AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌తో ఉంది.. భారతదేశాన్ని బెదిరిస్తున్న షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు!

ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ వెనుకబడటమే కాకుండా పాకిస్తాన్ కబంధహస్తాలలో పూర్తిగా చిక్కుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ దురాగతాల నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసింది భారతదేశం అయినప్పటికీ, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ భద్రత గురించి మాట్లాడుతుండడంతో దీని ప్రభావాలు కనిపిస్తున్నాయి. కమ్రాన్ సయీద్ ఉస్మానీ పాకిస్తాన్ జెండాతో పాటు బంగ్లాదేశ్ జెండాను చూపిస్తున్న వీడియోను విడుదల చేశారు.

'పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌తో ఉంది.. భారతదేశాన్ని బెదిరిస్తున్న షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు!
Kamran Saeed Usmani
Balaraju Goud
|

Updated on: Dec 24, 2025 | 10:10 AM

Share

ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ వెనుకబడటమే కాకుండా పాకిస్తాన్ కబంధహస్తాలలో పూర్తిగా చిక్కుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ దురాగతాల నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేసింది భారతదేశం అయినప్పటికీ, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ భద్రత గురించి మాట్లాడుతుండడంతో దీని ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఇప్పుడు భారతదేశాన్ని బెదిరించాడు.

భారతదేశం బంగ్లాదేశ్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ తన శక్తినంతా ఉపయోగించి ఢాకాకు అండగా నిలుస్తుందని ఉస్మానీ పేర్కొన్నారు. మే 2025లో భారతదేశం – పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదంపై కూడా కమ్రాన్ వ్యాఖ్యానించారు. కమ్రాన్ సయీద్ ఉస్మానీ పాకిస్తాన్ జెండాతో పాటు బంగ్లాదేశ్ జెండాను చూపిస్తున్న వీడియోను విడుదల చేశారు.

వీడియోలో, కమ్రాన్ సయీద్ ఉస్మానీ భారతదేశాన్ని బెదిరిస్తున్నాడు.”ఈ రోజు నేను రాజకీయ నాయకుడిగా కాదు, బంగ్లాదేశ్ నేల, చరిత్ర, త్యాగాలు, ధైర్యానికి సెల్యూట్ చేసే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. 2021లో ఈ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు, ఎవరూ నాతో లేరు. నేడు, అల్హమ్దులిల్లాహ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఉన్నాయి. ఈ రోజు, ఎటువంటి రాజకీయ ప్రకటన చేయను; నేను ఉస్మాన్ హాది గురించి మాట్లాడుతాను, ఆయన ఒక ఆలోచన, ధైర్య స్వరం. బంగ్లాదేశ్‌ను ఏ దేశానికి కాలనీగా మార్చనివ్వనని ఆయన చెప్పేవారు. బంగ్లాదేశ్ లోపల ఎవరి బెదిరింపులను అంగీకరించను.” అంటూ నోరు పారేసుకున్నాడు.

బంగ్లాదేశ్ ప్రజలు నేడు భారతదేశాన్ని పూర్తిగా తిరస్కరించారని కమ్రాన్ సయీద్ అన్నారు. బంగ్లాదేశీయులకు పాకిస్తాన్ పూర్తిగా అండగా ఉన్నామని చెప్పాలనుకుంటున్నానన్నారు. ఏదైనా దేశం బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి, బంగ్లాదేశ్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాకిస్తాన్ ప్రజలు మీతో నిలబడతారని తెలిపారు. పాకిస్తాన్ సైన్యం, మా క్షిపణులు మీకు దూరంగా లేవు. ఆపరేషన్ బన్యన్ అల్ మార్సూస్ ద్వారా ఎదుర్కొన్న విధంగానే అదే విధిని అనుభవిస్తానని కమ్రాన్ ప్రగల్భాలు పలికాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..