J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల.. చల్లగా మారిన వాతావరణం..

నంద్యాల జిల్లాలో వర్షం, వడగండ్ల వాన బీభత్సం.. పక్షులు విలవిల.. చల్లగా మారిన వాతావరణం..

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున 3 గంటల నుంచి కురిసిన ఈ వర్ష బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రేకుల షెడ్లు ఎగిరి 20 అడుగుల దూరంలో పడిపోయాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో తెల్లవారుజామున నుంచి పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.

Watch Video: శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి షాకైన భక్తులు

Watch Video: శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి షాకైన భక్తులు

నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. జనాలు సంచరించే ప్రదేశంలోకి ఎలుగుబంటి రావడమేంటని యాత్రికులు షాక్ అయ్యారు. రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

Watch Video: సీఎం జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని రాంభూపాల్ రెడ్డి

Watch Video: సీఎం జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని రాంభూపాల్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ దాడి చేస్తున్నారు. సీఎం జగన్‎పై చంద్రబాబు నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు. వయసుకు తగ్గట్లు, రాజకీయ అనుభవానికి తగినట్లుగా చంద్రబాబు మాట్లాడకుండా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతూ నేరానికి పాల్పడుతున్నారన్నారు.

శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం..

శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం..

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయన్ని కెఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు చెందిన నాలుగురు సభ్యలతో కూడిన బృందం సందర్శించింది. జలాశయం వద్ద పరిశీలనకు వచ్చిన ఈ బృందానికి డ్యామ్ అధికారులు స్వాగతం పలికారు. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం పరిశీంచింది. నేడు రెండోవ సారి డ్యాం భద్రత, నీటి నిల్వలు, గేట్ల రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)ను పరిశీలించారు.

Watch Video: టీడీపీ సూపర్6 ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక

Watch Video: టీడీపీ సూపర్6 ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక

చంద్రబాబు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో‎పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమయ్యేవి, ప్రజలకు ఏమి చేయగలమో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. సాధ్యం కానివి ఏవి కూడా చెప్పలేదన్నారు.

Srisailam: వైభవంగా భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవం.. ‘స్త్రీ’ వేషధారణలో హారతినిచ్చిన ఉద్యోగి..

Srisailam: వైభవంగా భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవం.. ‘స్త్రీ’ వేషధారణలో హారతినిచ్చిన ఉద్యోగి..

అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో రెండోవ విడత సాత్విక బలులను సమర్పించారు. అలానే మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. అంతకుముందు శ్రీ మల్లి కార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర శొంటి భక్షాలతో కప్పేశారు.

Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం

Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం

నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు.

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

కజకిస్థాన్ లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కవిత దంపతుల కుమారుడు పవన్ తేజేశ్వర్ రెడ్డి కజకిస్తాన్‎లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు. ఆదివారం కజకిస్తాన్‎లోని ఓ సరస్సులో సరదాగా ఈతకొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే సరస్సులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి పవన్ తేజేశ్వర్ రెడ్డి మృతి చెందాడు.

ఇదో వింత ఆచారం.. పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట.. తన్నించుకోవడానికి బారులు తీరే భక్తులు..

ఇదో వింత ఆచారం.. పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట.. తన్నించుకోవడానికి బారులు తీరే భక్తులు..

పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడ భక్తుల అపార నమ్మకం. ఆయన కాళీ తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకొన్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్ళిపోతారు. ఈ భక్తి కాలి తన్ను క్రీడను చూడాలంటే కర్నూలు జిల్లా కు వెళ్లల్సిందే. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు.

Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా బీ అలర్ట్..! ఈ వస్తువులను అస్సలు తీసుకెళ్ళొద్దంటున్న అధికారులు!

Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా బీ అలర్ట్..! ఈ వస్తువులను అస్సలు తీసుకెళ్ళొద్దంటున్న అధికారులు!

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా అధికారులు నిర్ణయించారు. షేదాజ్ఞలు పాటించని వారిపై జరిమానా విధించాలని భావిస్తున్నారు

Watch Video: తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..

Watch Video: తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..

గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‎గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ, జనసేన తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి..

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ, జనసేన తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీయే పొత్తు వికటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు చేత పట్టి భారీ ర్యాలీగా బయలుదేరారు. తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని ఎన్నికల అధికారి చిరంజీవి దగ్గర నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం అధిష్టానం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.