AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatu Shyam Idol: నెలలో రెండు సార్లు రంగులు మార్చే ఖతు శ్యామ్.. కృష్ణ పక్షంలో పసుపు, శుక్ల పక్షంలో నలుపు రంగులో దర్శనం..

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఖాతు శ్యామ్ జీ.. బార్బరికుని అవతారంగా భావించే ఒక హిందూ దేవుడు. బాబా శ్యామ్‌ను చూడటం ద్వారా భక్తుల దుఃఖాలు తొలగిపోతాయని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఖాతు శ్యామ్ జీ విగ్రహం రంగు కొన్నిసార్లు పసుపు రంగులో, కొన్నిసార్లు నల్లగా కనిపిస్తుందని భక్తులు చెబుతారు. ఈ విషయం భక్తులలో ఎల్లప్పుడూ ఉత్సుకత కలిగించే విషయం. ఈ రోజు ఖాతు శ్యామ్ జీ విగ్రహం రంగులు మార్పు వెనుక గల రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

Khatu Shyam Idol: నెలలో రెండు సార్లు రంగులు మార్చే ఖతు శ్యామ్.. కృష్ణ పక్షంలో పసుపు, శుక్ల పక్షంలో నలుపు రంగులో దర్శనం..
Khatu Shyam Idol
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 7:24 AM

Share

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న ఖతు శ్యామ్ ఆలయం కోట్లాది మంది భక్తుల విశ్వాస కేంద్రంగా ఉంది. ఇక్కడ సింహాసనంపై ఉన్న ఖతు శ్యామ్ మనోహరమైన విగ్రహం భక్తులకు ఒక అద్భుతం. ఈ విగ్రహానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన రహస్యం ఉంది. దీనిని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. అది బాబా శ్యామ్ విగ్రహం రంగులో మార్పు. అవును ఖాతు శ్యామ్ విగ్రహం కృష్ణ పక్షంలో పసుపు రంగులోకి, శుక్ల పక్షంలో నల్లగా మారుతుంది. ఈ మార్పు ఎలా జరుగుతుంది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ రోజు వివరంగా తెలుసుకుందాం..

రంగులో మార్పు వెనుక కారణం, అలంకరణ, అభిషేకం ప్రత్యేకమైన సంగమం ఖతు శ్యామ్ విగ్రహం రంగు మారడానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యేక శృంగార (అలంకరణ), అభిషేకం (స్నానం) ప్రక్రియ. ఇది సహజమైన లేదా అతీంద్రియ సంఘటన కాదు. అయితే ఆలయ సంప్రదాయం, ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక భాగం.

కృష్ణ పక్షంలో పసుపు రంగు కృష్ణ పక్షం వచ్చినప్పుడు బాబా శ్యామ్ విగ్రహాన్ని పసుపు వర్ణం (ముదురు రంగు) గా అలంకరిస్తారు. ఈ సమయంలో విగ్రహానికి పసుపు రంగు దుస్తులను అతని అలంకరణలో ఉపయోగిస్తారు. ఈ పసుపు రంగు తరచుగా లేత లేదా బంగారు రంగుతో కూడి ఉంటుంది. ఇది బాబా నలుపు రూపాన్ని మరింత దైవికంగా చేస్తుంది. అంటే ఈ సముయంలో ఖతు శ్యామ్.. కృష్ణుడిలా కనిపించే రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు.

ఇవి కూడా చదవండి

శుక్ల పక్షంలో నలుపు రంగు శుక్ల పక్షం వచ్చినప్పుడు బాబా శ్యామ్ తన పూర్తి శాలిగ్రామ (నలుపు) రూపంలో అలంకరించబడతాడు. శాలిగ్రామ అనేది విష్ణువు పవిత్ర రూపం. ఇది సాధారణంగా నలుపు లేదా ముదురు రంగులో ఉంటుంది. ఈ సమయంలో విగ్రహాన్ని కూడా ప్రత్యేక పద్ధతిలో అభిషేకిస్తారు. ఇది ముదురు నల్లగా కనిపిస్తుంది. ఈ నలుపు రంగు అతని దైవత్వం, శాశ్వతత్వం, సకల లోకాలకు ప్రభువుగా ఉండటాన్ని సూచిస్తుంది.

ఈ రంగు మార్పు భక్తులకు ఒక రహస్యం. అయితే ఇది శతాబ్దాల నాటి ఆలయ సంప్రదాయంలో ఒక భాగం. ఇక్కడ బాబాను అతని వివిధ లక్షణాలను, దైవిక చర్యలను వర్ణించే వివిధ రూపాల్లో అలంకరిస్తారు.

మతపరమైన ప్రాముఖ్యత, నమ్మకాలు ఖతు శ్యామ్ ని కలియుగ అవతారంగా పూజిస్తారు. మహాభారత కాలంలో ఘటోత్కచుని కుమారుడు, భీముని మనవడు బార్బరికుడు తన తలను శ్రీకృష్ణుడికి దానం చేశాడని నమ్ముతారు. కలియుగంలో ఆయన పేరు మీద పూజలు అందుకుంటాడని శ్రీ కృష్ణుడు ఆశీర్వాదంతో ఇప్పుడు ఖతు శ్యామ్ గా వెలిశాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్