40 దాటితే ఉరేసుకుంటారా..? మోదీకి ఖర్గే సవాల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో 40 సీట్లు కూడా దాటిరావని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల ప్రచారంలో సొంతడబ్బా కొట్టుకుంటున్నారని.. తొలుత ఆయన పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలని, ఆ తర్వాతే తన గురించి మాట్లాడాలని, కాని అందుకు విరుద్ధంగా మోదీ ప్రచారం జరుగుతోందన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్కు 40 సీట్లకు మించి రావని […]
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో 40 సీట్లు కూడా దాటిరావని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల ప్రచారంలో సొంతడబ్బా కొట్టుకుంటున్నారని.. తొలుత ఆయన పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలని, ఆ తర్వాతే తన గురించి మాట్లాడాలని, కాని అందుకు విరుద్ధంగా మోదీ ప్రచారం జరుగుతోందన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్కు 40 సీట్లకు మించి రావని అంటున్నారని, అంతకుమించి సీట్లు వస్తే ఢిల్లీలోని విజయ్ చౌక్లో ఉరేసుకుంటారా? అని ప్రశ్నించారు.