AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Pushkaralu: ఈ నెలలో గంగ పుష్కరాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో పుష్కరాలు జరగనున్నాయంటే..

నదులకు పన్నెండేళ్లకో సారి వచ్చే పెద్దపండగ పుష్కరాలకు గంగానది ముస్తాబవుతోంది. పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభను సంతరించుకుంటున్నాయి.

Ganga Pushkaralu: ఈ నెలలో గంగ పుష్కరాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో పుష్కరాలు జరగనున్నాయంటే..
Ganga Pushkaralu
Surya Kala
|

Updated on: Apr 07, 2023 | 11:20 AM

Share

హిందూ సనాతన ధర్మంలో నదులకు విశిష్ట స్థానం ఉంది. నదులను పవిత్రంగా భావించి పూజిస్తారు. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగానదిని, గంగమ్మ తల్లి,  పావన గంగ, గంగా భవాని అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. అలాంటి పవిత్ర గంగా నది పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. పుష్కరం అంటే 12 ఏళ్లు అని అర్ధం. గంగా పుష్కరాలు బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినపుడు ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. బృహస్పతి మళ్ళీ మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మే 3 తేదీన ముగియనున్నాయి. గంగా పుష్కరాలు అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ సంగం ప్రయాగ నగరాల్లో జరగనున్నాయి.

గంగానది పుష్కర వైభవం

నదులకు పన్నెండేళ్లకో సారి వచ్చే పెద్దపండగ పుష్కరాలకు గంగానది ముస్తాబవుతోంది. పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభను సంతరించుకుంటున్నాయి. పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పవిత్ర క్షేత్రాలు  కళకళలాడతాయి.

ఇవి కూడా చదవండి

బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యలో 12ఏళ్ల తర్వాత పవిత్ర గంగమ్మ పుష్కరాల వేడుకను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో రోజు దాదాపు 25 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానమాచరిస్తాయని అంచనావేస్తున్నారు.  ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు