AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్రీనాథ్, కేదార్ ధామ్‌లు అదృశ్యమవుతాయా? 5 వేల ఏళ్ల క్రితమే అంచనా.. నరసింహ దేవ విగ్రహమే సజీవ సాక్ష్యమా..!

స్కాంద పురాణం ప్రకారం ఇది జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. జోషిమఠ్‌లో ఉన్న నరసింహ దేవుడు చేతులు విగ్రహం నుండి వేరు చేయబడతాయని ఇందులో మొదటి సూచన. ఈ సూచన సరైనదని భావిస్తే కలియుగం ఐదున్నర వేల సంవత్సరాల కాలం పూర్తయింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా నరసింహ స్వామి చేతుల వేళ్లు సన్నబడటం ప్రారంభించాయి. ఈ వేళ్ల ముందు భాగం సూది మొనలా మారింది. నరసింహ ఆలయ పూజారి సంజయ్ డిమ్రి ఈ విగ్రహం గురించి మాట్లాడుతూ నరసింహ స్వామి చేయి వేరు అయిన తర్వాత బద్రీనాథుడు ఇక్కడి నుండి వెళ్లిపోతాడని చెప్పారు.

బద్రీనాథ్, కేదార్ ధామ్‌లు అదృశ్యమవుతాయా? 5 వేల ఏళ్ల క్రితమే అంచనా.. నరసింహ దేవ విగ్రహమే సజీవ సాక్ష్యమా..!
Badrinath Kedarnath
Surya Kala
|

Updated on: Jul 11, 2024 | 8:50 AM

Share

హిందువుల పవిత్ర యాత్ర చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్ లు ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. శివ కేశవుల నివాసాలు కనుమరుగవుతున్నాయా? పవిత్ర గంగా నది కూడా శివ కేశవుల ద్వారా బ్రహ్మ కమండలానికి తిరిగి వెళ్తుందా.. అనే సందేహాలు పలువురు మదిలో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని ఐదున్నర వేల సంవత్సరాల క్రితం రచించిన స్కాంద పురాణంలో వేదవ్యాసు భగవానుడు చెప్పాడు. ఇందుకు సంబంధించి కొన్ని భవిష్యత్ సూచనలు కూడా ఇచ్చాడు. భూమిపై పాపం పెరిగి ప్రజలు ఒకరినొకరు విశ్వసించడం తగ్గినప్పుడు, ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లో ఉన్న నర, నారాయణ పర్వతాలు కలిసిపోతాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. దీని కారణంగా బద్రీనాథ్, కేదార్ నాథ్ ధామ్ మార్గం మూతబడుతుంది.

స్కాంద పురాణంలోని శ్లోకం “బహుని శాంతి తీర్థాని దివ్య భూమి రసాతలే | బద్రి సదస్య తీర్ధః న భూతో న భవిష్యతిః (बहुनि सन्ति तीर्थानी दिव्य भूमि रसातले।बद्री सदृश्य तीर्थं न भूतो न भविष्यतिः)  అంటే బద్రీనాథ్ లాంటి పవిత్ర స్థలం మరెక్కడా లేదని చెబుతారు. ఈ గ్రంథం ప్రకారం కలియుగ మొదటి దశలో ఈ పుణ్య తీర్ధం అంతరించిపోయే సమయం వస్తుంది. ఇది దాదాపు ఐదున్నర వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పురాణం ప్రకారం ఇది జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. జోషిమఠ్‌లో ఉన్న నరసింహ దేవుడు చేతులు విగ్రహం నుండి వేరు చేయబడతాయని ఇందులో మొదటి సూచన.

ఈ సూచన సరైనదని భావిస్తే కలియుగం ఐదున్నర వేల సంవత్సరాల కాలం పూర్తయింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా నరసింహ స్వామి చేతుల వేళ్లు సన్నబడటం ప్రారంభించాయి. ఈ వేళ్ల ముందు భాగం సూది మొనలా మారింది. నరసింహ ఆలయ పూజారి సంజయ్ డిమ్రి ఈ విగ్రహం గురించి మాట్లాడుతూ నరసింహ స్వామి చేయి వేరు అయిన తర్వాత బద్రీనాథుడు ఇక్కడి నుండి వెళ్లిపోతాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో విపత్తుల కాలం

గత కొన్నేళ్లుగా నర నారాయణ పర్వతాల మధ్య దూరం కూడా తగ్గిందని అనేక పరిశోధనలలో తెలిసిందని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఉత్తరాఖండ్‌లో అనేక విపత్తులు జరుగుతున్నాయి. గత ఏడాదిలో జోషి మఠంలో నేల కూలడం ప్రారంభమైంది. ఈ భూమి క్షీణించడం వల్ల నరసింహ దేవుడి గుడి గోడలోనే పగుళ్లు వచ్చాయి. అంతకుముందు మేఘాలు విస్ఫోటనం కారణంగా, కేదార్‌నాథ్‌కు తీవ్రమైన వరదలు సంభవించాయి. భారీ విధ్వంసం జరిగింది. కేదార్ లోయలో హిమానీనదం పగిలిపోవడం, ప్రతిరోజూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం విధ్వంసానికి సంకేతమని చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో పేర్కొన్నారు. స్కంద పురాణం, విష్ణు పురాణాలలో కేదార్‌నాథ్ ధామ్ శివుడి విశ్రాంతి స్థలంగా వర్ణించబడింది. ఈ ప్రదేశంలో శివుడు విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. బద్రీనాథ్ ధామ్ ఎనిమిది వైకుంఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పుణ్యక్షేత్రంలో నారాయణుడు ఆరు నెలలు నిద్రిస్తాడని.. మిగిలిన ఆరు నెలలు మేల్కొని విశ్వాన్ని పరిపాలిస్తాడని చెబుతారు.

సత్యయుగంలో ప్రత్యక్ష దర్శనం ఇచ్చే భగవంతుడు

స్కంద పురాణం ప్రకారం సత్యయుగంలో భగవంతుడు నారాయణుడు సకల దేవతలు, ఋషులతో పాటు ఈ ప్రదేశంలో సాధారణ ప్రజలకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చేవారు. అయితే త్రేతాయుగంలో నారాయణుడు సామాన్యులకు దర్శనం ఇవ్వడం మానేశాడు. ఆ సమయంలో దేవతలు, ఋషులు మాత్రమే భగవంతుని కలుసుకోగలరు. క్రమంగా ద్వాపర యుగం వచ్చినప్పుడు దేవుడు అదృశ్యమై సింహాసనంపై దేవతను కొలిచే సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు బద్రీనాథ్‌లోని దేవుని విగ్రహ దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. స్కంద పురాణం ప్రకారం కలియుగంలో విగ్రహం మాత్రమే కాదు ఇక్కడికి వెళ్లే మార్గం కూడా అదృశ్యమయ్యే సమయం వస్తుంది.

నర్సింహ దేవ చేతి వేళ్లు సన్నబడటం ప్రారంభం

ఇప్పటికే ఈ విషయంపై జోషి మఠం నుండి అతిపెద్ద సిగ్నల్ వస్తోంది. ప్రతి సంవత్సరం జోషిమఠం, బద్రీనాథులను సందర్శించే భక్తుల ప్రకారం ఇక్కడ ఉన్న నరసింహ దేవుడి విగ్రహం వేళ్లు సన్నబడటం ప్రారంభించాయి. ఈ వేళ్ల ముందు భాగం సూది మొనలా సన్నగా మారాయి. నరసింహ దేవుడి చేతులు ఎప్పుడైనా విడిపోవచ్చని చెబుతున్నారు. పురాణాల నమ్మకం ప్రకారం ఇది జరిగిన వెంటనే నర నారాయణ పర్వతాలు ఒక్కటి అవుతాయి. ఇప్పటికే ఈ రెండు పర్వతాల మధ్య దూరం తగ్గింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us