24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
అనైతిక బంధం ఆయువు తీసింది.. ముగ్గురు బలి, రెండు కుటుంబాల్లో తీరని విషాదం!
కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా మూడు ప్రాణాలు బలైన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను వదిలి ప్రియుడితో వచ్చిన ఓ మహిళ, ఆమె ఐదు నెలల పసికందు, చివరకు ప్రియుడు కూడా మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 13, 2026
- 3:38 pm
Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్ చైన్లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్
బంగారం ధర పెరిగేకొద్దీ రకరకాల మోసాలు పుట్టుకొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బంగారం పేరుతో జరిగిన మోసం చూస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారానికి మెరుగు పెడతామని, కళకళలాడుతుందని చెప్పి మహిళలను మోసగించిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. అసలేం జరిగిందంటే..
- J Y Nagi Reddy
- Updated on: Jun 11, 2026
- 3:05 pm
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
నంద్యాల పాత పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో లిఫ్ట్ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని బేతంచెర్లకు చెందిన శారదగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం లిఫ్ట్లో కిందకు వస్తుండగా సాంకేతిక లోపంతో అది ఒక్కసారిగా కిందకు జారి పడిపోయింది. ఆ తర్వాత..
- J Y Nagi Reddy
- Updated on: Jun 11, 2026
- 2:44 pm
‘లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్’ ఓ చిన్నారి ఆవేదన
చదువుకోవాలన్న ఆరాటం ఆ పాపది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం ఆ కుటుంబానిది. లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించండి, నేను బాగా చదువుకుంటా అంటూ ఓ చిన్నారి సాగిస్తున్న ఆవేదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది..
- J Y Nagi Reddy
- Updated on: Jun 9, 2026
- 8:04 pm
శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం
భక్తుల కొంగు బంగారంగా, దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో భక్తుల నుంచి కానుకల ప్రవాహం కొనసాగుతోంది. జ్యోతిర్లింగా, శక్తి పీఠంగా విశేష ఖ్యాతి పొందిన ఈ క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి, అమ్మ వార్లపై ఉన్న భక్తి, విశ్వాసాలకు గుర్తుగా విలువైన ఆభరణాలు, నగలు, బంగారం, వెండి వస్తువులను ఆలయానికి విరాళంగా అందజేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 9, 2026
- 7:55 pm
Andhra Pradesh: జాతీయ రహదారిపై బైక్ తుక్కుతుక్కు.. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులకే దిమ్మతిరిగింది!
‘చెడపకురా చెడేదవు’.. పెద్దలు ఊరికే అనలేదు. ఒకరు కష్టపడి కొనుక్కున్న బైక్ను దొంగిలించిన ఆ దొంగ.. 24 గంటలు కూడా తిరక్కుండానే అదే బైక్పై మృత్యువాత పడ్డాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన, ఘోర రోడ్డు ప్రమాద ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే బైక్ చుట్టూ దొంగతనం కేసు, ఘోర రోడ్డు ప్రమాదం తిరగడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 9, 2026
- 1:40 pm
Viral Video: పా..పా..పాము..పార్క్ చేసిన బైక్లోకి దూరి హల్చల్..! ఏం జరిగిందో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..!
ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కావచ్చు లేదా అడవులు తగ్గిపోవడం వల్ల కావచ్చు.. పాములు జనావాసాల్లోకి విపరీతంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా మనం రోజువారీ వాడే బైకులు, కార్లు, చివరకు ఇంట్లో వేసుకునే షూస్లలో కూడా పాములు నక్కి ఉంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, కర్నూలు జిల్లాలో ఇలాంటిదే ఒక ఒళ్ళు జలదరించే సంఘటన వెలుగుచూసింది. ఒకవేళ స్థానికులు గమనించకుండా ఉండి ఉంటే.. ఊహించని ప్రమాదం జరిగి ఉండేది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 9, 2026
- 12:43 pm
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు దుర్మరణం!
ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్న చిన్న కుమార్తె ఇండియాకు రావడంతో ఆ వృద్ధ దంపతులు సంతోషపడ్డారు... అల్లుడు, కూతురు మనవళ్లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.. ఐదు రోజులపాటు సంతోషంగా గడిపార. స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మరికొన్ని గంటల్లో వారు సొంత ఇంటికి చేరుకునేవారు. కానీ, అంతలోనే విధి వక్రీకరించింది.. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింద.. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయాయి.. మృతులంతా కర్నూలు జిల్లా ఆదోని వాసులు కాగా సంఘటన మాత్రం కర్ణాటకలోని గొల్లల హట్టి గేటు వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
- J Y Nagi Reddy
- Updated on: Jun 5, 2026
- 8:56 am
కొడుకు కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన భయంకర నిజం!
కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. కానీ దర్యాప్తులో బయటపడిన నిజాలు అందరినీ షాక్కు గురిచేశాయి. పూర్తి వివరాలు కథనంలో ..
- J Y Nagi Reddy
- Updated on: Jun 3, 2026
- 1:21 pm
వామ్మో.. కర్నూలు జిల్లాలో డెత్ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!
శ్రీ గురురాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఆలయం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. అయితే, భక్తుల పాపాలను కడిగే ఆ పవిత్ర నది, కొన్నిసార్లు పర్యాటకులు, యువత పాలిట మృత్యువలయంగా మారుతోంది. గత ఐదేళ్లలోనే ఇక్కడ 50 మందికి పైగా భక్తులు నది ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 3, 2026
- 1:32 pm
RCB గెలిచిందని రచ్చ రచ్చ.. బస్సులపై రాళ్లు, టైర్లకు నిప్పు.. కట్చేస్తే 18 మంది అరెస్ట్!
Kurnool RCB Victory Violence: ఐపీఎల్ ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో విధ్వంశానికి దిగిన కర్నూలు కుర్రాళ్లకు తిక్క కుదిరింది. అరెస్టు చేసి నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సంబరాల పేరిట అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు..
- J Y Nagi Reddy
- Updated on: Jun 2, 2026
- 4:42 pm
భక్తులకు అలర్ట్..! శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..
Srisailam VIP Darshan: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
- J Y Nagi Reddy
- Updated on: May 29, 2026
- 7:54 am