AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడు రోజులపాటు స్వామివారి అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

నూతన సంవత్సరం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజించే వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భాలను పురష్కరించుకుని మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొంటుంది.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడు రోజులపాటు స్వామివారి అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Surya Kala
|

Updated on: Jan 01, 2023 | 7:00 PM

Share

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ మల్లికార్జునుడు, శక్తిపీఠమైన భ్రమరాంబ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నూతన సంవత్సరం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజించే వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భాలను పురష్కరించుకుని మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆలయ ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేశారు. శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ దర్శనాలు రద్దు చేశారు.

జనవరి 1 నూతన సంవత్సరం, 2వ తేదీన ముక్కోటి ఏకాదశి, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున నేటి నుండి 2వ తేదీ వరకు మూడు రోజులపాటు స్వామిరి అభిషేకాలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జనవరి 2వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజున మల్లన్న స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…