AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: భక్త సంద్రంగా మారిన తిరుమల.. దర్శనానికి రెండు రోజులు.. భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి..

 తిరుమలకు భక్తజనం పోటెత్తారు. దర్శనానికి రెండ్రోజులు పడుతుండడంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని...యాత్రను ప్లాన్‌ చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.

Tirumala: భక్త సంద్రంగా మారిన తిరుమల.. దర్శనానికి రెండు రోజులు.. భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి..
Tirumala Temple
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 9:53 AM

Share

తిరుమల శ్రీవారి దర్శనానిక భక్తకోటి బారులు తీరుతోంది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు పోటెత్తారు భక్తులు. సహజంగానే రద్దీ ఉండే సమయం. అందులోనూ…ఉద్యోగులకు వరుస సెలవులు లభించడంతో తిరుమల భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు…తమ మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర తీరాల నుంచి జనం తిరుమలకు తరలివస్తున్నారు. భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలుచుని దైవ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. ఇక గోగర్భం డ్యామ్ వరకు చేరుకుంది సర్వ దర్శన క్యూలైన్.

నాలుగు రోజులు సెలవుదినాలు కావడంతో తిరుమలకు విశేషంగా తరలి వస్తున్నారు భక్తులు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వరస సెలవులు రావడం.. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ప్రజలు భారీగా తిరుమల బాటపట్టారు. దీంతో తిరుమల గిరులు భక్త సంద్రంగా మారింది.

సర్వ దర్శనం క్యూలైన్ లో ఉన్న టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ అధికారులు పదే పదే విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..