AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.

Read More
Andhra: ఆటో.. అటో.. ఇటో.. నడిరోడ్డుపై విన్యాసాలు.. కట్‌చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?

Andhra: ఆటో.. అటో.. ఇటో.. నడిరోడ్డుపై విన్యాసాలు.. కట్‌చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?

హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44పై కర్నూలు శివారులో ఆటోలతో విన్యాసం చేసిన దృశ్యాలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేశారు.

కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్..

కొత్తరకం కేటుగాళ్లు.. అమ్మాయిలతో చాటింగ్ చేసే వాళ్లే టార్గెట్.. వీళ్లు మామూలోళ్లు కాదండోయ్..

త్రెడ్స్ యాప్‌లో మహిళలతో చాటింగ్ చేసే వారికి ఫోన్లు చేసి.. పోలీసులమంటూ బెదిరించి లక్షలు కొల్లగొడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

Andhra News: సచివాలయం వాష్‌రూమ్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏంటని వెళ్లి చూడగా..

Andhra News: సచివాలయం వాష్‌రూమ్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏంటని వెళ్లి చూడగా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో ఉద్యోగి మధుశేఖర్ గొంతు కోసుకొని అత్మహత్యయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉద్యోగి మదుశేఖర్ ను సహచర ఉద్యోగులు చికిత్స కొరకు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: యముడికే మస్కా కొట్టాడు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కూలిన స్థంభం.. అంతలోనే

Viral Video: యముడికే మస్కా కొట్టాడు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కూలిన స్థంభం.. అంతలోనే

చావుని చూసొచ్చాడు. గండాన్ని తప్పించుకున్నాడు. చచ్చి బతికాడు.. ఇలా కొన్ని సందర్భాల్లో ఏవో మాటలు వింటూ ఉంటాం. కానీ అలాంటి ఘటనే ఇప్పుడు కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. క్షణంలో వందోవంతు ఆలస్యమై ఉన్నా ఇక్కడ ఓ కుర్రాడు మాడి మసైపోయేవాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. వెంట్రుకవాసిలో మరణాన్ని తప్పించుకున్నాడు. అందుకే ఇతను మృత్యుంజయుడయ్యారు.

తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!

తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. గన్ మిస్‌ ఫైర్‌తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి..!

మీ చేతిలో తుపాకీ ఉందా. అయితే జాగ్రత్త.. ఏ క్షణమైనా మిస్ ఫైర్ అవచ్చు..! అంతేకాదు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి సంఘటన ఎక్కడ ఎందుకు జరిగిందంటే ఈ వార్త చదవాల్సిందే..! నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో చేతిలో ఉన్న తుపాకీ మెస్ ఫైర్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడకు వెళుతున్న రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు..  స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!

గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!

నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అటవీ జంతువులను చంపి వాటి మాంసం, కొమ్ములు, గోర్లు, దంతాలు, చర్మం వంటివి సరఫరా చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి పులులు బయటకొస్తున్న నేపధ్యంలో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ క్రమంలోనే విక్రయించడానికి సిద్దంగా ఉన్న పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

Watch Video: వరుస ప్రమాదాలు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! ఆ తర్వాత..

Watch Video: వరుస ప్రమాదాలు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! ఆ తర్వాత..

కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నంద్యాల సిరివెళ్ల దగ్గర వీఆర్బిసివిఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ ని దాటి పక్క రోడ్డులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొనడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం ముగ్గురు మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది..

Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీల్లో లెక్కలు లేని 30 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ క్షేత్రంలోకి భారీ మొత్తంలో నగదు రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. నగదుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!

ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్‌ ఇదే!

డాక్టర్ పై కన్నేసిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. అప్పటికే వివాహమైన డాక్టర్ ను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన సదరు మహిళ అతడి భార్యను అడ్డు తొలగించాలని పథకం వేసింది. ఇందులో భాగంగా ఓ యాక్సిడెంట్ డ్రామా ఆడి HIV ఇంజక్షన్ వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

8వ తరగతి బాలుడి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. రావి ఆకుపై సుభాష్ చంద్రబోస్ చిత్రం

8వ తరగతి బాలుడి టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. రావి ఆకుపై సుభాష్ చంద్రబోస్ చిత్రం

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 న ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి తన ప్రతిభతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు.

Andhra: RDO వాహనాన్ని వేలం వేసి.. వచ్చిన డబ్బు ఆమెకు ఇవ్వాలని కర్నూలు కోర్టు సంచలన తీర్పు

Andhra: RDO వాహనాన్ని వేలం వేసి.. వచ్చిన డబ్బు ఆమెకు ఇవ్వాలని కర్నూలు కోర్టు సంచలన తీర్పు

36 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూసిన బాధితురాలికి న్యాయం దక్కింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి కర్నూలు కోర్టు గట్టి చెక్ పెట్టింది. పరిహారం చెల్లించని కారణంగా ఆర్డీవో వాహనాన్ని వేలం వేయాలని ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువడింది. అధికార యంత్రాంగం స్పందిస్తుందా? లేక వాహనం వేలమే తుది పరిణామమా?

Andhra: మిర్చినే కాదు.. వేరుశనగ రైతులకు పండగొచ్చింది.. హిస్టరీ క్రియేట్ చేసిన ధర

Andhra: మిర్చినే కాదు.. వేరుశనగ రైతులకు పండగొచ్చింది.. హిస్టరీ క్రియేట్ చేసిన ధర

రాయలసీమలో ముఖ్యమైన మార్కెట్ అయిన ఆదోనిలో వేరు శనగకు రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ఇప్పటికీ వేరుశనగ పంట రాయలసీమలో ప్రధాన పంటగా కొనసాగుతోంది, కాగా గత కొన్నేళ్లుగా రైతులు ధర లేక నష్టపోతున్నారు. అయితే, ఈ ఏడాది ధరలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.