ఈ దేశపు తొలి ఉగ్రవాది హిందూ: కమల్ హాసన్

స్వంతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూయే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్. అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మళ్లీ ఇలా తేనెతుట్టను లేపారు.  దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత.. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే మొట్టమొదటి భారత ఉగ్రవాది అని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ నియోజకవర్గంలోని ముస్లింలను దృష్టిలో ఉంచుకొని తాను ఈ మాట అనడం లేదని.. […]

ఈ దేశపు తొలి ఉగ్రవాది హిందూ: కమల్ హాసన్
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 12:59 PM

స్వంతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూయే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్. అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మళ్లీ ఇలా తేనెతుట్టను లేపారు.  దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత.. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే మొట్టమొదటి భారత ఉగ్రవాది అని సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ నియోజకవర్గంలోని ముస్లింలను దృష్టిలో ఉంచుకొని తాను ఈ మాట అనడం లేదని.. గాంధీ విగ్రహం సాక్షిగా ఇలా అంటున్నానని అన్నాడు. ఈ నియోజకవర్గంలో కమల్ పార్టీ అభ్యర్థిగా మోహన్ రాజ్ బరిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయ విప్లవం అంచులో ఉందని.. పాలక అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేకు వ్యతిరేకంగా ఈ విప్లవం సాగే దిశలో ఉందని పేర్కొన్నాడు. ప్రజల కష్టాలను తీర్చడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని.. తాము చేసిన పొరపాట్ల నుంచి ఇవి పాఠాలను నేర్చుకోలేదని కమల్ దుయ్యబట్టాడు.