AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు

చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు. శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు
Srisailam
J Y Nagi Reddy
| Edited By: TV9 Telugu|

Updated on: Apr 05, 2024 | 6:00 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రియల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథీయేటర్, మల్లమ్మకన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువ పందిర్లు వేశారు. ఆయా చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు.

శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధిక రేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..