AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు

చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు. శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు
Srisailam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 05, 2024 | 6:00 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రియల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథీయేటర్, మల్లమ్మకన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువ పందిర్లు వేశారు. ఆయా చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు.

శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధిక రేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏం తినకుండా పాము ఎలా బతుకుతుంది..? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఏం తినకుండా పాము ఎలా బతుకుతుంది..? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఇది తాగితే నీరసాన్ని తగ్గి.. వెంటనే ఎనర్జీ..
ఇది తాగితే నీరసాన్ని తగ్గి.. వెంటనే ఎనర్జీ..
టిమ్స్‌లో విదేశీ రోగులకు వైద్యం.. ప్రత్యేకంగా బెడ్లు కేటాయింపు
టిమ్స్‌లో విదేశీ రోగులకు వైద్యం.. ప్రత్యేకంగా బెడ్లు కేటాయింపు
ప్రభుత్వ బడుల్లో భారీ మార్పు.. ఇక యూకేజీ తరగతులు కూడా ప్రారంభం
ప్రభుత్వ బడుల్లో భారీ మార్పు.. ఇక యూకేజీ తరగతులు కూడా ప్రారంభం
గోల్డెన్ అవర్‌లో ప్రాణరక్షణ.. తెలంగాణలో లెవెల్-4 ట్రామా కేర్ రెడీ
గోల్డెన్ అవర్‌లో ప్రాణరక్షణ.. తెలంగాణలో లెవెల్-4 ట్రామా కేర్ రెడీ
ఏప్రిల్ 10 నుంచి టోల్‌ గేట్స్‌ వద్ద ఇవి తప్పనిసరి!
ఏప్రిల్ 10 నుంచి టోల్‌ గేట్స్‌ వద్ద ఇవి తప్పనిసరి!
స్వర్గాన్ని అనుభవించాలనుకుంటున్నారా?అయితే, ఈ టూర్ ప్లాన్ మీ కోసమే
స్వర్గాన్ని అనుభవించాలనుకుంటున్నారా?అయితే, ఈ టూర్ ప్లాన్ మీ కోసమే
గతేడాది చుక్కలు చూపించిన చోటే.. ఈసారి నిప్పులు చెరిగాడు
గతేడాది చుక్కలు చూపించిన చోటే.. ఈసారి నిప్పులు చెరిగాడు
జనరల్ బోగీలు ముందు లేదా వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
జనరల్ బోగీలు ముందు లేదా వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
ఉదయ్ కిరణ్‏తో ఆ సినిమా చేయకపోతే సునీల్ అనేవాడు ఉండేవాడు కాదు..
ఉదయ్ కిరణ్‏తో ఆ సినిమా చేయకపోతే సునీల్ అనేవాడు ఉండేవాడు కాదు..