24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
తీవ్ర విషాదం.. ఒకరు నవ వరుడు, మరొకరు కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి! కన్నీళ్లు పెట్టించే ఘటన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద ఘోర బైక్ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కూతురి పెళ్లి పత్రికలు పంచుతున్న తండ్రి ప్రభుదాస్, మూడు నెలల క్రితమే పెళ్లయిన నవవరుడు రవి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 28, 2026
- 9:59 pm
Kurnool: బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు.. పోలీసులు దర్యాప్తు చేయగా..
కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన ఒక బైక్ చోరీ కేసు విచారణలో పోలీసులు 35 చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దకడబూరు మండలానికి చెందిన మహేష్ను అరెస్టు చేయగా, వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి విక్రయించినట్లు విచారణలో అంగీకరించాడు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 28, 2026
- 9:16 am
Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలింపుకు సంబంధించిన బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోవడంతో ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 28, 2026
- 9:01 am
Video: జనావాసాల్లో రెండు నాగుపాముల సయ్యాట.. ఓర్నాయనో ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. ధైర్యముంటేనే చూడండి..!
Nandyal Cobra Snakes Caught Video: నంద్యాల పట్టణంలోని మూలసాగరం ప్రాంతంలో ఓ ఇంటి సమీపంలో రెండు నాగుపాములు సయ్యాట అడుతూ కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇంటి పక్కనే నాగుపాములు ఇలా సయ్యాటలో లీనమవ్వడం చూసి జనాలు ఆందోళన పడ్డారు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 27, 2026
- 9:04 pm
సీఎం సార్.. ప్లీజ్..చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్!
అక్కడ వందల సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.. చదువుకోవాలనే తపన, పెద్దయ్యాక ఏదో సాధించాలనే కలలు ఉన్నాయి. కానీ, ఆ కలలను నిజం చేసే గురువులే లేరు. అక్షరాలు నేర్పాల్సిన బడి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఇది ఎక్కడో అడవుల్లోనో, మారుమూల లంక గ్రామాల్లోనో జరిగిన కథ కాదు. కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎదుర్కొంటున్న ఘోర దుస్థితి ఇది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 27, 2026
- 8:54 pm
Andhra Pradesh: తోడబుట్టిన వారి మధ్య ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందో తెలుసా..?
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తమ్ముడిపై అన్న విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తమ్ముడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
- J Y Nagi Reddy
- Updated on: Jun 24, 2026
- 8:02 am
అనంతపురం టు హైదరాబాద్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
అనంతపురం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారికి భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.4 కోట్ల విలువైన 2.75 కిలోల బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి మోతీలాల్ అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో వ్యాపారం ముగించుకుని సహాయకుడితో కలిసి మీనా ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. డోన్ సమీపంలోని భారత్ డాబా వద్ద బస్సు ఆగిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారం ఉన్న బ్యాగ్ను అపహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 21, 2026
- 11:41 am
ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
కర్నూలు జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాత్పై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
- J Y Nagi Reddy
- Updated on: Jun 17, 2026
- 3:38 pm
సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
అమెరికాలో ఈ నెల 15న జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో స్కై డైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి, అందులో ఉన్న కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంపునకు చెందిన దాట్ల సాయి కార్తీక్వర్మ (24) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది..
- J Y Nagi Reddy
- Updated on: Jun 17, 2026
- 7:18 am
అనైతిక బంధం ఆయువు తీసింది.. ముగ్గురు బలి, రెండు కుటుంబాల్లో తీరని విషాదం!
కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా మూడు ప్రాణాలు బలైన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను వదిలి ప్రియుడితో వచ్చిన ఓ మహిళ, ఆమె ఐదు నెలల పసికందు, చివరకు ప్రియుడు కూడా మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.
- J Y Nagi Reddy
- Updated on: Jun 13, 2026
- 3:38 pm
Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్ చైన్లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్
బంగారం ధర పెరిగేకొద్దీ రకరకాల మోసాలు పుట్టుకొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బంగారం పేరుతో జరిగిన మోసం చూస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారానికి మెరుగు పెడతామని, కళకళలాడుతుందని చెప్పి మహిళలను మోసగించిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. అసలేం జరిగిందంటే..
- J Y Nagi Reddy
- Updated on: Jun 11, 2026
- 3:05 pm
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
నంద్యాల పాత పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో లిఫ్ట్ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని బేతంచెర్లకు చెందిన శారదగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం లిఫ్ట్లో కిందకు వస్తుండగా సాంకేతిక లోపంతో అది ఒక్కసారిగా కిందకు జారి పడిపోయింది. ఆ తర్వాత..
- J Y Nagi Reddy
- Updated on: Jun 11, 2026
- 2:44 pm