AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో తాబేళ్ల జాతర..! గహిర్‌మాతా బీచ్‌లో అద్భుత దృశ్యం.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Gahirmatha Beach : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని గహిర్‌మాతా బీచ్‌లో మొత్తం1.48 కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పొదిగినట్లు అధికారులు

ఒడిశాలో తాబేళ్ల జాతర..! గహిర్‌మాతా బీచ్‌లో అద్భుత దృశ్యం.. చూస్తే ఆశ్చర్యపోతారు..
Tortoise
uppula Raju
|

Updated on: May 11, 2021 | 10:35 AM

Share

Gahirmatha Beach : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని గహిర్‌మాతా బీచ్‌లో మొత్తం1.48 కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పొదిగినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ శిశువు తాబేళ్లు తల్లులు లేకుండానే జన్మిస్తాయి. ఈ మానవరహిత ద్వీపంలో సముద్రపు నీటిలో కలిసిపోవడానికి గుడ్డు పెంకులు విరగొట్టుకొని బయటికి వస్తాయి. ఏప్రిల్ 25 న తాబేళ్లు వాటి గుడ్ల పెంపకం నుంచి బయటపడటం ప్రారంభించాయి.

నాసి- II ద్వీపంలో గుడ్లు పెట్టడానికి ఆడ తాబేళ్లు తవ్విన 2.98 లక్షల గూళ్ళ నుంచి తాబేలు పిల్లలు బయటపడ్డాయి. దీంతో అంతరించిపోతున్న జాతుల భద్రతను నిర్ధారించడానికి వన్యప్రాణి అధికారులు రౌండ్-ది-క్లాక్ చర్యలు తీసుకుంటున్నారు. గూళ్ళ నుంచి బయటికి వచ్చిన తాబేళ్లు బీచ్‌లో ఒక గంట సేపు ఉండి ఆపై సముద్రం వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.

అంతరించిపోతున్న జాతుల కోసం గహిర్మాతా బీచ్ ప్రపంచంలోనే అతిపెద్ద గూడు మైదానంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 3.49 లక్షల ఆడ తాబేళ్లు గహిర్మాతా బీచ్ వద్దకు సామూహిక గూడు కోసం వచ్చాయి. గూళ్ళు దెబ్బతినకుండా, ఎక్కువగా చెక్కుచెదరకుండా ఉన్నందున తాబేళు పిల్లలు ఎక్కవగా వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రతి ఆడ ఆలివ్ రిడ్లీ తాబేలు 100 నుంచి 120 గుడ్లు పెడుతుంది. 45-50 రోజుల తరువాత శిశువు తాబేళ్లు గుడ్ల నుంచి బయటికి వస్తాయి.

ఉత్తర కొరియాలో జీరో కొవిడ్ కేసులు..! అనుమానం వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు.. కిమ్ ఏం చెబుతున్నాడంటే..?

Pawan Kalyan: ఆ దుస్థితి వల్లే ఈ విషాదం.. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

Gas Cylinder Booking: వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ.800 వరకు తగ్గింపు.!! ఎలాగంటే.!