AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..

ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయాభావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..
Tirumala Temple
Surya Kala
|

Updated on: Apr 07, 2023 | 1:14 PM

Share

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిజపాదాలను భక్తులు శుక్రవారం దర్శించుకునేవారు. గత కొంతకాలం క్రితం వరకూ భక్తులకు భగవంతుడు గోవింద విగ్రహం యొక్క పవిత్ర పాదాలను చూసే అవకాశం ఉండేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని తెలిపారు.

అంతేకాదు ఆలయంలో సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఈ మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. స్వామివారి అన్న ప్రసాద వితరణలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామని తెలిపారు.

మార్చి నెలలో భక్తులు

ఇవి కూడా చదవండి

మార్చి నెలలో శ్రీవారిని  20లక్షల 57 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8.25 లక్షల భక్తులు తలనీలాల సమర్పించారు. అంతేకాదు మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. భక్తుల కానుకల ద్వారా హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డులు 1.02 కోట్లను విక్రయించినట్లు తెలిపారు.

నిజపాద దర్శనం: 

తిరుమలలో భక్తులకు వారానికో ప్రత్యేక దర్శనం నిజపాద దర్శనం. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూరా అభిషేకం సేవ నిర్వహిస్తారు. ఈ సేవ చేసే సమయంలో స్వామివారి విగ్రహానికి అలంకరించిన ఆభరణాలు, అలంకరణలు తొలగిస్తారు. ఈ సేవ  అనంతరం.. గోవింద పవిత్ర పాదాలను ఎటువంటి అలంకరణ లేకుండా చూసే అవకాశం భక్తులకు ఇస్తారు. దీనినే నిజపాద దర్శనం అంటారు. లోపలి ఆలయంలో 1వ ద్వారం నుండి బంగారు కవచాలు లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి పాదాలను దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?