AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..

ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయాభావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..
Tirumala Temple
Surya Kala
|

Updated on: Apr 07, 2023 | 1:14 PM

Share

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిజపాదాలను భక్తులు శుక్రవారం దర్శించుకునేవారు. గత కొంతకాలం క్రితం వరకూ భక్తులకు భగవంతుడు గోవింద విగ్రహం యొక్క పవిత్ర పాదాలను చూసే అవకాశం ఉండేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని తెలిపారు.

అంతేకాదు ఆలయంలో సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఈ మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. స్వామివారి అన్న ప్రసాద వితరణలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామని తెలిపారు.

మార్చి నెలలో భక్తులు

ఇవి కూడా చదవండి

మార్చి నెలలో శ్రీవారిని  20లక్షల 57 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8.25 లక్షల భక్తులు తలనీలాల సమర్పించారు. అంతేకాదు మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. భక్తుల కానుకల ద్వారా హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డులు 1.02 కోట్లను విక్రయించినట్లు తెలిపారు.

నిజపాద దర్శనం: 

తిరుమలలో భక్తులకు వారానికో ప్రత్యేక దర్శనం నిజపాద దర్శనం. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూరా అభిషేకం సేవ నిర్వహిస్తారు. ఈ సేవ చేసే సమయంలో స్వామివారి విగ్రహానికి అలంకరించిన ఆభరణాలు, అలంకరణలు తొలగిస్తారు. ఈ సేవ  అనంతరం.. గోవింద పవిత్ర పాదాలను ఎటువంటి అలంకరణ లేకుండా చూసే అవకాశం భక్తులకు ఇస్తారు. దీనినే నిజపాద దర్శనం అంటారు. లోపలి ఆలయంలో 1వ ద్వారం నుండి బంగారు కవచాలు లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి పాదాలను దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే
రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే