AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌కు ఈసీ నోటీసులు

గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘంనోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్‌ స్పదించాలని, లేని పక్షంలో ఆయనను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఏప్రిల్‌ 23, 2019వ తేదీన మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సందర్భంగా మోడీ, బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. […]

రాహుల్‌కు ఈసీ నోటీసులు
Ram Naramaneni
|

Updated on: May 02, 2019 | 2:21 PM

Share

గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘంనోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్‌ స్పదించాలని, లేని పక్షంలో ఆయనను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఏప్రిల్‌ 23, 2019వ తేదీన మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సందర్భంగా మోడీ, బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. ‘గిరిజనులు, ఆదివాసీల కోసం మోడీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌ ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తీసుకున్న ఈసీ.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.