AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Village: అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట.. ఎందుకు ఇలా జరుగుతోంది.. ఎక్కడుంది..

ఈ ప్రపంచం రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు కూడా భూమిపై ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ రోజు  అలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే...

Mysterious Village: అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట.. ఎందుకు ఇలా జరుగుతోంది.. ఎక్కడుంది..
Mysterious Village
Sanjay Kasula
|

Updated on: Jul 23, 2021 | 7:58 PM

Share

మన ఇప్పటికి చాలా సార్లు చదవి ఉంటాం.. సినిమాల్లో కూడా చూసి ఉంటాం. ప్రతి నగరంలో ఓ భూతాల బంగ్లా.. భూత్ భవన్.. ఇలాంటివి కొన్ని సార్లు భయపెడుతుంటాయి.. కొన్నిసార్లు అంతేగా అంటూ కొట్టిపారేస్తుంటాం.. అక్కడ మనిషి వెళ్ళిన తర్వాత తిరిగి రాడు.. కానీ వాస్తవానికి ఇంతటి వెంటాడే స్థలాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కాకపోతే ఈ రోజు మీకు అలాంటి ఓ గ్రామం గురించి  చెప్పబోతున్నాం. ప్రపంచంలో అంతా ఈ గ్రామాన్ని ‘చనిపోయినవారి నగరం’ అని కూడా పిలుస్తుంటారు.

ఈ ప్రపంచం రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు కూడా భూమిపై ఇలాంటి రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా.. ఈ రోజు  అలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే అది చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడకు వెళ్ళిన వారెవరూ తిరిగి  రాలేదు. మర్మమైన ఈ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని కూడా పిలుస్తారు.

మనం మాట్లాడుకుంటున్న ఈ గ్రామం రష్యాలోని ఉత్తర ఒస్సేటియాలోని దర్గావ్స్‌లో ఉంది. ఈ ప్రాంతం చాలా నిర్మాణుష్యంగా ఉంటుంది. ఆ ప్రదేశంను చూస్తేనే అదోలా ఉంటుంది. అక్కడ పక్షల కిల కిలరావాలు… గాలి నుంచి వచ్చే శబ్దాలు కూడా వినిపించవు. అంతా నిశబ్ధంగా ఉంటుంది. మీరు ఏ సమయంలో వెళ్లిన అలానే ఉంటుంది. అక్కడ అన్నీ ఎత్తైన పర్వతాలు ఉంటాయి . వాటి మధ్యలో దాగి ఉన్నట్లుగా ఈ గ్రామం ఉంటుంది. సహజంగా మనం ఏ గ్రామాన్ని… పట్టణాన్ని చూసినా స్వాగతం పలుకుతున్నట్లుగా… రా రామ్మని పిలుస్తున్నట్లుగా అనిపిస్తే ఇక్కడి ఈ గ్రామం మాత్రం మరోలా ఉంటుంది. ఓ చిన్న కొండపై తెల్ల రాళ్లతో కట్టిన 90 కి పైగా క్రిప్ట్ ఆకారపు ఇళ్ళు ఇటువైపు ఎందుకు చూస్తున్నారు అన్నట్లుగా ఉంటాయి.

ఈ ఇళ్ళు 14 వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి

అయితే అసలు కథలోకి వస్తే.. ఇక్కడి స్థానిక ప్రజలు తమ కుటుంబాల సభ్యుల మృతదేహాలను అందులో పాతిపెట్టారట. ఈ ఇళ్లలో చాలా వరకు నాలుగు అంతస్తుల భవనాలే  మనకు ఇక్కడ కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న ఆలోచన మరణం తరువాత కూడా ప్రజలు ఒకరితో ఒకరు భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండాలని వీటిని నిర్మించారన చెప్పుకుంటారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ బహుళ అంతస్తుల భవనాలు 14 వ శతాబ్దంలో నిర్మించబడ్డాయని అంటారు.

పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ సమాధుల సమీపంలో పడవలు లభించాయి. స్వర్గం చేరుకోవడానికి ఆత్మ నదిని దాటవలసి ఉంటుందని ఇక్కడి వారి నమ్మకం… అందుకే ఇక్కడ చనిపోయినవారితోపాటు ఓ పడవ వదిలిపెడుతుంటారు. కాబట్టి మృతదేహాలను పడవలో ఖననం చేయడం వీరి ఆచారం అని చరిత్రకారులు తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం… ప్రతి భవనం ముందు ఓ నిధి నిక్షేపాలతో కూడిన ఓ బావి కూడా ఉందని అంటారు. పురాతన కాలంలో మృతదేహాలను ఇక్కడ ఖననం చేసిన తర్వాత బావిలో నాణేలు విసిరినట్లు చెబుతారు. నాణెం నేరుగా అందులోని రాళ్లను  తాకినట్లయితే, ఆత్మ స్వర్గానికి చేరిందని నమ్ముతారు. ఒకప్పుడు కష్టతరమైన ఈ ‘నగరానికి’ ప్రవేశించిన వారు తిరిగి రారని నమ్ముతారు. అయితే ఈ భవంతుల్లోని శవాలు కుళ్ళి పోకుండా ఉన్నాయని అక్కడి పరిశోధకులు చెబుతుంటారు. ఇవి ఎందుకు కుళ్ళి పోలేదనేది మాత్రం ఎవరికి అందని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి: TTD – Anti Drone: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. ఆలయ రక్షణలో డీఆర్‌డీవో సాంకేతికత

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..

PM Kusum: రైతులకు మరో గొప్ప అవకాశం.. వ్యవసాయ క్షేత్రంలోనే బిజినెస్.. ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి