AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇద్దరు అబ్బాయిలను చెట్టుకు కట్టేసి కొట్టారు..ఎక్కడంటే

ఈ ఇద్దరు బాలురు తమ కూతురిని వేధించేవారని తండ్రీకొడుకులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు మేకల మేత కొనేందుకు తమ పిల్లలు ఆ గ్రామానికి వెళ్లారని.. మేత విషయంలోనే గొడవ జరిగిందని బాధితుల తండ్రి ఆరోపిస్తున్నారు.

బాలికపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇద్దరు అబ్బాయిలను చెట్టుకు కట్టేసి కొట్టారు..ఎక్కడంటే
Uttar Pradesh News
Surya Kala
|

Updated on: Jan 31, 2023 | 1:21 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఇద్దరు బాలురకు దారుణమైన శిక్ష విధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ  అబ్బాయిలను చెట్లకు కట్టేసి కొట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు జోక్యం చేసుకుని ఆ బాలురిద్దరినీ విడుదల చేశారు. అదే సమయంలో… వీడియో వైరల్ కావడంతో..  పోలీసులు చర్యలు తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడైన తండ్రీ కొడుకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లాలోని కొత్వాలి నగర్ ప్రాంతంలోని నూర్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం మేరకు నూర్పూర్ గ్రామంలో నివాసముండే మజ్బుల్లా అనే బాలుడు మరో బాలుడితో కలిసి.. మేకకు మేత కోసం ఖస్పారియా గ్రామానికి వెళ్లారు.

జనగామ భూమిలోని చింత చెట్టు నుండి ఆకులు తెంపుకుని ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన త్రిలోకి, అతని కుమారుడు సోను వీరిద్దరినీ పట్టుకుని తాడుతో చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గుమిగూడారు. స్థానికులు జోక్యం చేసుకుని బాలురిద్దరినీ విడిపించారు.

ఇద్దరి బాలురు మేకల మేత కోసం వెళ్లిన సమయంలో అక్కడ తండ్రీ కొడుకులు ఉన్నారు. ఇద్దరు బాలురను చూసి ఓకే చెట్టుకు తాళ్లతో కట్టేశారు. తర్వాత పిల్లలిద్దరినీ తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. స్థానికులు బాలురిద్దరినీ విడిపించారు. ఈ ఇద్దరు బాలురు తమ కూతురిని వేధించేవారని తండ్రీకొడుకులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు మేకల మేత కొనేందుకు తమ పిల్లలు ఆ గ్రామానికి వెళ్లారని.. మేత విషయంలోనే గొడవ జరిగిందని బాధితుల తండ్రి ఆరోపిస్తున్నారు. ఆ అబ్బాయిలిద్దరూ ఎనిమిదేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడ్డారని చెబుతున్నారు. అయితే గతంలో కూడా బాలురు.. తండ్రీకొడుకుల మధ్య ఏదో గొడవ జరిగిందని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

బారాబంకి పోలీస్‌స్టేషన్‌లో బాధితుల తండ్రి ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులు త్రిలోకి, సోనులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరైతే దోషి అవుతారు. వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us