24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
Andhra Pradesh: 10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బీఈడీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పదేళ్ల బంధాన్ని కులం నెపంతో కాలదన్నిన ప్రియుడి మోసాన్ని భరించలేక పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. కర్నూలు నగరంలోని బుధవార్పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 20, 2026
- 6:11 pm
ఎల్నీనో ఎఫెక్ట్.. 12 ఏళ్ల కష్టం, 29లక్షల పెట్టుబడి.. సాగుచేసిన పంటను చేతురాల నరికేసిన రైతన్న!
కన్నబిడ్డల్లా సాకిన చెట్లను.. తన చేతులతోనే నరికేయాల్సి వస్తే ఆ రైతు గుండె ఎంతలా రగిలిపోతుందో కదా! పన్నెండేళ్ల శ్రమను, పచ్చని ఆశలను కళ్లముందే నేలమట్టం చేసిన ఆ అన్నదాత ఆవేదన వర్ణనాతీతం. వానలు పడక.. బోర్లు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు గుండెను రాయి చేసుకున్నాడు. నీరు అందక నిలువునా ఎండిపోతున్న ఏడు ఎకరాల చీని, ఎకరం నిమ్మ తోటను తట్టుకోలేక గొడ్డలితో నరికేసి కన్నీరుమున్నీరయ్యాడు. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 20, 2026
- 10:42 am
అత్తారింటికి వెళ్లిన అల్లుడు.. పంట పొలాల్లో విగతజీవిగా మారిన యువకుడు..!
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ హత్య వెలుగు చూసింది. అత్తారింటి వద్ద ఉంటున్న వీరేష్ అనే యువకుడు పొలాల్లో విగతజీవిగా లభించాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, వెనుక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 19, 2026
- 7:30 pm
Nandyala Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కళ్లలో కారం చల్లి, పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో దాడి!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంటకు చెందిన రౌడీషీటర్ మిద్దె నాగార్జున దారుణ హత్యకు గురయ్యాడు. వినాయక నిమజ్జనం నుండి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు అతని కళ్ళలో కారం చల్లి, పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అక్రమ సంబంధం లేదా ఇతర పగలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 19, 2026
- 9:50 pm
నిమజ్జనం తర్వాత ‘నా గణపతి కావాలి’ అంటూ మూడేళ్ల బాలుడి కన్నీళ్లు.. కదిలిస్తున్న వీడియో
మూడు రోజుల పాటు ఇంట్లో గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మూడేళ్ల బాలుడు ఆర్యన్.. నిమజ్జనం తర్వాత తన గణపతి కనిపించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా గణపతి కావాలి” అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది. ..
- J Y Nagi Reddy
- Updated on: Sep 17, 2026
- 12:16 pm
రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్.. సీసీ కెమెరాలతో గుట్టు రట్టు!
రద్దీగా ఉండే బస్సులు, పుణ్యక్షేత్రాలు, మార్కెట్ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ప్రయాణికుల మెడల్లోని బంగారు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులను ఏమాత్రం అనుమానం రాకుండా కాజేయడంలో సిద్ధహస్తురాలైన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలతో కలకలం సృష్టించిన ఈ లేడీ దొంగ నుంచి ఏకంగా 30 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ లేడి దొంగ కథేంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే..
- J Y Nagi Reddy
- Updated on: Sep 16, 2026
- 9:26 pm
వీదికో వెరైటీ గణేష్.. ఆ నగరంలో భక్తులను ఆకట్టుకుంటున్న రంగురంగుల వినాయకులు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగుతున్నాయి. వీధివీధినా కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈసారి ఇక్కడి మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు, భారీ సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆలోచనలు, వినూత్న అలంకరణలతో యువకులు నెలల తరబడి శ్రమించి తీర్చిదిద్దిన రూపాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Sep 14, 2026
- 3:12 pm
2 నెలల శ్రమ.. రూ.5 లక్షల ఖర్చు.. ఆ ఊరిలో మత్స్యావతారంలో కొలువుదీరిన గణనాథుడు!
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి వీధిలో గణనాథుడి సందడే..అయితే.. ఈసారి మాత్రం వినాయక విగ్రహాల ఏర్పాటు ఓ రేంజ్లో కనిపిస్తోంది. తమ మండపంలో కొలువుదీరే గణపయ్య.. అందరి గణపయ్యల కంటే కాస్త ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన.. నిర్వాహకుల్లో కొత్త ఆలోచనలకు తెరతీసింది. దీంతో కళాకారులు సైతం తమ సృజనాత్మకతకు పదును పెట్టారు..
- J Y Nagi Reddy
- Updated on: Sep 14, 2026
- 9:28 am
Video: కళ్లను ఆశ్చర్యపరిచే కళాకండం.. కందిపప్పుపై బొజ్జ గణపయ్యను చెక్కిన ఆదోని కుర్రాడు
కందిపప్పు గింజలు ఎంత చిన్నగా ఉంటాయి.. వాటిని ఒక్కటిగా పట్టుకోవాలంటే సాధ్యం కాదు.. అలాంటి ఇక్కడో కుర్రాడు మాత్రం.. ఆ కందిపప్పు గింజపై ఏకంగా వినాయకుడి చిత్రాన్నే గీశాడు. చేతితో పట్టుకునేందుకు వీలు లేనిపై దాన్యం గింజపై అతను వేసిన గణపయ్య చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. ఇంతకూ ఆ కుర్రాలు ఎవరూ.. ఏ ప్రాంతానికి చెందినవాడనేగా మీ డౌట్.. అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- J Y Nagi Reddy
- Updated on: Sep 14, 2026
- 8:32 am
Krishnadevaraya Caste: శ్రీకృష్ణదేవరాయల కులం.. బలిజ-యాదవుల నంద్యాల వివాదం, విగ్రహావిష్కరణపై ఉత్కంఠ
Krishnadevaraya Caste: రాయలసీమలో కృష్ణదేవరాయల గురించి బహుశా తెలియని వారు చదవని వారు ఉండరేమో. ఆయన నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సాక్షిభూతాలుగా ఉన్నాయి. అలాంటి పరిపాలకుడిని రాజనీతిజ్ఞుడిని కేవలం ఒక కులానికే పరిమితం చేస్తారా అనేవారు కూడా ఉన్నారు. మొత్తం..
- J Y Nagi Reddy
- Updated on: Sep 12, 2026
- 5:16 pm
El Nino Effect: ఎల్నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..
ఎల్నినో ప్రభావంతో నల్లమల అడవుల్లో నీటి వనరులు తగ్గిపోవడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం గ్రామాల వైపు వస్తున్నాయి. నంద్యాల జిల్లాలో నీటి కోసం వచ్చిన రెండు చుక్కల దుప్పులు ప్రమాదాల్లో చిక్కుకోగా.. గ్రామస్తులు, అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి వాటిని రక్షించారు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 12, 2026
- 12:36 pm
ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు…గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! మరెక్కడో కాదు..
ఊరు ఊరినే వణికిస్తున్న గుండెపోటు...గంటల వ్యవధిలోనే వరుస మరణాలు..! ఒకే గ్రామం.. కొన్ని గంటల వ్యవధి.. ఇద్దరి ప్రాణాలను గుండెపోటు బలిగొంది. ఉదయం లేచే సమయానికి ఒక కుటుంబంలో విషాదం నిండితే.. కొద్ది గంటలకే మరో ఇంట్లోనూ అదే విషాదం చోటుచేసుకుంది. వరుసగా ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Sep 10, 2026
- 6:20 pm