AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు దుర్మరణం!

సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు దుర్మరణం!

ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్న చిన్న కుమార్తె ఇండియాకు రావడంతో ఆ వృద్ధ దంపతులు సంతోషపడ్డారు... అల్లుడు, కూతురు మనవళ్లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.. ఐదు రోజులపాటు సంతోషంగా గడిపార. స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మరికొన్ని గంటల్లో వారు సొంత ఇంటికి చేరుకునేవారు. కానీ, అంతలోనే విధి వక్రీకరించింది.. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింద.. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయాయి.. మృతులంతా కర్నూలు జిల్లా ఆదోని వాసులు కాగా సంఘటన మాత్రం కర్ణాటకలోని గొల్లల హట్టి గేటు వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొడుకు కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన భయంకర నిజం!

కొడుకు కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. దర్యాప్తులో బయటపడిన భయంకర నిజం!

కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. కానీ దర్యాప్తులో బయటపడిన నిజాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. పూర్తి వివరాలు కథనంలో ..

వామ్మో.. కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!

వామ్మో.. కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!

శ్రీ గురురాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఆలయం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. అయితే, భక్తుల పాపాలను కడిగే ఆ పవిత్ర నది, కొన్నిసార్లు పర్యాటకులు, యువత పాలిట మృత్యువలయంగా మారుతోంది. గత ఐదేళ్లలోనే ఇక్కడ 50 మందికి పైగా భక్తులు నది ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.

RCB గెలిచిందని రచ్చ రచ్చ.. బస్సులపై రాళ్లు, టైర్లకు నిప్పు.. కట్‌చేస్తే 18 మంది అరెస్ట్!

RCB గెలిచిందని రచ్చ రచ్చ.. బస్సులపై రాళ్లు, టైర్లకు నిప్పు.. కట్‌చేస్తే 18 మంది అరెస్ట్!

Kurnool RCB Victory Violence: ఐపీఎల్ ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో విధ్వంశానికి దిగిన కర్నూలు కుర్రాళ్లకు తిక్క కుదిరింది. అరెస్టు చేసి నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సంబరాల పేరిట అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు..

భక్తులకు అలర్ట్..! శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..

భక్తులకు అలర్ట్..! శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..

Srisailam VIP Darshan: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆశ చూపించాడు.. బ్లాక్ మనీ అంటే ‘నల్ల రంగు’ నోట్లనుకున్నాడు.. ట్విస్ట్ అదిరింది బాసూ..!

ఆశ చూపించాడు.. బ్లాక్ మనీ అంటే ‘నల్ల రంగు’ నోట్లనుకున్నాడు.. ట్విస్ట్ అదిరింది బాసూ..!

"ఆశే నిన్ను ముంచుతుంది" అంటారు పెద్దలు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్నాడు ఓ కేటుగాడు. నోట్లకు నల్ల రంగు పూసి, కెమికల్ మాయాజాలం చూపి.. అమాయక యువకుడిని నిలువునా ముంచేశాడు. సినిమా స్టోరీని తలపించే ఈ వింత మోసం కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బిడ్డా నాతోనే పెట్టుకుంటావా.. చిరుతకు చెమటలు పట్టించిన కోడి పుంజు.. ఇదిగో వీడియో

బిడ్డా నాతోనే పెట్టుకుంటావా.. చిరుతకు చెమటలు పట్టించిన కోడి పుంజు.. ఇదిగో వీడియో

శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. సున్నిపెంట వద్ద ఓ చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించి కోళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దృశ్యం వైరల్ అయ్యింది. భక్తులు, స్థానికులు పులుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం

ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం

నంద్యాల బొగ్గులైన్ ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ నాగుపాము కనిపించడం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. తీవ్ర ఎండల కారణంగా చల్లని ప్రదేశాల కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రజాక్ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాము కనిపిస్తే దాడి చేయకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

కలకాలం తోడూనీడగా ఉంటాడని ప్రేమ వివాహం చేసుకుంది.. కానీ అతను చేసిన మోసం తట్టుకోలేక..!

కలకాలం తోడూనీడగా ఉంటాడని ప్రేమ వివాహం చేసుకుంది.. కానీ అతను చేసిన మోసం తట్టుకోలేక..!

కుటుంబాన్ని ఎదిరించి, నాయకుడిని నమ్మి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత చివరికి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయి, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో చోటుచేసుకుంది.

Kurnool: ఆర్డర్ చేసింది వెజ్‌.. వచ్చింది నాన్‌వెజ్.. కస్టమర్ చేసిన పనికి స్విగ్గీకి ఊహించని షాక్

Kurnool: ఆర్డర్ చేసింది వెజ్‌.. వచ్చింది నాన్‌వెజ్.. కస్టమర్ చేసిన పనికి స్విగ్గీకి ఊహించని షాక్

వెజ్‌ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ తిసుకొచ్చిన ఇచ్చిన స్వీగ్వీ యాప్‌, రెస్టారెంట్స్ నిర్వాహకులకు ఊహించిన షాక్ తగిలింది. కార్నూలు జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయగా వాళ్లు డెలివరీ చేసిన బిర్యానీలో మాంసం ముక్కలు కనిపించాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెంచిన కస్టమర్ కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఫోరం స్వీగ్గీతో పాటు సదురు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేయగా వారు స్పందించకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది