24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
వామ్మో.. ఇంత ప్రమాదకర భక్తిని ఎక్కడైనా చూశారా?
Sri Subrahmanya Swamy Rathotsavam: చూసే వారికి ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా మహిళలు, పిల్లలు, సైతం శూలాలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో గుచ్చుకోవడం వలన తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ఇంకెందుకు లేట్ మీరు కూడా చూసేయండి
- J Y Nagi Reddy
- Updated on: Apr 1, 2026
- 8:48 pm
Andhra News: ఆ వెబ్ సిరీస్ చూసి ఎంతకు తెగించావ్ పద్మ.. ప్రియుడితో కలిసి ఏం చేసిందో తెలిస్తే..
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని చూసిన భార్య, తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర చేసింది. భర్తను ఎలా చంపాలోనని ఓ వెబ్ సిరీస్ చూసి పథకం ప్రకారం అతన్ని హత్య చేసి.. మృతదేహాన్ని ఊరి శివారులోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 27, 2026
- 6:40 pm
Watch: అద్భుత దృశ్యం.. రామ భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
అ చిత్రకారుడికి శ్రీ రాముడు అంటే ఎనలేని భక్తి,రాముడి పై తనకు ఉన్న భక్తిని చిత్రం రూపంలో చూపించాలనుకున్నాడు. తన ప్రతిభను, శ్రీ రాముడిపై తనకు ఉన్నభక్తిని చాటుతూ చిన్న అగ్గి పెట్టెపై శ్రీరాముడి జననం నుంచి సీతాదేవి అగ్నిపరీక్ష వరకు జరిగిన ప్రధాన ఘట్టాలన్నింటిని సూక్ష్మ రూపంలో అద్బతంగా వేసి అందిరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకూ ఆ అమిత భక్తులు ఎవరో తెలుసుకుందాం పదండి.
- J Y Nagi Reddy
- Updated on: Mar 27, 2026
- 6:25 pm
శ్రీశైలం డ్యామ్ వద్ద ఘోరం.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను వెంటాడి చంపేశారు..! హంతకులు ఎవరంటే?
శ్రీశైలం డ్యామ్ వద్ద జరిగిన ఈ ఘటన నిజంగా అత్యంత విషాదకరం. విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడం తోటి సిబ్బందిని, ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన ఊపిరితో ఉన్న కానిస్టేబుల్ వీరస్వామిని తోటి సిబ్బంది వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ దాడిలో మరో ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో శ్రీశైలం డ్యామ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంతకీ ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులు ఎవరు..? అసలేం జరిగిందంటే..
- J Y Nagi Reddy
- Updated on: Mar 25, 2026
- 5:16 pm
Andhra: మేరి ఇలా చేస్తదనుకోలేదు.. ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..
ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కడతేడ్చిన ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. భార్య ఆమె ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 25, 2026
- 4:57 pm
పొలం గట్టు వెంబడి వెళ్తుండగా ఒక్కటే దుర్వాసన.. ఏంటని వెళ్లి చూడగా షాక్..!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఒక యువకుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు పట్టణ శివారుల్లోని ఎర్రకోట గ్రామం సమీపంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లు ఎదురుగా ఉన్న పొలంలో యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది.
- J Y Nagi Reddy
- Updated on: Mar 24, 2026
- 11:27 am
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
తొమ్మిది నెలలు జలవాసం.. నాలుగు నెలలు జనవాసం.. ఆ పరమశివుడు నీటి అడుగున చేసే తపస్సు ముగిసింది. కృష్ణా నది జల గర్భం నుంచి ఆ మహా శివాలయం మళ్లీ బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం.. సప్త నదుల సంగమేశ్వరా లయం 9 నెలల నిరీక్షణ తర్వాత భక్తులకు కను విందు చేస్తోంది. ఆ లయకారుని మహిమకు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే సంగమేశ్వర క్షేత్రం.
- J Y Nagi Reddy
- Updated on: Mar 22, 2026
- 3:47 pm
Srisailam : శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. నెల రోజుల్లో రూ. 7.19 కోట్లు!
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఉగాది మహోత్సవాలలో కన్నడ, మహారాష్ట్ర భక్తులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో స్వామివారికి ఏకంగా రూ. 7 కోట్ల 19 లక్షల 58 వేల 064 ఆదాయం వచ్చింది.
- J Y Nagi Reddy
- Updated on: Mar 22, 2026
- 1:34 pm
పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
నంద్యాల జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మార్చి 12వ తేదీన కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- J Y Nagi Reddy
- Updated on: Mar 21, 2026
- 5:42 pm
శ్రీశైలంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు,శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు
- J Y Nagi Reddy
- Updated on: Mar 18, 2026
- 7:49 am
ఎలుగుబంటి బీభత్సం.. కట్టెల కోసం వెళ్లిన చెంచు గిరిజనుడిపై విచక్షణారహిత దాడి..!
నంద్యాల జిల్లాలోని నల్లమల ప్రాంతంలో ఎలుగుబంటి భయంతో చెంచు గిరిజనులను వణికిస్తోంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ చెంచు గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 15, 2026
- 10:56 am
తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
అయ్యో పాపం పసిపిల్లలు.. భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని మరణ శాసనం రాసింది ఓ తల్లి. ఇద్దరు కొడుకులతో కలిసి చెరువులోకి దూకింది తల్లి. నీట మునిగిన ముగ్గురు మృతి చెందారు. చెరువులో విగతజీవులుగా కనిపించిన వారిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- J Y Nagi Reddy
- Updated on: Mar 14, 2026
- 2:23 pm