AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency Landing: శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. ఫ్లైట్‌లో137 మంది ప్రయాణికులు..

ఇండిగో విమానం 6E897 ఉదయం 5.10 గంటలకు బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయబడింది. విమానంలో మొత్తం 137 మంది ఉన్నారు. ప్రయాణికులందరికీ

Emergency Landing: శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. ఫ్లైట్‌లో137 మంది ప్రయాణికులు..
Indigo Flight Emergency Lan
Jyothi Gadda
|

Updated on: Apr 04, 2023 | 2:37 PM

Share

Indigo Flight Emergency Landing: బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానం 6E897 ఉదయం 5.10 గంటలకు బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయబడింది. విమానంలో మొత్తం 137 మంది ఉన్నారు. ప్రయాణికులందరికీ రెండో విమానాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. బెంగళూరు నుంచి వారణాసికి విమానం బయలుదేరింది.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తున‌కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే, వార‌ణాసి వెళ్లే ప్ర‌యాణికుల కోసం మ‌రో విమానాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇండిగో విమానంలో సాంకేతిక స‌మ‌స్య ఉత్ప‌న్నం అయిన‌ట్లు పైలెట్ గుర్తించార‌ని పేర్కొన్నారు.

అంతకుముందు ఏప్రిల్ 1న ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరిన కార్గో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. అలర్ట్‌ జారీ చేసిన తర్వాత తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. పక్షి ఢీకొనడంతో విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, కొంత సేపటి తర్వాత విమానం తిరిగి బయలుదేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..