AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..

మహారాష్ట్ర తీరప్రాంతం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. పాల్ఘర్ జిల్లా దుర్వేస్ గ్రామంలో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అద్భుతమైన వేద మంత్రోచ్ఛారణలు, సాధువుల దివ్య సాన్నిధ్యం నడుమ BAPS స్వామినారాయణ మందిర మూర్తి ప్రతిష్ఠా మహోత్సవం అంబరాన్నంటింది. యువతకు సన్మార్గాన్ని, సమాజానికి శాంతిని బోధించే ఈ సరికొత్త ఆధ్యాత్మిక కేంద్రం గురించి తెలుసుకుందాం..

పాల్ఘర్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా BAPS స్వామినారాయణ మందిర ప్రతిష్ఠా మహోత్సవం..
Baps Swaminarayan Mandir Palghar
Krishna S
|

Updated on: Apr 24, 2026 | 7:10 PM

Share

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దుర్వేస్ గ్రామం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. BAPS స్వామినారాయణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన మందిర మూర్తి ప్రతిష్ఠా మహోత్సవం అపారమైన వైభవంతో భక్తుల జయజయధ్వానాల నడుమ దిగ్విజయంగా ముగిసింది. కేవలం ఒక ఆలయ ప్రారంభోత్సవంగానే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికి ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని అందించిన అద్భుత వేడుకగా ఇది నిలిచింది. ఉదయకాలపు పవిత్ర వాతావరణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, దివ్యమైన యజ్ఞయాగాదులతో మూర్తి ప్రతిష్ఠా పవిత్ర క్రతువులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధువుల దివ్య సాన్నిధ్యం భక్తులలో అచంచలమైన విశ్వాసాన్ని నింపింది. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తమ జీవితాంతం గుర్తుంచుకునే ఒక దివ్య అనుభూతిని పొందినట్లు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

విలువల కేంద్రంగా నిలవనున్న ఆలయం

ప్రపంచవ్యాప్తంగా సామాజిక, మానవీయ సేవలకు ప్రసిద్ధి చెందిన BAPS సంస్థ, మహారాష్ట్ర గడ్డపై ఈ కేంద్రాన్ని ఒక విశిష్టమైన లక్ష్యంతో నిర్మించింది. ఈ ఆలయం కేవలం ప్రార్థనా మందిరం మాత్రమే కాదు.. ఇది వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలకు, నిస్వార్థ సేవకు ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలవనుంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన సద్జీవన మార్గంలో పయనించాలని, సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సాధువులు పిలుపునిచ్చారు.

సేవా కార్యక్రమాలతో పరివర్తన

మందిర ప్రారంభోత్సవం సందర్భంగా BAPS సంస్థ నిర్వహిస్తున్న వివిధ విద్యా, ఆరోగ్య, మానవతా సేవా కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేకూర్చేలా ఈ సంస్థ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

సాంస్కృతిక వారసత్వం బలోపేతం

పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో పూజ్య భక్తి ప్రియ స్వామి, ఇతర సాధువుల పర్యవేక్షణలో నిర్మించబడిన ఈ అద్భుత మందిరం, మహారాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us