24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..
కర్నూలు జిల్లా ఆదోనిలో భార్యను ఇంటికి పంపించడం లేదని ఓ యువకుడు రేడియో టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. పోలీసులు జోక్యం చేసుకొని, యువకుడిని కిందకు దించారు. అనంతరం దంపతులు, వారి కుటుంబ సభ్యులకు స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 26, 2026
- 12:36 pm
శ్రీశైలంమల్లన్న దేవస్థానం హుండీ కౌంటింగ్.. ఈసారి విదేశీ కరెన్సీ ఎంతంటే?
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 83 లక్షల 22 వేల 554 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 24, 2026
- 3:14 pm
పచ్చని కాపురంలో అనుమాన చిచ్చు.. అమ్మ కాటికీ.. నాన్న జైలుకు.. అనాథలుగా ఇద్దరు బిడ్డలు!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే, విచక్షణ కోల్పోయి టైలరింగ్ కత్తెరతో ఆమె గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 24, 2026
- 12:58 pm
NDA ఎంట్రన్స్ పరీక్షలో మెరిసిన నంద్యాల కుర్రోడు.. ఎన్నో ర్యాంక్ అంటే..
పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించాడు నంద్యాల జిల్లా యువకుడు. కఠోర శ్రమ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ అతను ఏం సాధించాడు..? ఎందులో ప్రతభ కనబరిచాడు.. పూర్తి వివరాలు కథనంలో ...
- J Y Nagi Reddy
- Updated on: Apr 22, 2026
- 12:26 pm
Andhra Pradesh: జోరుగా ఐపీఎల్ బెట్టింగ్.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం! సెటప్ చూస్తే మతిపోవాల్సిందే..
ఎమ్మిగనూరులో సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో పట్టణ సీఐ, సిబ్బంది పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై మెరుపు దాడులు నిర్వహించారు...
- J Y Nagi Reddy
- Updated on: Apr 20, 2026
- 1:00 pm
Fuel shortage: మళ్లీ మొదలైన ఇందన కష్టాలు.. పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు!
నెల రోజుల క్రితం పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు ఇప్పుడు తెలుగురాష్ట్రాల సెగలు పుట్టిస్తున్నాయి. అమెరికా- ఇజ్రయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు సరఫరా నిచిలిపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇందన కొతర ఏర్పడింది. అది ఇప్పుడు పతాక స్థాయికి చేరడంతో తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇందనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 20, 2026
- 10:17 am
కాపురానికి రావట్లేదనీ.. ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
భార్య కాపురానికి రావట్లేదనీ ఓ భర్త మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఉన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం (ఏప్రిల్ 19) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం..
- J Y Nagi Reddy
- Updated on: Apr 20, 2026
- 8:53 am
Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తులు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు దాతలను ఆశీర్వదించారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 18, 2026
- 10:08 pm
భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన
కర్నూలు జిల్లా చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదం కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది.
- J Y Nagi Reddy
- Updated on: Apr 18, 2026
- 1:39 pm
పోస్టుమార్టం రిపోర్ట్తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!
Nandyal murder case: పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. పోలీసు దర్యాప్తులో కూడా హత్య అని తేలింది. భర్త వెంకటాచంద్రుడు కొడుకు వెంకటరమణ కూడా హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 18, 2026
- 12:36 pm
సైబీరియా నుంచి కర్నూలుకు వలస.. వేలాది పక్షుల అద్భుత దృశ్యం
Siberian migratory birds Kurnool: కర్నూలు మండలంలో గార్గేయపురం చెరువు సమీపంలోనే నగర వనం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిట్టడవిని తయారు చేశారు. ఆ పక్కనే సహజంగా ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేశారు.సెలవుల్లో కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు.
- J Y Nagi Reddy
- Updated on: Apr 11, 2026
- 1:43 pm
ఈ ఆవు పొట్ట అసహజంగా ఉబ్బిపోయింది.. పశువైద్యులు పరీక్షించగా కడుపులో..
పుల్లయ్య అనే రైతు పెంచుతున్న ఆవు… కొన్ని రోజులుగా పొట్ట అసహజంగా ఉబ్బిపోవడం, ఆహారం తినకపోవడం, తీవ్రంగా బాధపడడం ప్రారంభించింది. మొదట ఇది సాధారణ జీర్ణ సమస్య అనుకున్నారు. కానీ పరిస్థితి క్రమంగా విషమించింది. పశువైద్యులు పరీక్షించగా అసలు సమస్య బయటపడింది.
- J Y Nagi Reddy
- Updated on: Apr 11, 2026
- 10:44 am