AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నర వ్యవధిలోనే దర్శనం.. ఎప్పటి నుంచంటే..

సామాన్య భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లుగా ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నర వ్యవధిలోనే దర్శనం.. ఎప్పటి నుంచంటే..
Tirumala
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2022 | 4:21 PM

Share

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్‌న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లుగా ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 దర్శనంతో పాటు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తిరుపతిలోని శ్రీభూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో టైమ్‌స్లాట్‌ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని గుర్తు చేశారు.

శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించామన్నారు. అలాగే, దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించామని అన్నారు. గత రెండున్నరేళ్లలో తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుమలలో 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదని, కరోనా సమయంలో 4,500 గదులకు మరమ్మతులు చేసినట్టు వివరించారు. సెప్టెంబరు నాటికి మిగతా గదులకు కూడా మరమ్మతు పూర్తిచేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

రెండున్నరేళ్లలో రూ.1500 కోట్ల విరాళాలు తీసుకురాగలిగామని.. హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేసేందుకు అవకాశం కలిగినట్లు చెప్పారు. మొత్తానికి సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే చెప్పాలి.

స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు