24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
అబ్బో.. పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
శ్రీశైలం రిజర్వాయర్కి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీతోపాటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. గడిచిన వారం, 10రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండిపోయి.. శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ 100 టిఎంసిల మైలురాయిని దాటింది.
- J Y Nagi Reddy
- Updated on: Jul 26, 2024
- 2:38 pm
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!
శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికల్లో కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు.. సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 26, 2024
- 10:13 am
Kargil Vijay Diwas: రావి ఆకుపై అద్భుత చిత్రం.. కార్గిల్ యుద్ధ వీరులకు విద్యార్థని ఘన నివాళి
కార్గిల్ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు.. ఈ సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ 'విజయ్ దివస్'ను నిర్వహించుకుంటున్నాం. పాకిస్థాన్ మూకల్ని కార్గిల్ నుంచి తరిమికొట్టిన ఈ రోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 26, 2024
- 7:51 am
Sangameshwara Temple: సంగమేశ్వరుడిని తాకిన కృష్ణమ్మ.. మళ్లీ దర్శనం కావాలంటే నెలలు ఆగాల్సిందే..!
పాండవులచే ప్రతిష్టించినట్లు ప్రచారం జరుగుతున్న సప్త నదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం అయ్యారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. దీంతో నీటి మట్టం పెరగడంతో సంఘమేశ్వరాలయంలోని వేపదారు శివలింగమును తాకాయి కృష్ణా జలాలు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 24, 2024
- 12:40 pm
Watch Video: వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో ఘరానా మోసం చోటు చేసుకుంది. వెండి ఆభరణాలకు పాలిష్ చేస్తామని మాయ మాటలు చెప్పి అందులోని వెండిని కరిగించి దోచేశారు. వస్తువు చూసేందుకు అలాగే కనిపించినా.. తూకంలో తేడాలు గమనించారు స్థానికులు. ఇలాంటి ఘటనకు పాల్పడిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు గ్రామస్తులు. చాకచక్యంగా చేసిన మోసాన్ని గ్రహించి నిందితుల కాళ్లు, చేతులు కట్టేసి దేహాశుద్ది చేశారు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 21, 2024
- 10:40 pm
ఎర్రబంగారంలా మారిన టమాటా..? కిలో ధర అంత పలుకుతుందా..!
కర్నూలు జిల్లాలో టమోటా రేట్లు భారీగా పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులలో కిలో టమోటా 30 రూపాయలు నుండి 80 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు టమోటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 రూపాయలు ఉన్న కిలో టమోటా రెండు రోజులలో 80 రూపాయలకు పెరిగింది.
- J Y Nagi Reddy
- Updated on: Jul 21, 2024
- 7:38 pm
AP News: పొలంలో రైతుకు మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా..
వజ్రం..!! ఈ పేరెత్తితేనే మనస్సు పరవశిస్తుంది.. ఎప్పటికైనా చిన్న వజ్రాన్నైనా ధరించాలని... మగువలు ఎంతగానో ఆశపడతారు. అలాంటి ఓ విలువైన వజ్రం కర్నూలు జిల్లాలో పొలం పనులు చేస్తున్న ఓ రైతుకు దొరికింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
- J Y Nagi Reddy
- Updated on: Jul 21, 2024
- 3:32 pm
Srisailam: అరగంటసేపు డివైడర్ పైనే తిష్ట.. వణికిపోయిన స్థానికులు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచారం టెన్షన్ రేపింది. శ్రీశైలంలోని పాతాళ గంగ మెట్ల మార్గానికి సమీపంలో సంచరించిన చిరుత రోడ్డు డివైడర్ పైనే అర్ధగంట పాటు తిష్ట వేసింది. చిరుత విజువల్స్ ను భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 18, 2024
- 3:06 pm
Watch Video: ఆమ్మవారి ఆలయంలో ఊహించని ఘటన.. షాకైన ధర్మకర్తలు, భక్తులు..
దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు. కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 14, 2024
- 7:32 am
రతనాల సీమలో రక్తపాతం.. మహిళలే లక్ష్యంగా దారుణాలు.. హత్యకు కారణాలివే..
రాయలసీమ జిల్లాల్లో హింస కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. మొన్న ఆళ్లగడ్డలో శ్రీదేవి దారుణహత్యకు గురైతే.. నేడు ఆదోనిలో గుండమ్మ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ హత్య. అడ్డు వచ్చిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
- J Y Nagi Reddy
- Updated on: Jul 13, 2024
- 10:00 am
Andhra Pradesh: కన్న కొడుకే అమె పాలిట కాలయముడైయ్యాడు.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!
కన్న కొడుకే అమె పాలిట యముడైయ్యాడు. కని పెంచిన కొడుకే మద్యానికి బానిసై కడతేర్చాడు. అదీకూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. ఈ అమానుష ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది.
- J Y Nagi Reddy
- Updated on: Jul 11, 2024
- 8:49 pm
మూడు రోజులైన కనిపించని మైనర్ బాలిక ఆచూకీ.. ఇంతకీ ఏం జరిగింది..?
ముగ్గురు మైనర్ల చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైందని భావిస్తున్నాం బాలిక వాసంతి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. నీటిలో ఫ్లైట్లు వేసుకుని, ఆక్సిజన్ పెట్టుకుని గాలిస్తున్న ఆచూకీ దొరకలేదు. దాదాపు 30 మంది గజ ఈతగాళ్లు నీళ్లలోనే మూడు రోజులుగా గాలిస్తున్న ఎలాంటి ఫలితం కల్పించలేదు.
- J Y Nagi Reddy
- Updated on: Jul 11, 2024
- 7:17 pm