 9:52 pm
Video: ఆ కన్నీళ్లు అతడి స్పిరిట్ కి నిదర్శనం! కింగ్ కోహ్లీ ఆవేశంపై పంటర్ కామెంట్స్
2025 ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టడం అభిమానుల మనసును కదిలించింది. మ్యాచ్ అనంతరం భార్య అనుష్కను ఆలింగనం చేసుకుంటూ కోహ్లీ ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ దృశ్యంపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, ఇది క్రికెట్ ఆత్మను చూపిందన్నారు. కోహ్లీ ఐపీఎల్ విజయం గొప్పదేనని చెప్పినా, టెస్టులకున్న గౌరవం మరింత ఉన్నదని స్పష్టం చేశాడు. ఈ విజయం ద్వారా RCB, ఐపీఎల్లోని అగ్ర జట్ల జాబితాలో స్థానం సంపాదించింది.
- Narsimha
- Updated on: Jun 5, 2025
- 9:35 am
Virat kohli: IPL 2025 తర్వాత కింగ్ బరిలోకి దిగేది మళ్లీ అప్పుడే! వెయిటింగ్ తప్పదిక
2025 మే 12న విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్కు అధికారికంగా గుడ్బై చెప్పాడు. ఇప్పటి నుంచి కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమవుతున్నాడు. RCB తరఫున తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత అతను తిరిగి భారత జెర్సీలో ఆగస్టులో కనిపించనున్నాడు. ఆగస్టు 17 నుంచి బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టి20లు జరుగుతాయి. అనంతరం అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో, నవంబర్ డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ పాల్గొంటాడు. టెస్ట్కి వీడ్కోలు పలికినా, వన్డేలలో అతని ఆట మాయాజాలాన్ని అభిమానులు ఆస్వాదించే అవకాశం ఇంకా ఉంది.
- Narsimha
- Updated on: Jun 5, 2025
- 9:06 am