24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
- J Y Nagi Reddy
- Updated on: Aug 7, 2026
- 11:19 am
Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం!
నంద్యాల జిల్లా నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్)లోని ఆత్మకూరు అటవీ డివిజన్, నాగలూటి రేంజ్లో ఇటీవల పెద్దపులి మృతి చెందింది. టీ-66ఎఫ్ (T66F) ఆడ పెద్దపులి అనారోగ్యంతోనే చనిపోయిందని హైపవర్ కమిటీ తేల్చింది. దాదాపు 10 రోజుల క్రితం పులి మృతదేహం లభించగా, ఘటనపై నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను వెల్లడించింది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 7, 2026
- 10:39 am
Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
అది అర్ధరాత్రి వేళ.. కాలనీవాసులంతా గాఢనిద్రలో ఉన్న సమయం.. హఠాత్తుగా ప్రత్యక్షమైంది ఆ పది అడుగుల భయంకర రూపం. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్లో గురువారం అర్ధరాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 7, 2026
- 8:49 am
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలం భూ సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారుల తీరుపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరణించింది. సర్వే విషయమే ఆమె ప్రాణం తీసింది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 6, 2026
- 11:32 am
నాన్న.. మందు మైకంలో పిచ్చి పనులు వద్దు అన్నందుకు…
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించిన కుమారుడిపై కక్ష పెంచుకున్న తండ్రి.. అర్ధరాత్రి నిద్రలో ఉన్న అతడిని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన భార్య, కోడలిపై కూడా దాడికి యత్నించి పరారయ్యాడు. మృతుడి భార్య గర్భిణి కావడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 4, 2026
- 10:44 am
Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..
నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రహదారి దాటేందుకు యత్నించగా, వాహనదారులు సమయస్ఫూర్తితో హారన్లు మోగిస్తూ కేకలు వేయడంతో అది తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 3, 2026
- 11:07 am
శ్రీశైలం బ్యాక్వాటర్లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!
ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సప్త నదుల సంగమేశ్వరుడు జలాధివాసం చేశాడు. వేపదాల శివలింగాన్ని శ్రీశైలం కృష్ణాజిల్లాలు తాకడంతో చివరిసారి పూజలు నిర్వహించారు అర్చకులు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంలో పంచ పాండవులు ప్రతిష్టించారని ప్రచారం పొందుతున్న సంగమేశ్వర స్వామి ఆలయం ప్రతిసారి నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా మునినప్పుడు పూజలు చేయడం చాలా కష్టం.
- J Y Nagi Reddy
- Updated on: Aug 1, 2026
- 12:10 pm
కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు..!
సూపర్ ఎల్ నినో భయాలు ఒకవైపు వెంటాడుతున్నప్పటికీ, కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఊహించని విధంగా ఎగువ ప్రాంతాల నుండి కృష్ణమ్మకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వానాకాలం సీజన్ కాస్త ఆలస్యమైనప్పటికీ, ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో విత్తనాలు వేసేందుకు రైతాంగం సిద్ధమవుతోంది.
- J Y Nagi Reddy
- Updated on: Aug 1, 2026
- 11:28 am
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి..
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్లో వృద్ధాప్యం కారణంగా T66Fగా గుర్తించిన ఆడ పెద్దపులి మృతి చెందింది. NTCA నిబంధనల మేరకు పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 30, 2026
- 1:34 pm
కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..?
నంద్యాల జిల్లా మల్యాల గ్రామంలో అప్పుల భారం, ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక కారు డ్రైవర్ రామసుబ్బయ్య తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నలుగురినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది.
- J Y Nagi Reddy
- Updated on: Jul 29, 2026
- 5:07 pm
శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి అత్యంత వైభవంగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. సుమారు 3 వేల కేజీల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.
- J Y Nagi Reddy
- Updated on: Jul 29, 2026
- 12:55 pm
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ
జిల్లా మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేక అమ్ముడుపోని టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంత రైతులు తీసుకొచ్చిన టమోటాలకు కిలోకు రూ.15 ధర నిర్ణయించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో ధర రూ.10 ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. దీంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు..
- J Y Nagi Reddy
- Updated on: Jul 28, 2026
- 8:22 pm