AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్సూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం!

పాలసీదారు కుటుంబానికి ఊరట.. ఇన్సూరెన్స్ సంస్థకు షాక్! కోటి బీమా మొత్తంతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆదేశం!

HDFC ERGO penalty Telugu: పాలసీదారు మరణం తర్వాత ఆదాయ వివరాలు తప్పుగా ఉన్నాయంటూ బీమా క్లెయిమ్‌ను తిరస్కరించిన HDFC ఎర్గోకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. పాలసీ మొత్తమైన కోటి రూపాయలను 9% వడ్డీతో పాటు మానసిక వేదన, కోర్టు ఖర్చుల కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు!

Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు!

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే నిర్వహణ పనులల్లో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసిన పాతాళ గంగకు వెళ్లే టూరిజం రోప్ వే అధికారులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఇకపై ఈ మార్గంలో రూప్‌లే టూరిజం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు.

Traffic Police: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వాటితో రోడ్డుపైకి వస్తే అంతే..

Traffic Police: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వాటితో రోడ్డుపైకి వస్తే అంతే..

బైకులకు, ఆటోలకు సైలెన్సర్ మార్చి భారీ శబ్దంతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. అదిక శబ్ధాలు చేసే వాహనాలను అడ్డుకొని వాటి సైలెన్సర్లను తొలగిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..

మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆలయంలోని టెంకాయల కౌంటర్ వద్ద నాగుపాము కనిపించడంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్‌ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

Andhra News: అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండానే బావ బామ్మర్ది మృతి!

Andhra News: అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండానే బావ బామ్మర్ది మృతి!

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పొట్టకూటి కోసమని పొరుగూరికి కూలి పనులకు వెళ్లి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువు వెంటాడింది. వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్ర గాయాల కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

హంపి విహారయాత్రలో విషాదం.. తుంగభద్రలో తల్లి, కూతురు మృతి!

హంపి విహారయాత్రలో విషాదం.. తుంగభద్రలో తల్లి, కూతురు మృతి!

హంపి విహారయాత్రలో తల్లి, కూతురు తుంగభద్ర నదిలో మునిగి మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. సులేకేరి గ్రామానికి చెందిన షాహిన్‌ (38), యాస్మిన్‌ (13) నదిలో స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండటంతో, ఈత రాక మృతి చెందారు. విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నదులు, జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా పట్టుకున్నారంటే?

1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా పట్టుకున్నారంటే?

అది 1992 సంవత్సరం.. ఓ కానిస్టేబుల్ ప్రజలతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో బస్సులును అడ్డగించిన కొందరు మావోయిస్టులు లోపనికి లొచరబ్బారు. ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో బస్సులో ఉన్న వ్యక్తి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాదాపు 34 ఏళ్ల దర్యాప్తు తర్వాత ఆ కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం

Srisailam Temple news: శ్రీశైలం ఆలయంలో దర్శనాల వ్యవహారంపై వైరల్‌గా మారిన ఆడియో నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆడియో వైరల్ కావడానికి కారణమయ్యారనే ఆరోపణలతో ఆలయ ప్రధాన భద్రతాధికారి శ్రీనివాసరావును అధికారులు టెర్మినేట్ చేశారు. మరోవైపు హుండీ చోరీ, ఉద్యోగులపై ACB కేసుల నేపథ్యంలో తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

రక్తపు మరకలు.. అనుమానాస్పద మృతి.. శివప్రియ కేసులో అసలేం జరిగింది?

రక్తపు మరకలు.. అనుమానాస్పద మృతి.. శివప్రియ కేసులో అసలేం జరిగింది?

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ వివాహిత అనుమానాస్పద మృతిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలోని అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల శివప్రియ మృతి ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.

అమ్మో.. వర్షం కోసం వేలాదిమంది భక్తులు ఏం చేశారంటే..? కర్నూలులో వింత ఆచారం! వీడియో ఇదిగో

అమ్మో.. వర్షం కోసం వేలాదిమంది భక్తులు ఏం చేశారంటే..? కర్నూలులో వింత ఆచారం! వీడియో ఇదిగో

Kurnool Gunti Rangaswamy Temple: కర్నూలు జిల్లా వెంకటాపురం కాలనీ గుంటి రంగస్వామి ఆలయంలో ఒక వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రావణమాసంలో భక్తులు తుంగభద్ర నుంచి నీరు తెచ్చి అభిషేకం చేశాక, ఆయుధాలతో గుడి చుట్టూ తిరుగుతారు. రోగులు పడుకుంటే, వారిపై నుంచి దాటడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇది వర్షాలు, పంటలకు శుభమని కూడా విశ్వసిస్తారు.

పెళ్లి మండపంలో జాతీయ జెండా.. తాళి కట్టే ముందు వరుడు చేసిన పనికి అంతా ఫిదా!

పెళ్లి మండపంలో జాతీయ జెండా.. తాళి కట్టే ముందు వరుడు చేసిన పనికి అంతా ఫిదా!

దేశభక్తిని చాటుతూ నంద్యాలలో ఓ వివాహ వేడుకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివాహం సందర్భంగా వరుడు చైతన్య జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం వధువు మెడలో తాళి కట్టారు.పెళ్లి పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు

తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక మార్పులు చేసింది. టీటీడీ తరహాలో వీవీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖల ఆధారంగా ప్రోటోకాల్ దర్శనాలను కల్పించే విధానాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు ఒక్క లేఖ చొప్పున గరిష్ఠంగా ఆరుగురి పేర్లను సిఫారసు చేయవచ్చు.