24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
శ్రీశైలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు,శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు
- J Y Nagi Reddy
- Updated on: Mar 18, 2026
- 7:49 am
ఎలుగుబంటి బీభత్సం.. కట్టెల కోసం వెళ్లిన చెంచు గిరిజనుడిపై విచక్షణారహిత దాడి..!
నంద్యాల జిల్లాలోని నల్లమల ప్రాంతంలో ఎలుగుబంటి భయంతో చెంచు గిరిజనులను వణికిస్తోంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ చెంచు గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 15, 2026
- 10:56 am
తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
అయ్యో పాపం పసిపిల్లలు.. భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని మరణ శాసనం రాసింది ఓ తల్లి. ఇద్దరు కొడుకులతో కలిసి చెరువులోకి దూకింది తల్లి. నీట మునిగిన ముగ్గురు మృతి చెందారు. చెరువులో విగతజీవులుగా కనిపించిన వారిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 14, 2026
- 2:23 pm
అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..
ఐదు కిలోమీటర్లు కాదుపది కిలోమీటర్లు కాదు.. యాభై కిలోమీటర్లు కూడా కాదు,ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా,అలుపు సొలుపు తెలియకుండా,ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ అంటూ కర్ణాటక నుంచి శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు కన్నడ భక్తులు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 13, 2026
- 2:11 pm
ప్రధాన రహదారి పక్కన చిరుతపులి పిల్ల మృతదేహం కలకలం.. ఇంతకీ ఎలా జరిగింది..?
కర్నూలు జిల్లాలోని కొండల్లో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు చిరుత పులల సంచారం కళ్ళ ముందే కనిపిస్తున్న ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దట్టమైన అడవులలో ఉండే పులులు కర్నూలు జిల్లా కొండ ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. కొండ ప్రాంతాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Mar 12, 2026
- 12:06 pm
AP News: కిలో టమాట ధర రూ.2లే.. ఆరుగాలం పండించిన పంట పశువుల పాలు! వీడియో
టమోటా ధర భారీగా కుప్పకూలింది. 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దృశ్యాలు చూపరులను..
- J Y Nagi Reddy
- Updated on: Mar 12, 2026
- 11:27 am
Andhra: ఎంత పనిచేశావ్ స్వప్న.. నిన్న ప్రియుడితో పెళ్లి.. కులం వేరని ఒప్పుకోని అత్త.. అంతలోనే
ఇద్దరిది వేరు వేరు కులాలు.. అయినా.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. పోలీసుల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో.. యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఇది తెలుసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది..
- J Y Nagi Reddy
- Updated on: Mar 10, 2026
- 5:20 pm
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా?
టమోటా ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టమంతా వృధా అయ్యిందంటూ, బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాటా ధర రూ.5 ఉంది. ఒక్క టమాటా బాక్స్ ధర 40 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక రైతులు టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 9, 2026
- 6:12 pm
ఉగాది వచ్చేస్తోంది.. శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?
నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రమైన శ్రీశైలం ఉగాది మహోత్సవాలు దగ్గర పడుతుండడంతో కన్నడ, మహారాష్ట్ర భక్తులు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి, అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన కన్నడ, మహారాష్ట్ర భక్తజనంతో క్షేత్రమంత సందడి వాతావరణం నెలకొంది.
- J Y Nagi Reddy
- Updated on: Mar 9, 2026
- 6:11 pm
ఆమె కంటే VIP ఎవరుంటారు.. నీజంగా మీరు గ్రేట్ బ్రదర్
అందరూ ఆమెను మతిస్థిమితం లేని మహిళ అని పిలిచారు…కానీ ఆమె చేసే పని మాత్రం సమాజానికి పాఠం చెప్పింది. ప్రతి రోజు పాణ్యం బస్టాండ్, షాపుల ముందు పడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు ఏరుకుంటూ… ఎవరు చెప్పకుండానే స్వచ్ఛత కోసం పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుంకమ్మ... ఆమె మనసు, ఆమె పనితీరును గమనించిన ఒక వస్త్ర దుకాణం యజమాని…
- J Y Nagi Reddy
- Updated on: Mar 8, 2026
- 9:29 pm
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు అరటి పంటలు భారీగా సాగు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం కన్ను ఒకటి వెయ్యి నుంచి 2000 ఉండే ది. అరటి కోసే కూలీలకు కూడా ఆ ధర సరిపోక రైతులు ఎక్కడపడితే అక్కడ పారవేశారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 7, 2026
- 3:01 pm
పైసా.. పైసా కూడబెట్టి నమ్మి ఇస్తే.. నిండా ముంచి మాయగాళ్లు.. ఏకంగా రూ. 6 కోట్లతో జంప్..!
బంగారం ధర ఒకవైపు పెరుగుతుంటే.. అంతే స్థాయిలో గోల్డ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి.. ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బంగారు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. తీరా వారు విషయం తెలుసుకునే లోపు ఆ వ్యాపారులు నిలువునా ముంచి ఉడాయిస్తున్నారు. ఇలా అమాయక ప్రజలనే కాక, తోటి వ్యాపారులను కూడా నమ్మించి మోసం చేస్తూ ఉడాయించిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది.
- J Y Nagi Reddy
- Updated on: Mar 4, 2026
- 7:32 pm