Navaratri 2024: దేవీ నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులు తీసివేయండి.. అమ్మవారి ఆశీర్వాదం మీ సొంతం

నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం.. ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకనే శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

Navaratri 2024: దేవీ నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులు తీసివేయండి.. అమ్మవారి ఆశీర్వాదం మీ సొంతం
Dasara Durga Puja
Follow us

|

Updated on: Sep 24, 2024 | 2:40 PM

దేవీ శరన్నవరాత్రులు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గా దేవి తొమ్మిది విభిన్న రూపాలను ఆరాధిస్తూ జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గా దేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. భక్తులందరూ అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాలను ప్రతిరోజూ వేర్వేరు రూపంలో పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా నవరాత్రి పండుగను పరిగణిస్తారు. రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి దుర్గాదేవి చెడును అంతం చేసింది. ఈ సమయంలో ప్రజలు తమ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావాలని కోరుకుంటారు.

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజమాసములోని శుక్ల పక్ష ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీ ఉదయం 12.18 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇది అక్టోబర్ 04 తెల్లవారుజామున 02:58 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి.

నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం.. ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకనే శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో విరిగిన విగ్రహాలు, చిరిగిన బట్టలు, విరిగిన గడియారాలు, విరిగిన పాత్రలు మొదలైనవి ప్రతికూల శక్తికి చిహ్నాలుగా భావిస్తారు. వారిని ఇంటి నుండి బయటకు విసిరేయడం సరైనదని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇంటి నుండి ఈ వస్తువులను తొలగించండి

  1. పాత వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు: పాత వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఇంట్లో నుంచి తీసివేయండి.
  2. ఎండిన పువ్వులు: ఎండిన పువ్వులను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. వీటిని కూడా ఇంటి నుంచి బయటకు తీయాలి.
  3. వ్యర్థపదార్థాలు: ఇంట్లో చెత్తాచెదారం పెరుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కనుక ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
  4. పాత బూట్లు, చెప్పులు: పాత, చిరిగిన బూట్లు, చెప్పులు ఇంటి వెలుపల ఉంచాలి.
  5. విరిగిన చీపురు: చీపురు ఇంటి శుభ్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. విరిగిన చీపురు ఇంట్లో పెట్టుకోకూడదు.
  6. అనవసరమైన వస్తువులు: మీరు చాలా కాలంగా ఉపయోగించని వస్తువులను దానం చేయండి లేదా ఇంటి నుంచి బయటకు విసిరేయండి.
  7. ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. దీంతో విష్ణువుకి కోపం వస్తుంది. నవరాత్రికి ముందు ఇంట్లో ఎండిన మొక్క ఉంటే ఆ తులసి మొక్కను తొలగించండి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

ఇంట్లో ఉపయోగించని వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇది ఇంట్లో ఇబ్బందులు, సమస్యలను తెస్తుంది. వీటిని తొలగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కొన్ని నమ్మకాల ప్రకారం విరిగిన విగ్రహాలు, చిరిగిన ఛాయాచిత్రాలను ఉంచడం దేవుళ్ళను, దేవతలను అవమానించినట్లుగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శుభ్రపరచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుందని.. దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి