24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
ఆ ఊర్లో మేడ ఉంటే ఒట్టు.. ఎందుకో తెలిస్తే షాక్..! మేడ లేని ఆ ఊరు ఎక్కడుందంటే..?
Peddahothur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతురులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణలు చేపట్టరు. అందుకు కారణం వంద ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక భూస్వామి.. ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు నిర్మాణం చేసే సమయంలోనే వారి కుటుంబలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగిందని ప్రచారం. అంతేగాక, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లరాని తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరు మేడలు కట్టరు. అందుకు ఆ గ్రామానికి మేడ లేని ఊరు అని పిలుస్తారు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 26, 2026
- 11:46 am
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 23, 2026
- 10:52 am
15 రోజుల్లో పెళ్లి.. వెంటాడిన మాయదారి రోగం.. కాబోయే పెళ్ళి కొడుకు మృతి..!
వివాహం కుదిరింది.. పెళ్లి దగ్గర పడింది.. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులంతా బిజీగా ఉన్నారు.. ఇంతలోనే వరుడి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయోజకుడు అయినా కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తండ్రి, వివాహం కుదుర్చాడు. మరో రెండు వారాల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో కుమారుడికి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో చికిత్స కొరకు ఆసుపత్రికి వెళ్లారు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 21, 2026
- 9:42 pm
Srisailam: మహాశివరాత్రి ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.5.61 కోట్లు
ఈసారి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రికార్డు స్థాయిలో మల్లన్న హుండీ ఆదాయం వచ్చింది. మామూలుగా అయితే నెలకు 3 కోట్లకు పైగా శ్రీశైలం కి హుండీ ఆదాయం వచ్చేది. మహాశివరాత్రి సందర్భంగా కేవలం 13 రోజులకే 5.61 కోట్లతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ అదనంగా ఆదాయం వచ్చింది..
- J Y Nagi Reddy
- Updated on: Feb 20, 2026
- 6:10 pm
AP News: రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!
కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి 2022 ఏప్రిల్ 20న హైదరాబాదు నుంచి కర్నూలుకు ఫార్చ్యూనర్ కారులో వస్తుండగా మహబూబ్నగర్ జిల్లాలోని ఉండవల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పులకుర్తి సౌజన్య, తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు..
- J Y Nagi Reddy
- Updated on: Feb 20, 2026
- 5:31 pm
Andhra: అందరూ పే..ద్ద పామును భలేగా పట్టాడనుకున్నారు.. కట్ చేస్తే.. కాసేపటి తర్వాత
ఎన్నో నాగుపాములు, కొండచిలువలు పట్టుకున్న స్నేక్క్యాచర్నే నాగుపాము కాటుకు గురైన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం వద్ద చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. అదేంటో ఇక్కడ తెలుసుకుందామా.. లేట్ ఎందుకు..
- J Y Nagi Reddy
- Updated on: Feb 18, 2026
- 12:40 pm
Andhra: దేవదాసు ఎంత పని చేశాడు.. చర్చికి వెళ్దామని మహిళను అడవిలోకి తీసుకెళ్లి..
గోనెగండ్ల మండలం బి. అగ్రహారం గ్రామానికి చెందిన హంద్రీ దేవదాసుకు, అదే మండలం బైలుప్పల గ్రామానికి చెందిన లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం ఉండేది.. ఈ క్రమంలోనే.. ఆమెను వదిలించుకోవాలని పథకం వేసి.. చర్చికి వెళ్దామని ఆమెను అడవిలోకి తీసుకెళ్లి మర్డర్ చేశాడు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 18, 2026
- 11:42 am
Tomato Price Crash: పాతాలానికి పడిన టమాటా ధరలు.. కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు!
కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు టమాటా రైతులు. ఎందుకంటే ప్రతి ఇంటిలో ప్రతి వంటలో వాడే టమాటా ధరలు మళ్ళీ పాతాలానికి చేరాయి. ఎళ్ల కాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో కనీస గిట్టుబాటు ధరే కాదు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఎక్కడపడితే అక్కడ టమోటాలను పారబోస్తున్నారు రైతులు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 10, 2026
- 11:55 am
Andhra: ఆటో.. అటో.. ఇటో.. నడిరోడ్డుపై విన్యాసాలు.. కట్చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?
హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44పై కర్నూలు శివారులో ఆటోలతో విన్యాసం చేసిన దృశ్యాలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేశారు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 5, 2026
- 3:32 pm
కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్..
త్రెడ్స్ యాప్లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.
- J Y Nagi Reddy
- Updated on: Feb 4, 2026
- 9:02 pm
Andhra News: సచివాలయం వాష్రూమ్ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏంటని వెళ్లి చూడగా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో ఉద్యోగి మధుశేఖర్ గొంతు కోసుకొని అత్మహత్యయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉద్యోగి మదుశేఖర్ ను సహచర ఉద్యోగులు చికిత్స కొరకు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Jan 28, 2026
- 10:24 pm
Viral Video: యముడికే మస్కా కొట్టాడు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కూలిన స్థంభం.. అంతలోనే
చావుని చూసొచ్చాడు. గండాన్ని తప్పించుకున్నాడు. చచ్చి బతికాడు.. ఇలా కొన్ని సందర్భాల్లో ఏవో మాటలు వింటూ ఉంటాం. కానీ అలాంటి ఘటనే ఇప్పుడు కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. క్షణంలో వందోవంతు ఆలస్యమై ఉన్నా ఇక్కడ ఓ కుర్రాడు మాడి మసైపోయేవాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. వెంట్రుకవాసిలో మరణాన్ని తప్పించుకున్నాడు. అందుకే ఇతను మృత్యుంజయుడయ్యారు.
- J Y Nagi Reddy
- Updated on: Jan 27, 2026
- 7:26 pm