Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysuru: ధగ ధగ మెరిసిపోతున్న మైసూరు ప్యాలెస్.. దసరా ఉత్సవాల్లో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..

చెడు పై మంచి సాధించిన విజయానికి వేడుకే విజయదశమి. మహిషాసురుడిని సంహరించిన జగన్మాత.. సకల లోకాలకు అభయం అందించింది. ఇందుకు గుర్తుగా దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి..

Mysuru: ధగ ధగ మెరిసిపోతున్న మైసూరు ప్యాలెస్.. దసరా ఉత్సవాల్లో ఒక్కసారైనా సందర్శించాల్సిందే..
Mysuru Celebrations
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 02, 2022 | 9:39 AM

చెడు పై మంచి సాధించిన విజయానికి వేడుకే విజయదశమి. మహిషాసురుడిని సంహరించిన జగన్మాత.. సకల లోకాలకు అభయం అందించింది. ఇందుకు గుర్తుగా దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ఒక్కోక్క ప్రాంతంలో వేడుకలు ఒక్కో రకంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలకు మైసూరు చాలా ఫేమస్. శక్తిపీఠమైన చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి జరిగే ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రత్యేక పూజలు, పాటలు, భజనలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు శోభాయమానంగా జరుగుతాయి. మైసూర్ అనే పేరు మహిసుర నుంచి వచ్చింది. చాముండేశ్వరి దేవీ మహిషాసురుడిని చంపిన ప్రాంతం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అయితే మైసూర్ ఆధ్యాత్మికతకే కాకుండా.. చక్కటి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడ లభించే పట్టు వస్త్రాలు, ధూపం, గంధపు చెక్క ఉత్పత్తులు, ప్యాలెస్‌ వరల్డ్ ఫేమస్. ఇందులో ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్ గురించి చెప్పుకోవాలి. విలాసవంతమైన గదులతో, ఇండో-సార్సెనిక్ కాంప్లెక్స్ మైసూర్ రాష్ట్రానికి చెందిన మహారాజులు – వడయార్లు నిర్మించారు. వారి కుల దేవత చాముండేశ్వరి. నవరాత్రి వేడుకల్లో వారు దేవీ ఆరాధన చేస్తూ అమ్మవారి కృపకటాక్షాలు పొందారు.

చాముండి కొండపై ఉన్న ఆలయాన్ని సందర్శించడంతో మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల సందర్భంగా అక్కడ జరిగే ఫుడ్, క్రాఫ్ట్ ఫెయిర్‌, డ్యాన్స్, రెజ్లింగ్ భక్తులను కట్టిపడేస్తుంటాయ. రాత్రి సమయంలో ప్యాలెస్ ముందు జరిగే సంగీత కార్యక్రమాలు ఉత్సవాలకే హైలైట్ గా చెప్పవచ్చు. నవరాత్రుల పదో రోజైన విజయదశమి నాడు మిరుమిట్లు గొలిపే ఊరేగింపులో మహారాజుల కాలంనాటి వైభవం,చాముండేశ్వరి దేవత చిత్రం బంగారు పల్లకిలో ఒక కపారిసన్డ్ ఏనుగుపై ఊరేగింపు చేస్తారు. ఒంటెలు, అశ్వాలు, నృత్యకారుల ప్రదర్శనలతో బరాత్ ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది.

సెప్టెంబర్ చివరలో – అక్టోబర్ ప్రారంభంలో మైసూర్ ను సందర్శించేందుకు అనువైన సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉండే కైలాస కోరా పర్వతం చాలా పవిత్రమైనది. కొండపైసుమారు వెయ్యి మెట్లు ఎక్కిన తర్వాత చాముండి ఆలయం వస్తుంది. ఆలయం వెలుపల ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో పొడవాటి పాముతో ఉన్న రాక్షసుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో చాముండీ మాత తన చల్లని చూపులతో భక్తజనులను ఆదుకుంటూ.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నీరాజనాలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..