మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్
మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.
మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం. మరో నాలుగు బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లు, GHMC సవరణ బిల్లుతోపాటు.. తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 కూడా సభ ఆమోదం కోసం ఉంచుతారు. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. అటు.. ఇవాళ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

